johnydanylee Posted March 1 Report Posted March 1 ఎల్ టీఐ మైండ్ ట్రీ సంస్థ తన ఉద్యోగుల జీతాల పెంపునకు కొత్త మెలిక పెట్టింది. అదేమంటే.. తమ దగ్గర పని చేసే మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను లింకు పెట్టింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఇదంతా ఎందుకన్న దానిపై సంస్థ స్పష్టత ఇస్తోంది. తమ పాత్రల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు.. కొత్త టెక్నాలజీల అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మిడిల్.. సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ పోటీ పరీక్షలో కోడింగ్.. మ్యాథ్స్.. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ తో సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. టీంలను లీడ్ చేసే విషయంలోనూ.. సంస్థ ఎదుగుదలకు అవసరమైన సాంకేతిక.. నిర్వహణ సామర్థ్యాల్ని అంచనా వేసేందుకు వీలుగా ఈ టెస్టును రూపొందించినట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారికి ఈ పరీక్షలు నిర్వహించి.. దాని ఫలితాల ఆధారంగా జీతాల పెంపు ఉంటుందని చెబుతున్నారు. ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొదటి భారత ఐటీ సంస్థగా ఎల్ టీఐ మైండ్ ట్రీ గా చెబుతున్నారు. పని తీరులో మదింపు.. నైపుణ్యాల ఆధారంగా వ్యవహరించే ఈ ప్రక్రియకు మిగిలిన కంపెనీలు అనుసరించినా ఆశ్చర్యం లేదంటున్నారు జీతాల పెంపు వెనుక చాలానే అంశాలు ఉంటాయని.. ఈ పరీక్షల పేరుతో మరింత వేధింపులకు గురి చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.