appusri Posted March 7 Report Posted March 7 YS Jagan: మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్కు వ్యవహారమంతా షర్మిల వెనకుండి నడిపిస్తున్నారు ఆమెపై ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవు న్యాయం కోసమే ఈ పిటిషన్లు ఎన్సీఎల్టీకి నివేదించిన జగన్ సరస్వతి పవర్లో వాటాల వివాదం ఈనాడు, హైదరాబాద్: తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఆమెపై గౌరవమని, అయితే చెల్లి వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని పేర్కొన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు పిటిషన్ వేసిన విషయం విదితమే. ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటరుతోపాటు సరస్వతి పవర్, డైరెక్టర్ చాగరి జనార్దన్రెడ్డి వేసిన కౌంటర్లు, తనను పిటిషన్ను నుంచి తొలగించాలంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు. ‘షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగింది. మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్రణాళిక ప్రకారం తల్లిని ముందుంచి నడిపించింది. వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో తల్లి, ఇతరులను అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల మాకు నష్టం వాటిల్లింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా నేనూ, భారతీ అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు’ అని జగన్ పేర్కొన్నారు. ‘షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు. నిర్వహణలో భాగస్వామి కాలేదు. ఏ నష్టాలకూ హామీ ఇవ్వలేదు. కంపెనీలపై నమోదైన కేసులను ఎదుర్కోలేదు. అయినా తల్లిని బలిపశువును చేసి, మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ చట్టంలోని సెక్షన్-59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినపుడు.. సరైన కారణముంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్కు ఉంది. ప్రతివాదులు ఈ పిటిషన్కు తప్పుడు భాష్యం చెబుతూ దీనిపై ట్రైబ్యునల్ విచారించకుండా, కుటుంబ వివాదంగా మార్చుతున్నార’ని జగన్ ఆక్షేపించారు. పథకం ప్రకారమే తప్పించాలన్న అభ్యర్థన పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ పేర్కొన్నారు. చెల్లి ఒత్తిడితో గిఫ్ట్డీడ్లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారన్నారు. ‘గిఫ్ట్డీడ్ ప్రక్రియ పూర్తికాలేదు. వాటాల సర్టిఫికెట్లను మేమింకా అమ్మకు అందజేయలేదు. వాటాలు బదలాయించలేదు. అసంపూర్తి గిఫ్ట్డీడ్తో వాటాల బదలాయింపు పూర్తైనట్లు కాదు. చట్టప్రకారం బదలాయింపు జరిగితేనే, చెల్లుబాటు అవుతుంద’ని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసినట్లు తెలిపారు. ప్రస్తుత కేసులో బోర్డు డైరెక్టర్లు అక్రమంగా వాటాల బదలాయింపును ఆమోదించారని, అయితే, బోర్డు సమావేశం సమాచారం తనకు తెలియదంటూ ఒక డైరెక్టర్ పేర్కొన్నారని ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు. సరస్వతి పవర్లోని వాటాలను కోర్టు కేసులన్నీ పూర్తయ్యేదాకా అమ్మ వద్ద ఉంచామని, షర్మిల వల్లే విజయమ్మ ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ‘చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవం. క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపుతో సరస్వతి పవర్లో 48.99% వాటా ఉందన్నది వాస్తవమే. గిఫ్ట్డీడ్ ఇచ్చినంత మాత్రాన వాటాలు బదలాయించినట్లు కాదు, ఆ వాటాలపై పూర్తి హక్కులు దాతవే. చెల్లిపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో నా ఆస్తులను భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలనుకున్నా. అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ‘ఈ కేసులన్నీ తేలాకే’ అంటూ ఎంవోయూలో స్పష్టంగా ఉంది. అయినా, అలాంటి ఒప్పందమేదీ లేదని అమ్మ చెప్పడం అవాస్తవం. షర్మిల మోసపూరిత చర్యల వల్ల ఆ ఒప్పందమూ ఆగిపోయింది. తుదకు దాన్ని రద్దు చేసుకున్నట్లు గతంలోనే చెప్పిన విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణించాల’ని కోరారు. అక్రమ బదలాయింపునకు షర్మిలే కారణం వాటాల అక్రమ బదలాయింపునకు కారణం షర్మిలేనని జగన్ పేర్కొన్నారు. ‘గతంలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఆమె చేసిన మోసం, అక్రమ చర్యల వల్ల ఇప్పుడు లేవు. పాత తేదీలతో, సృష్టించిన పత్రాలతో, తప్పుడు అఫిడవిట్లతో మోసగించారు. నా ఆస్తిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నార’ని ఆరోపించారు. ‘కంపెనీలో వాటాదారు, డైరెక్టర్, నిర్వహణలో ఆమె పాత్ర ఉందని మేం చెప్పలేదు. మా మధ్య ఎంవోయూను షర్మిల ప్రస్తావించడం లేదు. ఇదే వివాదంపై షర్మిల నాకు లేఖలు రాసిన సంగతిని గుర్తించాలి. అమ్మ ద్వారా ప్రయోజనాలు ఆశిస్తున్న షర్మిల ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు. మరోవైపు గిఫ్ట్డీడ్, వాటాలపై అమ్మకున్న హక్కులపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుతో షర్మిలకు సంబంధముంది. ఆమె పిటిషన్ను తొలగించాలని కోరడం సరికాదు’ అని వివరించారు. విచారణ ఏప్రిల్ 3కు వాయిదా సరస్వతి పవర్లో వాటాదారుల పేర్లు సవరించి, తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. గురువారం ట్రైబ్యునల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.