psycopk Posted March 24 Author Report Posted March 24 Arey banglore pichi battai AP lo em undo ledo neku em tesulu ra?? Sakshi vadi script chadavatam tappa YS Jagan: ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశాం: జగన్ 24-03-2025 Mon 12:48 | Andhra కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసింది రైతు భరోసా నిధులూ ఇవ్వలేదని మాజీ సీఎం ఆరోపణ సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని మండిపడ్డ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలుచేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు మంగళం పాడారని విమర్శించారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కాదు తాము అధికారంలోకి వచ్చాక రైతుకు రూ.26 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు 26 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ‘కళ్లు మూసుకుంటే ఏడాది గడిచిపోయింది. మళ్లీ కళ్లుమూసుకుని తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయి. రైతు సోదరులకు ఒకటే చెబుతున్నా.. మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం. ఇప్పుడు పెండింగ్ లో పెట్టిన నిధులను విడుదల చేస్తాం. ఇన్ పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా, రైతు భరోసా నిధులు అందజేస్తాం’ అని జగన్ చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేస్తూ.. అయినప్పటికీ పార్టీ తరఫున రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు పంట బీమా డబ్బులు అందించేలా చూస్తామన్నారు. అదేవిధంగా, వైసీపీ తరఫున కూడా ఎంతోకొంత సాయం అందించే ప్రయత్నం చేస్తామని మాజీ సీఎం జగన్ రైతులకు హామీ ఇచ్చారు. Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Accheannayudu: రాయలసీమలో వడగళ్ల వాన బీభత్సం... నష్టం అంచనా వేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడు 23-03-2025 Sun 21:43 | Andhra కడప, అనంతపురం జిల్లాల్లో వడగళ్ల వానలు దెబ్బతిన్న పంటలు అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో సంభవించిన వడగళ్ల వాన, ఈదురు గాలులు పంటలకు నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలలో అరటి తోటలు నేలకూలాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకూలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సలహాలు, సహాయం అందించాలని పేర్కొన్నారు. Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Chandrababu Naidu: వడగళ్ల వానతో పంట నష్టం.... ఆరాతీసిన సీఎం చంద్రబాబు 23-03-2025 Sun 22:35 | Andhra రాయలసీమ జిల్లాల్లో వడగళ్ల వానలు అనంతపురంలో రైతుల ఆత్మహత్యాయత్నం మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం పంట నష్టంపై సమీక్ష అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సమీక్ష జరిపారు. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. దాదాపు 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.