Jump to content

***** BREAKING : Simhachalam lo goda kooli 8 people died *****


Recommended Posts

Posted
11 minutes ago, Redarya said:

Nikrishtapu chavu chastadu. Abadhalu chebithe vadu. Helana chesthe nuvvu. Helicopter Sakshi gaa

Bochu le…manodu sampe type ae kani sache type kadu le…

pushakarallo publicity kosam 28 mandi ni…100 days celebrations kosam animal fat ani abadhanni nammukunodu…shapalu papalu emi workout ayitayi….Vennipotu sakshi ga..!

  • Upvote 2
Posted

Andhra: Techie couple among seven killed in wall collapse at Simhachalam temple

Officials have confirmed seven deaths following the completion of the rescue operation by the National Disaster Response Force (NDRF) and the police. Earlier reports had indicated eight fatalities. The victims include four men and three women. Three injured devotees have been hospitalized at King George Hospital in Visakhapatnam.

Andhra-Techie-couple-among-seven-killed-
 

Visakhapatnam: A techie couple are among seven devotees killed in a wall collapse during an annual festival at Sri Varaha Lakshmi Narasimha Swamy temple at Simhachalam here in the early hours of Wednesday.

The officials have confirmed seven deaths as the rescue operation was completed by the National Disaster Response Force (NDRF) and the police. Initial reports had put the death toll at eight.

The deceased include four men and three women. Three devotees, who were injured, have been admitted to King George Hospital in Visakhapatnam.

A techie couple from the Visakhapatnam district was among the victims of the tragic accident. Pilla Uma Maheswara Rao (30) and Pilla Sailaja (26) were employed with HCL and Infosys in Hyderabad, and were working from home.

The couple, who married three years ago, hailed from Chandrapalem village in Madhurawada of Visakhapatnam.

Sailaja’s mother, Venkat Ratna (45), and aunt G. Mahalakshmi (65) were also killed in the wall collapse.

The other deceased were identified as Durgaswamy Naidu (33) and K. Manikantha (28), both residents of East Godavari district, and Yedla Venkat Rao (45) of Visakhapatnam.

The incident occurred around 3.15 a.m. when devotees were queued up to buy tickets for darshan during Chandanotsavam, an annual festival.

The devotees were waiting to buy Rs 300 tickets for ‘Nijaroopa darshanam’. During the annual festival, the thick sandalwood covering on the idol will be removed. The rituals were to begin in the early hours of the day.

The NDRF personnel rushed to the spot and launched the rescue operation with the help of police and other personnel.

Home Minister Vangalapudi Anitha, Visakhapatnam district Collector M.N. Harendhira Prasad, and Police Commissioner Shanka Brata Bagchi supervised the rescue operations.

Chief Minister N. Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, IT Minister Nara Lokesh and other ministers expressed shock over the incident.

The Chief Minister ordered a probe by a three-member committee. He also announced Rs 25 lakh ex gratia each for the families of the deceased and Rs 3 lakh each to the injured.

Posted
8 hours ago, Pahelwan4 said:

Iron leggu babu

em bathukulura ayya..janalu sacharu ante aadidi iron leg veedi golden leg anukuntu..no wonder

Posted

Some people here are too toxic, finding solace in blaming others during such mishaps. Sick. 

Posted

 

Anitha Vangalapoodi: గోడ కూలుతుందని ఎవరూ అనుకోలేదు... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత 

30-04-2025 Wed 13:34 | Andhra
Simhachalam Temple Wall Collapse 7 Devotees Dead Minister Anitha Announces Strict Action
 

 

  • సింహాచలం ఆలయం వద్ద గోడకూలి ఏడుగురి మృతి
  • తాము దర్శనం చేసుకుని వచ్చాక గోడ కూలిన ప్రమాదం గురించి తెలిసిందన్న అనిత
  • అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో కూడా తాము ఇక్కడే ఉన్నామని వెల్లడి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు.

సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు మరణించారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, తాను కూడా రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించానని అనిత చెప్పారు. "ఇది ఊహించని ఘటన. గోడ కూలుతుందని ఎవరూ ఊహించలేరు. అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో మేం కూడా ఇక్కడే ఉన్నాం, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదు" అని తెలిపారు.

గోడ కూలిన ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది? కాంట్రాక్టర్ ఎవరు? నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు ఉంటుందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాచలం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. గోడ కూలిన ఘటనపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా, బాధితుల కుటుంబాల్లో అర్హులైన వారికి దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.  

 

 

 

Posted

Jagan Mohan Reddy: సింహాచలం ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖకు వెళుతున్న జగన్ 

30-04-2025 Wed 12:47 | Andhra
Jagan to Visit to Simhachalam Victims
 

 

  • సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి ఏడుగురు మృతి... పలువురికి గాయాలు
  • కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను, బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్
  • ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించనున్నారు.

తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన నేరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజీహెచ్) వెళతారు. అక్కడ, సింహాచలం దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి తన సానుభూతిని తెలియజేయనున్నారు.

సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటనపై వైఎస్ జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ. 300 టికెట్ క్యూలైన్‌పై గోడ కూలి భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇలాంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.
Posted

Vellampalli Srinivas: పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి: వెల్లంపల్లి 

30-04-2025 Wed 14:26 | Andhra
Simhachalam Temple Tragedy Vellampalli Blames AP Govt
 

 

  • సింహాచలం ఆలయం వద్ద ఏడుగురి మృతి ప్రభుత్వ వైఫల్యమేనన్న వెల్లంపల్లి
  • చందనోత్సవ ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించారని మండిపాటు
  • మంత్రులు అక్కడే ఉన్నా ఏర్పాట్లను పట్టించుకోలేదని విమర్శ
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.

చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిందని వెల్లంపల్లి అన్నారు. నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమీక్షా సమావేశాల్లో పాసుల పంపిణీపై చర్చించారే తప్ప, భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మంత్రులు అక్కడే ఉన్నా ఏర్పాట్లను పట్టించుకోలేదని, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ, వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై మాట్లాడాలని కోరారు. ఘటనలపై కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడొద్దని హెచ్చరించారు.
Posted

Lakshmi Parvati: చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి 

30-04-2025 Wed 14:15 | Andhra
Lakshmi Parvati Criticises Chandrababu Naidu Again
 

 

  • దేవుడి పేరుతో అన్యాయాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపాటు
  • సింహాచలం ఘటన బాధాకరమని వ్యాఖ్య
  • బాధితులకు కోటి చెప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొందరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి అపశృతులు, బాధాకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు తనను తాను నాస్తికుడిగా గతంలోనే చెప్పారని తెలిపారు. 2014లో చంద్రబాబు హయాంలోనే 40 ఆలయాలను కూల్చివేశారని, అయినా బీజేపీ ఆయనను సమర్థించడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు.

గతంలో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, గోవుల మృతి వంటి ఘటనలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఎవరు ఎలా పోయినా ఫర్వాలేదు, తమ దోపిడీ తమకు ముఖ్యం అన్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఉంది అని ఆమె విమర్శించారు. సింహాచలం ఘటనకు సంబంధించి గోడ నిర్మాణంపై ప్రశ్నిస్తూ, "మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి? ముందే ఎందుకు నిర్మించలేదు? అవినీతిపరులకు పనులు అప్పగించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి" అని ఆమె ఆరోపించారు.

అర్హత లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని లక్ష్మీపార్వతి అన్నారు. సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుమలలో గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చేపట్టిన విచారణ ఏమైందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Posted

KTR: సింహాచలం ఘటనపై కేటీఆర్ ఆవేదన 

30-04-2025 Wed 11:18 | Both States
KTR Expresses Grief Over Simhachalam Temple Tragedy
 

 

  • సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి పలువురి మృతి
  • ఈ వార్త తనను తీవ్రంగా బాధించిందన్న కేటీఆర్
  • ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని వ్యాఖ్య
సింహాచలం ఆలయం వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద వార్త తనను తీవ్రంగా బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని, బాధితులందరికీ తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అది కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Posted

PM Modi: సింహాచలం దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌ 

30-04-2025 Wed 10:33 | National
PM Modis Condolences on Simhachalam Temple Tragedy
 

 

  • సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశ్రుతి
  • మృతుల కుటుంబాలకు ప్ర‌ధాని మోదీ ప్రగాఢ సానుభూతి 
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌
  • అలాగే గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఇస్తామ‌న్న ప్ర‌ధాని
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల‌కు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

గాయ‌ప‌డిన వారు త్వరగా కోలుకోవాలని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Posted

Nara Lokesh: సింహాచ‌లం దుర్ఘ‌ట‌నపై మంత్రి లోకేశ్‌, పురందేశ్వ‌రి దిగ్భ్రాంతి 

30-04-2025 Wed 10:14 | Andhra
Simhachalam Temple Tragedy Ministers Nara Lokesh Purandeswari  Offer Condolences
 

 

  • ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్న మంత్రి లోకేశ్‌
  • మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి 
  • క్యూలైన్‌లో ఉన్న ఏడుగురి మృతి బాధాక‌ర‌మ‌న్న పురందేశ్వ‌రి
  • దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర మంత్రుల సంతాపం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నారు. క్ష‌త‌గాత్రుల‌కు విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. 

బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. హోంమంత్రి అనిత ప్ర‌మాద‌స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న‌ట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. 

స్వామివారి ద‌ర్శ‌నం కోసం వెళ్లి.. ఏడుగురు చనిపోవ‌డం బాధాక‌రం: పురందేశ్వ‌రి 
సింహాచ‌లం దుర్ఘ‌ట‌నపై బీజేపీ ఏపీ రాష్ట్ర‌ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి ద‌ర్శ‌నం కోసం క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భ‌క్తుల మృతి బాధాక‌ర‌మ‌న్నారు. స్వామివారి చందనోత్సవ స‌మ‌యాన ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. 

అటు ఈ దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ మంత్రులు నారాయ‌ణ‌, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి ర‌వి, సంధ్యారాణి, కొల్లు ర‌వీంద్ర‌, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని సత్య‌ప్ర‌సాద్‌, అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.     
Posted

Simhachalam Appanna: సింహచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు .. నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న 

30-04-2025 Wed 10:01 | Andhra
Simhachalam Appanna Darshan Devotees Flock to Witness the Deity
 

 

  • స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
  • క్యూలైన్లలో బారులుతీరి అప్పన్న స్వామిని నిజరూపంలో దర్శించుకుంటున్న భక్తులు
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి చందనోత్సవంలో పాల్గొని నిజరూపంలో వరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున ఒంటి గంటకు స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలుపు పలికారు. ఆ తరువాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా తొలగించారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు.

ఆలయంలో వైదిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువ జామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.

తదుపరి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్న సాధారణ భక్తులు నిజరూపంలో అప్పన్నను దర్శించుకుంటున్నారు. కాగా రూ.300ల టికెట్ కౌంటర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో ఆలయం వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 
Posted

Chandrababu Naidu: సింహాచలం మృతులకు రూ. 25 లక్షల పరిహారం 

30-04-2025 Wed 09:52 | Andhra
Simhachalam Temple Wall Collapse Rs 25 Lakh Compensation Announced
 

 

  • రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి ఏడుగురు భక్తుల మృతి
  • క్షతగాత్రులకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం
  • ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపింది. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు. 

టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
Posted

Uma Maheswara Rao: సింహాచలం ఘటనలో ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం 

30-04-2025 Wed 09:59 | Andhra
IT Couple Dies in Simhachalam Temple Incident
 

 

  • మృతులు మధురవాడ చంద్రంపాలెం వాసులు
  • హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోం
  • మూడేళ్ల క్రితం వివాహం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. 
Posted

Chandrababu Naidu: సింహాచలం దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి 

30-04-2025 Wed 08:22 | Andhra
Chandrababu Naidu expresses grief over Simhachalam temple tragedy
 

         

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...