Jump to content

CBN signs MoU for quantum valley with TCS and IBM


Recommended Posts

Posted

Heading says TCS and IBM

 

But why is ex Tana fraud Jayshankar Talluri one of the URSA clusters promoters there ?

 

Openly committing biggest fraud in history of India 

  • Upvote 1
Posted
Just now, vetrivel said:

Heading says TCS and IBM

 

But why is ex Tana fraud Jayshankar Talluri one of the URSA clusters promoters there ?

 

Openly committing biggest fraud in history of India 

Mundu tg gov ichina lands venkai tesukunda mee paytms hadavidi ki??

Posted
2 minutes ago, psycopk said:

Mundu tg gov ichina lands venkai tesukunda mee paytms hadavidi ki??

Unfortunate things is gumpu will do anything to destroy TG

 

Since that is what his boss Cbn wants

 

Coming to ursa

 

Giving costly vizag lands so cheap to TANA is really bad

 

Every promoter of Ursa is from TANA

tana.org/profile/106
tana.org/profile/630
https://www.tana.org/public/profile/8
 

Im so sad AP has to witness the biggest fraud and cant do anything$s@d

 

Posted

Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... టెక్ దిగ్గజాలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం 

02-05-2025 Fri 15:09 | Andhra
Andhra Pradesh to Build Quantum Valley in Amaravati
 

 

  • అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం
  • ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీతో ఏపీ ప్రభుత్వ ఎంవోయూ
  • భారత్ లోనే తొలి, శక్తివంతమైన ఐబీఎం 'క్వాంటం సిస్టం 2' ఏర్పాటు
  • 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కంప్యూటర్
  • 2026 జనవరి 1న కార్యకలాపాల ప్రారంభ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం నేడు ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం.. భారతదేశంలోనే మొట్టమొదటి, అత్యంత శక్తివంతమైన ‘క్వాంటం సిస్టం 2’ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "ఇది ఏపీకే కాదు, దేశానికే చారిత్రక దినం" అని ఆయన అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు. పనుల పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

భారత్‌లో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్‌ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశోధన, అభివృద్ధికి ఊతం లభిస్తుందని టీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
20250502fr6814927e5b651.jpg
Posted
18 minutes ago, vetrivel said:

Unfortunate things is gumpu will do anything to destroy TG

 

Since that is what his boss Cbn wants

 

Coming to ursa

 

Giving costly vizag lands so cheap to TANA is really bad

 

Every promoter of Ursa is from TANA

tana.org/profile/106
tana.org/profile/630
https://www.tana.org/public/profile/8
 

Im so sad AP has to witness the biggest fraud and cant do anything$s@d

 

Neku anta seen ledu… nee kosam anna news undi ga.. nee detective narada hat deni meda vadu

Raj Kasi Reddy: ఏపీ లిక్కర్ స్కామ్... ప్రారంభమైన రాజ్ కసిరెడ్డి వారం రోజుల సిట్ విచారణ 

02-05-2025 Fri 14:26 | Andhra
Raj Kasi Reddy in SIT Custody in AP Liquor Scam
 

 

  • రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
  • విజయవాడ సిట్ కార్యాలయంలో కొనసాగుతున్న దర్యాప్తు
  • జగన్ సన్నిహితుడిగా రాజ్ కు గుర్తింపు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు కసిరెడ్డిని విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న అనుమతినిచ్చిన నేపథ్యంలో, సిట్ అధికారులు ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడని ప్రచారంలో ఉంది.

విజయవాడ జిల్లా జైలులో ఉన్న కసిరెడ్డిని సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని విచారించి, తిరిగి జిల్లా జైలుకు అప్పగించనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన నుంచి, డిస్టిలరీలకు అనుమతులు, నెలవారీ మామూళ్ల వరకు మొత్తం వ్యవహారం కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని, ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే, కేసు లోతుపాతులను వెలికితీసేందుకు కసిరెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం, కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారాలు నడిచాయనే కోణంలో సిట్ అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచిందన్న ఆరోపణల నేపథ్యంలో, నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, పాత్రపై సిట్ దృష్టి సారించినట్లు సమాచారం.
Posted

Narendra Modi: అమరావతికి మణిహారంలా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్... నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న మోదీ 

02-05-2025 Fri 15:23 | Andhra
Modi to Virtually Inaugurate Missile Testing Range near Amaravati
 

 

  • కృష్ణా జిల్లా గుల్లలమోద క్షిపణి కేంద్రంలో రూ.1500 కోట్ల పనులకు నేడు ప్రధాని శంకుస్థాపన
  • డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం
  • ప్రాంత అభివృద్ధి, స్థానికులకు ఉపాధి అవకాశాలు
  • 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం రాష్ట్ర రాజధాని అమరావతికి ఒక మణిహారంగా నిలవనుంది. దేశ రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక స్థానంలో నిలబెట్టే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తొలి దశ పనులకు (సుమారు రూ.1500 కోట్లు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు. ఇది కేవలం కృష్ణా జిల్లాకే కాకుండా, మొత్తం అమరావతి రాజధాని ప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యతను ఇనుమడింపజేసే పరిణామం.

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో, సుదీర్ఘ నిరీక్షణ (14 ఏళ్లు) తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా క్షిపణి పరీక్షల నిర్వహణకు గుల్లలమోద భౌగోళికంగా అత్యంత అనుకూలమైనది కావడంతో డీఆర్‌డీవో దీనిని ఎంపిక చేసింది. ఒడిశాలోని బాలాసోర్ తర్వాత, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరీక్షల కోసం ఈ కేంద్రం కీలకం కానుంది.ఈ ప్రాజెక్టు అమరావతికి కేవలం వ్యూహాత్మక ప్రాధాన్యతనే కాదు, గణనీయమైన అభివృద్ధిని కూడా తీసుకురానుంది.

మౌలిక సదుపాయాలు: ప్రాజెక్టుతో పాటు గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్తు, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు భారీగా అభివృద్ధి చెందుతాయి. ఇది అమరావతికి అనుబంధంగా అభివృద్ధి చెందే ప్రాంతాలకు ఊతమిస్తుంది.
ఉపాధి అవకాశాలు: ఈ కేంద్రం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రక్షణ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో అమరావతి చుట్టుపక్కల పారిశ్రామిక వాతావరణం మెరుగుపడుతుంది.
ఆర్థిక ప్రగతి: సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం, రాబోయే ఐదేళ్లలో డీఆర్‌డీవో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుండటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. దీని ప్రభావం సమీపంలోని రాజధాని ప్రాంతంపైనా సానుకూలంగా ఉంటుంది.

దేశ రక్షణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాజధాని అమరావతికి సమీప ప్రాంతం వేదిక కావడం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచనుంది. భవిష్యత్తులో మరిన్ని రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు రాష్ట్రానికి, ప్రత్యేకించి అమరావతి ప్రాంతానికి తరలివచ్చేందుకు ఇది దోహదపడుతుంది. మొత్తంగా, గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం, అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయిగా, దాని కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Posted

 

Amaravati: అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి! 

02-05-2025 Fri 13:08 | Andhra
New Bridge Opens Connecting Amaravati Faster Than Ever
 

 

  • కృష్ణా నదిపై 3.11 కి.మీ పొడవైన 6 వరుసల భారీ వంతెన ప్రారంభం
  • విజయవాడ నగరాన్ని దాటి, నేరుగా అమరావతి చేరుకునే సౌలభ్యం
  • గొల్లపూడి, చిన్న అవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కితే నిమిషాల్లో రాజధానికి
  • హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికులకు సమయం ఆదా
  • ప్రధాని పర్యటన, అమరావతి పనుల పునఃప్రారంభానికి కీలక మౌలిక సదుపాయం
రాజధాని అమరావతికి ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వారధి ద్వారా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా, అతి తక్కువ సమయంలో నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

ప్రధానమంత్రి పర్యటన, అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం నేపథ్యంలో ఈ వంతెనను అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జి, అమరావతికి అత్యంత వేగవంతమైన అనుసంధానతను అందిస్తుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు గొల్లపూడి వద్ద ఈ వంతెన ఎక్కితే కేవలం ఐదు నిమిషాల్లోనే కృష్ణా నదిని దాటి అమరావతిలోని వెంకటపాలెం చేరుకోవచ్చు. అదేవిధంగా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కి, విజయవాడ ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా అరగంటలోపే అమరావతిలోకి ప్రవేశించే వీలు కలిగింది.

ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవ్వడంతో పాటు, అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు, నిర్మాణ సామగ్రి రవాణా కూడా సులభతరం కానుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఇరువైపులా వేర్వేరు మార్గాలు, సూచికలు, డివైడర్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్గం అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది. 

 

 

 

Posted
5 minutes ago, psycopk said:

Neku anta seen ledu… nee kosam anna news undi ga.. nee detective narada hat deni meda vadu

 

Raj Kasi Reddy: ఏపీ లిక్కర్ స్కామ్... ప్రారంభమైన రాజ్ కసిరెడ్డి వారం రోజుల సిట్ విచారణ 

02-05-2025 Fri 14:26 | Andhra
Raj Kasi Reddy in SIT Custody in AP Liquor Scam
 

 

  • రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
  • విజయవాడ సిట్ కార్యాలయంలో కొనసాగుతున్న దర్యాప్తు
  • జగన్ సన్నిహితుడిగా రాజ్ కు గుర్తింపు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు కసిరెడ్డిని విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న అనుమతినిచ్చిన నేపథ్యంలో, సిట్ అధికారులు ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడని ప్రచారంలో ఉంది.

విజయవాడ జిల్లా జైలులో ఉన్న కసిరెడ్డిని సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని విచారించి, తిరిగి జిల్లా జైలుకు అప్పగించనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన నుంచి, డిస్టిలరీలకు అనుమతులు, నెలవారీ మామూళ్ల వరకు మొత్తం వ్యవహారం కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని, ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే, కేసు లోతుపాతులను వెలికితీసేందుకు కసిరెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం, కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారాలు నడిచాయనే కోణంలో సిట్ అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచిందన్న ఆరోపణల నేపథ్యంలో, నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, పాత్రపై సిట్ దృష్టి సారించినట్లు సమాచారం.

Jagan and his gang are big frauds

 

No doubts in that

 

Cbn and Lokesh are even bigger frauds

 

Their only aim is to scam AP out of valuable lands

Posted
4 minutes ago, vetrivel said:

Jagan and his gang are big frauds

 

No doubts in that

 

Cbn and Lokesh are even bigger frauds

 

Their only aim is to scam AP out of valuable lands

Prati dantlo scam vetakatam good i appreciate… but last 5yrs chusav ga.. prati village ki ganja… oka investment ledu.. oka water project ledu .. scam aaina parledu they are working hard for AP development be happy that there is some one who thinks for AP bright future…. If u truly care about AP

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...