Jump to content

Recommended Posts

Posted

20250502pa68145a5988bc1.jpg

Chandrababu- నేడు రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డే రోజు: సీఎం చంద్ర‌బాబు 

02-05-2025 Fri 09:40 | Andhra
CM Chandrababu Naidu Welcomes Modi for Amaravati
 

 

  • నేడు అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం
  • ఈ ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ
  • ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ సీఎం చంద్ర‌బాబు ట్వీట్‌
  • ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన, ముఖ్యమైన రోజుగా పేర్కొన్న సీఎం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావతి పున‌ర్నిర్మాణ ప‌నులు లాంఛ‌నంగా ప్రారంభం కానున్నాయి. ఈ ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి వ‌స్తున్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. నేడు రాష్ట్ర ప్ర‌జలు గ‌ర్వ‌ప‌డే, ముఖ్య‌మైన‌ రోజు అని ముఖ్య‌మంత్రి అన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ చేశారు.
    
"ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన, ముఖ్యమైన రోజు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
మన ప్రజల రాజధాని అభివృద్ధిని తిరిగి ప్రారంభించడానికి అమరావతికి వస్తున్నారు. అమరావతి మన ఉమ్మడి ఆశలు, కలలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ పునఃప్రారంభం మన రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది ప‌లుకుతుంది" అని సీఎం చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.  

 


 

Posted

Narendra Modi: మోదీ అమరావతి పర్యటనకు సర్వం సిద్ధం... డ్రోన్ ఎగురవేయడానికి కూడా నో పర్మిషన్ 

02-05-2025 Fri 10:09 | Andhra
Modis Amaravati Visit Drone Restrictions  Tight Security
 

 

  • ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • సభాస్థలి, గన్నవరం విమానాశ్రయం చుట్టూ 5 కి.మీ. పరిధిలో నో ఫ్లై జోన్ అమలు
  • లక్షల మంది కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగా ప్రధాని సభ జరిగే ప్రాంతానికి, గన్నవరం విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల పరిధిని 'నో ఫ్లై జోన్‌'గా ప్రకటించారు. ఈ మేరకు డ్రోన్‌ కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేశారు.

ప్రధాని పర్యటన ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, ఈ పరిధిలో కనీసం డ్రోన్లను, బెలూన్లను ఎగురవేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడా బెలూన్లు కూడా ఎగరేయవద్దని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రధాని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతి సభాస్థలికి వస్తారు. ఇందుకోసం నాలుగు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఒకవేళ వాతావరణం అనుకూలించని పక్షంలో ప్రధానిని రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా అమరావతికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేశారు. ఈ మార్గాల్లో కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ను కూడా నిర్వహించారు.

సభకు హాజరయ్యే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది ఆర్డీవోలు, 200 మంది తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అత్యవసర వైద్య సేవల కోసం 30 వైద్య బృందాలు, 21 అంబులెన్స్‌లు, తాత్కాలిక ఆసుపత్రులను సిద్ధం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభా ఏర్పాట్లను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. 
Posted

Pawan Kalyan: ప్ర‌ధాని మోదీ అమృత హ‌స్తాల‌తో అమ‌రావ‌తి ప‌నుల పునఃప్రారంభం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ 

02-05-2025 Fri 11:08 | Andhra
Deputy CM Pawan Kalyan Herty Welcomes to PM Modi Inaugurates Amaravati Reconstruction
 

      

ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప‌నులు మొదలు కానున్నాయి. ఈ ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి వ‌స్తున్న ప్ర‌ధాని మోదీకి హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఈ మేర‌కు జ‌న‌సేనాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ పెట్టారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం... సుస్వాగ‌తం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున‌ర్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ప‌వ‌న్‌ ట్వీట్ చేశారు.

అమరావతిలో నో ఫ్లై జోన్
ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీట‌ర్ల‌ పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్‌ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కలా ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
Posted

Amaravati: రాజ‌ధాని పునఃప్రారంభోత్స‌వం.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా 'ఐర‌న్' శిల్పాలు 

02-05-2025 Fri 12:36 | Andhra
Amaravatis Grand Re inauguration Iron Sculptures Steal the Show
 

 

  • అమరావతి పునః నిర్మాణ సభ వద్ద ఐరన్ స్క్రాప్ శిల్పాలు ఏర్పాటు
  • తెనాలి కళాకారుడు వెంకటేశ్వరరావు బృందం రూపకల్పన
  • మోదీ, ఎన్టీఆర్, బుద్ధుడు, సైకిల్, మేక్ ఇన్ ఇండియా విగ్రహాల ప్రదర్శన
  • వ్యర్థ ఇనుముతో తయారీ, సభకు ప్రత్యేక ఆకర్షణ
  • ప్రజల నుంచి విశేష స్పందన
మ‌రికాసేపట్లో ఏపీ రాజ‌ధాని అమ‌రాతి ప‌నుల పునఃప్రారంభం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమ‌రావ‌తి ప‌నుల‌ను లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో వ్యర్థ ఇనుము (ఐరన్ స్క్రాప్)తో రూపొందించిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఈ కళాఖండాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెనాలికి చెందిన ప్రముఖ స్క్రాప్ ఆర్టిస్ట్ కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన బృందం ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు.

మెకానిక్ షెడ్లలో, ఇతర ప్రాంతాలలో వృధాగా పడేసిన పాత నట్లు, బోల్టులు, ఇనుప ముక్కలు వంటి స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించి, వాటితో ఎంతో నైపుణ్యంగా ఈ శిల్పాలను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ప్రతిమను ఆకట్టుకునే రీతిలో తయారుచేశారు. వీటితో పాటు అమరావతిని సూచించే బుద్ధుడి విగ్రహం, దాని వెనుక ధర్మచక్రం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రతీకగా నిలిచే సింహం బొమ్మను కూడా స్క్రాప్‌తోనే అద్భుతంగా తీర్చిదిద్దారు.

"అమరావతి పునః నిర్మాణం 2-5-2025" అనే అక్షరాలను కూడా పాత ఇనుప సామాగ్రితో కళాత్మకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల చిత్రాలను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించి ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా కళాకారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రధానమంత్రి అమరావతి పునః నిర్మాణ పనుల కోసం వస్తున్నారని తెలిసిన వెంటనే, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఒక ప్రత్యేక కళాఖండాన్ని అమరావతిలో ప్రదర్శించాలని భావించాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాల తయారీలో మాకు మంచి గుర్తింపు ఉంది, అందుకే ఈ మాధ్యమాన్నే ఎంచుకున్నాం" అని తెలిపారు. గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి నగరాల నుంచి స్క్రాప్‌ను సేకరించినట్లు ఆయన వివరించారు. 

సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక రైతులు కూడా ఈ కళాఖండాలను చూసి ముగ్ధులయ్యారని, వీటిని శాశ్వతంగా అమరావతిలోని ఏదైనా కూడలిలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెంకటేశ్వరరావు తెలిపారు.

20250502fr68146f9b9f460.jpg
Posted

Amaravati: అమరావతి సభకు పోటెత్తిన జనాలు... నిండిపోయిన సభాస్థలి ప్రాంగణం 

02-05-2025 Fri 15:03 | Andhra
Amaravatis Reopening Ceremony Draws Huge Crowd
 

 

  • అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభ వేడుక
  • ఉదయం నుంచే భారీగా తరలి వచ్చిన జన సందోహం
  • కిక్కిరిసిన సభా ప్రాంగణం, గ్యాలరీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అమరావతికి చేరుకున్నారు. 

కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వేడుకకు హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తాగునీరు, తాత్కాలిక ఆసుపత్రి, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది.

సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిగా అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
Posted

Narendra Modi: విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ..హెలికాప్టర్ లో అమరావతికి బయల్దేరిన పీఎం 

02-05-2025 Fri 15:17 | Andhra
PM Modi Arrives in Vijayawada for Amaravati Inauguration
 

 

  • తిరువనంతపురం నుంచి విజయవాడకు చేరుకున్న మోదీ
  • స్వాగతం పలికిన అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్
  • అమరావతిలో స్వాగతం పలకనున్న సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ప్రధాని తిరువనంతపురం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. భారత ప్రభుత్వ అధికారిక విమానంలో ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. 

అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో నేరుగా ఏపీ సచివాలయం లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వీరంతా సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అమరావతిలోని సభాస్థలి లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది.
Posted

 

Narendra Modi: వెలగపూడిలో మోదీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

02-05-2025 Fri 15:52 | Andhra
Modis Grand Welcome in Velagapudi
 

 

  • రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్న ప్రధాని మోదీ
  • సభా ప్రాంగణానికి ప్రధానితో పాటు బయల్దేరిన సీఎం, డిప్యూటీ సీఎం
  • 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న పీఎం
ఆంధ్రుల కలల రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. కేరళ తిరువనంతపురం కార్యాక్రమంలో పాల్గొన్న ప్రధాని... అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు అధికారిక విమానంలో చేరకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తీసుకెళ్లారు. 

కాసేట్లో ప్రధాని రాజధాని అమరావతి పనులతో పాటు, 18 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభాస్థలి ఇప్పటికే లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. సభకు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యారు. తమ కల సాకారమవుతోందని వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...