Jump to content

Bandi Sanjay read this..


Recommended Posts

Posted

Fire Accident: ప్రార్థనల కోసం వచ్చి.. ప్రాణాలకు తెగించి

దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలను లెక్కచేయకుండా ఐదుగురు యువకులు సాహసం చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని టీ తాగుతున్న గాజుల వ్యాపారి మీర్‌ జాహెద్,  మహ్మద్‌ ఆమేర్, మహ్మద్‌ ఇబ్రహీంతోపాటు మరో ఇద్దరు గుల్జార్‌హౌజ్‌ సమీపంలో ఉదయం 6.10కి ఓ భవనం నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని గమనించి అటువైపు వెళ్లారు. ఇద్దరు మహిళలు రక్షించండంటూ కేకలు వేయడం గుర్తించారు.

దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలను లెక్కచేయకుండా ఐదుగురు యువకులు సాహసం చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని టీ తాగుతున్న గాజుల వ్యాపారి మీర్‌ జాహెద్,  మహ్మద్‌ ఆమేర్, మహ్మద్‌ ఇబ్రహీంతోపాటు మరో ఇద్దరు గుల్జార్‌హౌజ్‌ సమీపంలో ఉదయం 6.10కి ఓ భవనం నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని గమనించి అటువైపు వెళ్లారు. ఇద్దరు మహిళలు రక్షించండంటూ కేకలు వేయడం గుర్తించారు. 

ప్రార్థనల కోసం వచ్చి.. ప్రాణాలకు తెగించి

గాజుల వ్యాపారి మీర్‌ జాహెద్‌

చార్మినార్, చాంద్రాయణగుట్ట, కేశవగిరి, రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలను లెక్కచేయకుండా ఐదుగురు యువకులు సాహసం చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని టీ తాగుతున్న గాజుల వ్యాపారి మీర్‌ జాహెద్,  మహ్మద్‌ ఆమేర్, మహ్మద్‌ ఇబ్రహీంతోపాటు మరో ఇద్దరు గుల్జార్‌హౌజ్‌ సమీపంలో ఉదయం 6.10కి ఓ భవనం నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని గమనించి అటువైపు వెళ్లారు. ఇద్దరు మహిళలు రక్షించండంటూ కేకలు వేయడం గుర్తించారు. ప్రాణాలకు తెగించి ఆ భవనంలోకి వెళ్లారు. ‘‘లోపలంతా పొగతో నిండి ఉంది. ఒకరు అక్కడే కుప్పకూలి కనిపించారు. గడ్డపార తీసుకుని షట్టర్‌ పగలగొట్టి లోపలికి వెళ్లగానే ఓ మహిళ పిల్లలను ఒడిలోపెట్టుకుని చనిపోయి కనిపించింది. రుమాల్‌ను ముక్కుకు కట్టుకుని ఫస్ట్‌ఫ్లోర్‌లోని రూమ్‌ నుంచి ఏడుగురిని బయటకు తీశాం. మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చాం. వారంతా అప్పటికే చనిపోయారు. చిన్నపిల్లలు పూర్తిగా కాలిపోయారు. స్పాట్‌లోనే ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటే.. కొందరి ప్రాణాలు కాపాడగలిగేవాళ్లం’’ అని జాహెద్‌ తెలిపారు. ఈ క్రమంలో మీర్‌ జాహెద్, మహ్మద్‌ ఆమేర్, మహ్మద్‌ ఇబ్రహీం చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

 

ప్రార్థనల కోసం వచ్చి.. ప్రాణాలకు తెగించి

భవనంలోకి వెళ్లేందుకు చేసిన రంధ్రం

ఒడిలోనే తల్లడిల్లి: ‘‘మంటలు వ్యాపించిన భవనంలో మహిళలు తమ చిన్నారులను కాపాడుకునేందుకు ఒడిలో పెట్టుకున్నారు. కానీ మంటల్లో ఆహుతయ్యారు. చిన్నారుల్ని ఒడిలో కూర్చొబెట్టుకుని అలాగే ప్రాణాలొదిలిన ఆ దృశ్యం చూసి కన్నీళ్లొచ్చాయి. భారమైన మనసుతో పెద్దల ఒడి నుంచి పిల్లల్ని బయటకు తీసుకొచ్చాం’’ అని యువకులు తెలిపారు. 


 

ఆప్తులను కాపాడి.. అగ్నికి ఆహుతయ్యాడు 

గ్నిప్రమాద ఘటనలో తమ కుటుంబ సభ్యులను కాపాడటం కోసం అభిషేక్‌(40) చేసిన ప్రయత్నం గురించి గుర్తుచేసుకుంటూ అతని మృతదేహం దగ్గర బంధువులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. ప్రహ్లాద్‌మోదీ సోదరుడి కుమారుడే అభిషేక్‌ మోదీ. మంటల నుంచి కొందరిని అభిషేక్‌ బయటకు పంపించాడు. అతనూ బయటకి వచ్చాడు. ఇంకా చాలామంది లోపల ఉన్నట్లు గుర్తించి... వారిని కాపాడేందుకు మళ్లీ లోపలికి పరుగెత్తాడు. ఈ క్రమంలో తమ సోదరి పిల్లలు గుడియా, ఆశ తదితరులను బయటకి పంపించాడు. అప్పటికే మంటలు మొత్తం వ్యాపించాయి. అయినా తన ప్రాణాలు లెక్క చేయకుండా లోనికి పరిగెత్తి మరో బందువును బయటకు పంపించాడు. ఈక్రమంలో మంటలకు ఆహుతయ్యాడు. 

  • Like 2
Posted

Matham kantey mundhu manam manushalam ani gurthu pettukunnaru.  Pranalaku theginchi kaapadadam is  appreciable. 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...