Jump to content

KTR to settle properties, anduke na ee foreign trip?


Recommended Posts

Posted

 

 

KTR: అమెరికా, లండన్ పర్యటనకు బయల్దేరిన కేటీఆర్

27-05-2025 Tue 12:22 | Telangana
KTR Embarks on USA and London Tour

 

  • డాలస్‌లో తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
  • లండన్‌లో ‘ఇండియా వీక్ 2025’లో కేటీఆర్ కీలక ప్రసంగం
  • వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులతో కేటీఆర్ సమావేశాలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా అమెరికాలోని డాలస్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల్లో కూడా కేటీఆర్ పాల్గొంటారు.

కేటీఆర్ తన పర్యటనలో భాగంగా మొదట యూకే వెళ్లనున్నారు. ఈ నెల 30న లండన్‌లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్ఠాత్మక "ఇండియా వీక్ 2025" సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఈ వేదికపై కేటీఆర్, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణల గురించి వివరించనున్నారు. తెలంగాణ విజయ ప్రస్థానాన్ని, అభివృద్ధి నమూనాని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయనున్నారు.

అదే రోజు వార్విక్‌లో, మొబిలిటీ టెక్నాలజీ రంగంలో తెలంగాణకు చెందిన ఆవిష్కరణలకు నిదర్శనంగా నిలిచిన ప్రాగ్మాటిక్‌ డిజైన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (PDSL) నాలెడ్జ్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ సంస్థలకు పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సేవలను అందించనుంది. ఇందులో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్‌వేర్-ఇన్-లూప్ (HIL) టెస్ట్ సెంటర్ కూడా ఉంది.

యూకే పర్యటన ముగించుకున్న అనంతరం కేటీఆర్ అమెరికా వెళ్తారు. అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో ఉన్న కొమెరికా సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ భారీ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారని అంచనా.

జూన్ 2న కేటీఆర్, డాలస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (యూటీ డాలస్)లో భారతీయ విద్యార్థులతో సమావేశమవుతారు. తన ప్రసంగాలు, పనితీరుతో యువతకు స్ఫూర్తిగా నిలిచే కేటీఆర్, ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో కేటీఆర్ వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో సమావేశమై తెలంగాణ ప్రగతిని, ఇక్కడి అవకాశాలను వివరించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరారు. కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటన పట్ల అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Posted

Kavitha: తెలంగాణ జాగృతి నేతలతో కవిత సమావేశం

27-05-2025 Tue 14:13 | Telangana
Kavitha Key Meeting with Telangana Jagruthi Leaders

 

  • బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశం
  • సింగరేణి ప్రాంత జాగృతి నేతల హాజరు
  • ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు.

ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు, తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. 
Posted

Kavitha: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు... తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత

26-05-2025 Mon 22:01 | Telangana
Kavitha Reacts Strongly to ACB Notices to KTR

 

  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ చర్యలని ఆరోపణ
  • సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగమేనని విమర్శ
  • బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న కవిత
  • ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటామని ధీమా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వచ్చాయని అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తోందని ఆమె తన 'ఎక్స్‌' ఖాతాలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, "ప్రభుత్వ వైఫల్యాల నుంచి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ అయినట్లు స్పష్టమవుతోంది" అని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించినా, వాటన్నింటినీ తట్టుకుని నిలబడే చరిత్ర కేసీఆర్ సైనికులకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Posted

KTR: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు... కేటీఆర్ పిలుపు 

27-05-2025 Tue 19:53 | Telangana
KTR Calls for Telangana Formation Day Celebrations on June 2nd
 

 

  • జూన్ 2న తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహణ
  • జాతీయ పతాకం, పార్టీ పతాకాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపు
  • అన్ని జిల్లా కార్యాలయాలు, నియోజకవర్గాల్లోనూ సంబరాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

అదేవిధంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలను ఎగురవేసి సంబరాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లోనూ జాతీయ పతాకాన్ని, గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అవతరణ సంబరాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని కేటీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, "14 ఏళ్ల అలుపెరగని పోరాటం, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి" అని తెలిపారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు.

"కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచింది" అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభాల్లా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకూ గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా ఈ వేడుకల్లో పాల్గొని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలను విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు.
Posted

NVSS Prabhakar: కేసీఆర్ కుటుంబంలో మరో సంచలనం.. కవిత మరో షర్మిల అవుతారు: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు 

27-05-2025 Tue 19:08 | Telangana
NVSS Prabhakar Comments Kavitha Will Become Another Sharmila
 

 

  • కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయన్న బీజేపీ నేత ప్రభాకర్
  • పార్టీలతో కుదిరిన డీల్ బయటపడిందనే కవిత ఆందోళన చెందుతున్నారని ఆరోపణ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపణ
  • రాబోయే ఆరు నెలలు తెలంగాణకు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అత్యంత కీలకమని వ్యాఖ్య
ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన అంశంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో త్వరలో మరో సంచలనం చోటుచేసుకోనుందని ఆయన అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరాయని, కవిత భవిష్యత్తులో మరో షర్మిలగా మారే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.

"కవిత బాధ... తాను కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడిందని కాదు... రాజకీయ పార్టీలతో రహస్యంగా కుదిరిన ఒక ఒప్పందం బహిర్గతమైందనేదే ఆమె అసలు ఆవేదన" అని ప్రభాకర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడుకోవడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఇరు పార్టీల నేతల మధ్య రాజీ కుదిరిందని ఆయన ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందం విషయం ఎలా బయటకు పొక్కిందనే అంశంపై కేసీఆర్ కుటుంబంలోని నలుగురు కీలక సభ్యుల మధ్య తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

"రాబోయే ఆరు నెలల కాలం తెలంగాణ రాష్ట్రానికి, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకం కానుంది" అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిజ స్వరూపాలను ప్రజల ముందుంచుతామని, వారి బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
Posted

Kavitha: జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు: రఘునందన్ రావు జోస్యం 

27-05-2025 Tue 17:36 | Telangana
Kavitha to Announce New Party on June 2 Says Raghunandan Rao
 

 

  • షర్మిల మాదిరి కవిత పాదయాత్ర చేస్తారన్న రఘునందన్ రావు
  • దెయ్యాల మధ్య కవిత పదేళ్లు ఎలా ఉన్నారని ప్రశ్న
  • తండ్రీకూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకన్న రఘునందన్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, తాజాగా మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 

జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఆమె తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ షర్మిల మాదిరి పాదయాత్ర కూడా చేపడతారని ఆయన వ్యాఖ్యానించారు. "కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు. మరి ఇప్పుడు ఆయనే దెయ్యం ఎలా అయ్యారు?" అంటూ రఘునందన్ రావు సందేహం వ్యక్తం చేశారు. "అలాంటి దెయ్యాల మధ్య పదేళ్ల పాటు రాజకీయం ఎందుకు చేసినట్లు?" అంటూ కవితను ఉద్దేశించి ఆయన చురకలంటించారు. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులను పంపించారని... తండ్రీకూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. 
Posted
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are.... Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a filmmaker, I put years of hard work behind my craft & for me, filmmaking is everything. You didn't get it. You won't get it. You will never get it. Aisa karo.... Agli baar poori kahani bolna... kyunki mujhe jarra bhi farak nahi padtha. #dirtyPRgames I like this kahawath very much 🙂 खुंदक में बिल्ली खंबा नोचे !
 
 
 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...