Jump to content

Ipac team back on duty.. accident venka nee hand leka pote chalu ra jagga


Recommended Posts

Posted

YS Jagan Mohan Reddy: మానవత్వం చాటుకున్న జగన్... రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను పలకరించిన వైనం 

29-05-2025 Thu 15:36 | Andhra
Jagan Mohan Reddy Helps Road Accident Victim in Tadepalli
 

 

  • తాడేపల్లి వారధి వద్ద రోడ్డు ప్రమాదం, వృద్ధురాలికి తీవ్ర గాయాలు
  • మాజీ సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందన
  • బాధితురాలికి తక్షణ వైద్యం అందించాలని ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌కు ఆదేశం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తాడేపల్లి సమీపంలోని వారధి వద్ద ఒక వృద్ధురాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె రెండు కాళ్లకూ దెబ్బలు తగిలాయి. విజయవాడలోని శిశువిహార్‌ నుంచి తాడేపల్లికి తిరిగి వస్తున్న జగన్‌ ఈ ఘటనను గమనించి, వెంటనే స్పందించారు. వాహనం దిగి బాధిత మహిళతో మాట్లాడారు. 

బాధితురాలిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య సహాయం అందించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌కు ఆయన అప్పగించారు. ఆయన వెంటనే అటుగా వెళుతున్న ఒక ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఆపి, దానిలో వృద్ధురాలిని విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి వైద్య సేవలు అందేవరకు ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ, మానవత్వం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. 
Posted

Deni face chusi prati sari PA kosam ee aratam ee kanipistadi… asalu munda 17 ekkada katado nee PA tho vachi chupinchave

Vidadala Rajani: చంద్రబాబు పాలనపై విడదల రజని ఫైర్ 

29-05-2025 Thu 15:23 | Andhra
Rajani Criticizes Chandrababu Neglecting Poor Welfare
 

 

  • చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి పేరుతో తన వారికి మేలు చేస్తున్నారని విడదల రజని
  • పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ
  • వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక అభివృద్ధి పేరుతో కేవలం ఆయన అనుయాయులకే ప్రయోజనం చేకూరుతోందని, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని విడదల రజని అన్నారు. "పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను ఇలా పీడించడం తగదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పాలనలో రైతులు నిరసన బాట పట్టారని, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసే లేదని రజని ఆరోపించారు. "ఆర్థిక అభివృద్ధి పేరుతో మీ మనుషులకు మేలు చేస్తున్నారు తప్ప, పేదలకు సంక్షేమం అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇప్పుడు ఏ పథకం గురించి అడిగినా పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతి అంటున్నారంటూ" ఆమె మండిపడ్డారు.

జగన్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, వైద్య విద్యార్థుల ఆశలను నెరవేర్చాలని చూశారని రజని గుర్తుచేశారు. "కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని జగన్ గారు భావించారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఒక సంస్థతో సర్వే చేయించి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నివేదిక తెప్పించారు. వందల కోట్ల విలువైన ఆస్తులను, ఒక్కో కాలేజీని సంవత్సరానికి కేవలం 5 వేల రూపాయలకు లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యత నుంచి చంద్రబాబు సర్కారు తప్పుకోవడం సరికాదని విడదల రజని హితవు పలికారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పకుండా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ జగన్ చేసిన ఏర్పాట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేసిందని, దీనివల్ల గిరిజనులకు మళ్లీ డోలీ కష్టాలు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
Posted

Jaggadi negative energy…

 

Hyderabad: లోటస్‌పాండ్‌ వద్ద ఆటో డ్రైవర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం 

29-05-2025 Thu 14:11 | Telangana
Auto driver Shadif commits suicide at Lotus Pond Hyderabad
 

    

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ వద్ద ఆటో డ్రైవర్‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేసి, చెట్టుకు ఉరేసుకోవ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పరిశీలించారు. మృతుడిని టోలీచౌకికి చెందిన షాదిఫ్‌(28)గా గుర్తించారు. 

అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుప‌త్రికి తరలించారు. కాగా, ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.   

 

 

 

Posted

Pardha reddy asalu nee bratuki cbn peru ette arhta unda?? Ask ur self u idiot

YS Jagan: టీడీపీ మహానాడుపై జగన్ కామెంట్స్ 

29-05-2025 Thu 06:39 | Andhra
YS Jagan Comments on TDP Mahanadu as Drama
 

 

  • మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్న వైఎస్ జగన్
  • కడపలో మహానాడు నిర్వహించడం, తనను తిట్టడం హీరోయిజం కాదన్న జగన్
  • హీరోయిజం అంటే ఎన్నికల హామీలను నేరవేర్చడం, అది చంద్రబాబు వల్ల కాదన్న జగన్
మహానాడు ఒక పెద్ద డ్రామా అని, చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని, రాష్ట్రంలో ఏ ఇంటికైనా ఆ పార్టీ నేతలు వెళ్లి తాము ఈ పని చేశామని ధైర్యంగా చెప్పుకోగలరా అని జగన్ ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని, తనను తిట్టడం అంతకన్నా హీరోయిజం కాదని అన్నారు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడమేనని, వాటిని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.

సూపర్ సిక్స్, సెవెన్ పథకాలను గాలికి వదిలివేశారని, 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని అన్నారు. గ్యాస్ సిలెండర్లను సరిగా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అటకెక్కాయని, సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లల ట్యాబ్‌లు అన్నీ ఆగిపోయాయని మండిపడ్డారు.

తమ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన సరిగ్గా లేవని, చదివించుకోలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి మంగళం పాడారని అన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోగులకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని, రైతుల బతుకులు దళారుల పాలయ్యాయని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తాము రూ.2.73 కోట్లు డీబీటీ చేశామని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు. 
Posted

Nee kodukuni tomutaru le lopala vesi

Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం..విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సజ్జల 

29-05-2025 Thu 08:04 | Andhra
Sajjala Calls for Vennupotu Dinam on June 4 Against Chandrababu Government
 

 

  • జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
  • పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ 
  • ఎన్నికల హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమమని వెల్లడి
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని 'వెన్నుపోటు దినం'గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

వైకాపా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సజ్జల కోరారు.

ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సజ్జల సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైకాపా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 
Posted
1 hour ago, psycopk said:

Deni face chusi prati sari PA kosam ee aratam ee kanipistadi… asalu munda 17 ekkada katado nee PA tho vachi chupinchave

 

Vidadala Rajani: చంద్రబాబు పాలనపై విడదల రజని ఫైర్ 

29-05-2025 Thu 15:23 | Andhra
Rajani Criticizes Chandrababu Neglecting Poor Welfare
 

 

  • చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి పేరుతో తన వారికి మేలు చేస్తున్నారని విడదల రజని
  • పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ
  • వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక అభివృద్ధి పేరుతో కేవలం ఆయన అనుయాయులకే ప్రయోజనం చేకూరుతోందని, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని విడదల రజని అన్నారు. "పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను ఇలా పీడించడం తగదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పాలనలో రైతులు నిరసన బాట పట్టారని, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసే లేదని రజని ఆరోపించారు. "ఆర్థిక అభివృద్ధి పేరుతో మీ మనుషులకు మేలు చేస్తున్నారు తప్ప, పేదలకు సంక్షేమం అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇప్పుడు ఏ పథకం గురించి అడిగినా పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతి అంటున్నారంటూ" ఆమె మండిపడ్డారు.

జగన్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, వైద్య విద్యార్థుల ఆశలను నెరవేర్చాలని చూశారని రజని గుర్తుచేశారు. "కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని జగన్ గారు భావించారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఒక సంస్థతో సర్వే చేయించి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నివేదిక తెప్పించారు. వందల కోట్ల విలువైన ఆస్తులను, ఒక్కో కాలేజీని సంవత్సరానికి కేవలం 5 వేల రూపాయలకు లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యత నుంచి చంద్రబాబు సర్కారు తప్పుకోవడం సరికాదని విడదల రజని హితవు పలికారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పకుండా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ జగన్ చేసిన ఏర్పాట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేసిందని, దీనివల్ల గిరిజనులకు మళ్లీ డోలీ కష్టాలు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Script reading 

Pending bills veella ga pettendhi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...