Jump to content

Paytms mee future nasanam jaggadini nammukoni chillar panulu cheste


Recommended Posts

Posted

Vangalapudi Anitha: దీన్ని బట్టి కొమ్మినేని వ్యాఖ్యలను సుప్రీం కూడా తప్పుబట్టింది!: హోంమంత్రి అనిత

14-06-2025 Sat 18:59 | Andhra
Vangalapudi Anitha Fires at YSRCP Women Leaders

 

  • వైసీపీ మహిళా నేతల తీరుపై హోంమంత్రి అనిత తీవ్ర అసంతృప్తి
  • కొమ్మినేని వ్యాఖ్యలపై జగన్ మౌనం, మహిళల పట్ల చులకన భావానికి నిదర్శనమన్న అనిత
  • శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు, క్రైమ్ రేట్ తగ్గిందని స్పష్టం

వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ మహిళా నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంటే, దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు.

అమరావతిని "వేశ్యల రాజధాని" అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని మంత్రి అనిత అన్నారు. "అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు, వారి కుటుంబాలు నివసించడం లేదా?" అని ఆమె ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే, దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాస్‌కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో టీవీ డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా ఉందని, దీన్నిబట్టి ఆయన వ్యాఖ్యలు తప్పని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని అనిత గుర్తుచేశారు.

గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును, అంకబాబునుి, ఒక వృద్ధురాలిని అర్ధరాత్రి అరెస్టు చేయించిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. "తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్లుంది వైసీపీ నేతల తీరు" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దిశ యాప్ గురించి మాట్లాడుతూ, కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గొప్పలు చెప్పారని, కానీ వాస్తవానికి 30 లక్షల మంది కూడా లేరని, అబ్బాయిల చేత కూడా బలవంతంగా డౌన్‌లోడ్ చేయించిన సందర్భాలున్నాయని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన శక్తి యాప్‌కు కోటి 50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే మహిళలకు కూడా ట్రావెలింగ్ అసిస్టెన్స్ అందిస్తున్నామని తెలిపారు.

శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి స్పష్టం చేశారు. కడపలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడు భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఉదహరించారు. తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడే పరిస్థితిని తాము కల్పిస్తున్నామని అన్నారు. 

పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడటానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పేటీఏం బ్యాచ్‌ను వెంటేసుకుని వెళ్లి పోలీసులపై రాళ్లు రువ్వించారని ఆరోపించారు. తెనాలిలో రౌడీ షీటర్‌ను పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, చివరికి మహిళలు దాచుకున్న స్త్రీనిధి రూ.2000 కోట్లను కూడా డైవర్ట్ చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. "15వ ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేశారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. డైవర్షన్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు" అని అన్నారు. 'తల్లికి వందనం' పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.13,000 చొప్పున, రూ.2,000 స్కూల్ మెయింటెనెన్స్‌కు కేటాయిస్తుంటే, దానిపై కూడా బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని, ఇప్పుడు తాము డీఎస్సీ నిర్వహిస్తుంటే దాన్ని ఆపడానికి కోర్టులకు వెళ్లారని విమర్శించారు. "నేను కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటించిన డీఎస్సీలోనే టీచర్‌గా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు ఆయన మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నాను. ఇది చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం" అని అనిత పేర్కొన్నారు.

పోదిలి ఘటనపై మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ముస్లిం మహిళలపై వైసీపీ గూండాలు దాడులు చేశారని, దీని వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. మహిళలను అగౌరవపరిచేలా ఎవరు మాట్లాడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
Posted
11 minutes ago, psycopk said:

 

 

Roja: అందుకే జగన్ అంటే నమ్మకం... బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు: రోజా

14-06-2025 Sat 15:02 | Andhra
Roja Slams Chandrababu Naidu Over Talliki Vandanam Scheme

తల్లికి వందనంపై చంద్రబాబు మాట తప్పారంటూ రోజా ఫైర్
కేంద్రీయ విద్యాలయాల్లో చదివేవారిని అనర్హులను చేశారని ఆరోపణ
మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ అంటూ ట్వీట్


తల్లికి వందనం పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతోందని, తల్లులను మోసం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న తీరుకు పొంతన లేదని ఆమె విమర్శించారు.

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని, వాటి గురించి ప్రశ్నిస్తే నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రోజా ఘాటుగా స్పందించారు. "చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి విద్యార్థి తల్లికి 'తల్లికి వందనం' పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అడ్డగోలు షరతులు విధిస్తూ కొందరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ?" అంటూ రోజా నిలదీశారు.

ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే, మరోవైపు షరతులతో వాటికి కోతలు విధిస్తున్నారనేది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యంగా 'తల్లికి వందనం' పథకం విషయంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులను పూర్తిగా అనర్హులుగా చేయడం దారుణమని రోజా అన్నారు. "గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి 'అమ్మ ఒడి' పథకం ద్వారా లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు పథకాన్ని ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ (UDISE Plus) నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు" అని రోజా తెలిపారు.

పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతూ, మరోవైపు ఇలా లబ్ధిదారులను తగ్గించడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకెన్ని కోతలు విధిస్తుందోననే ఆందోళన ప్రజల్లో ఉందని రోజా వ్యాఖ్యానించారు. "అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు" అని పేర్కొన్నారు. ఈ మేరకు రోజా ట్వీట్ చేశారు. 
Posted

chudandi ra paytms.. ambotu em cheptunado... meru opposition antunadu.. meru emo anna kosam s*** kosukuntam antaru...

Ambati Rambabu: జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు

16-06-2025 Mon 17:09 | Andhra
Ambati Rambabu Condemns Governments Actions Against YS Jagan

 

  • జగన్ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని అంబటి మండిపాటు
  • జగన్ బందోబస్తు బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్య
  • చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని ఎద్దేవా

ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళుతుంటే... ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోందని విమర్శించారు. జగన్ అసలు బయటకే రావద్దన్నట్టుగా పోలీసుల వైఖరి ఉందని అన్నారు. 

జగన్ బందోబస్తు ఏర్పాటు బాధ్యత పోలీసులదేనని.... జగన్ పర్యటించొద్దని అనడం కరెక్ట్ కాదని అంబటి చెప్పారు. జగన్ పర్యటనల సందర్భంగా హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని... ఆయన రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...