Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu: కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు భేటీ... వివరాలు ఇవిగో! 

15-06-2025 Sun 17:29 | Andhra
Chandrababu Naidu meets Piyush Goyal discusses AP issues
 

 

  • సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ
  • అమరావతిలో సమావేశం
  • హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లపై కేంద్రమంత్రికి చంద్రబాబు వినతి
  • పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గించాలని కోరిక
  • ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌ జీఎస్టీపైనా చర్చ
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖామంత్రి పియూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో  జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు కీలకమైన అంశాలపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర రైతులు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా, హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పొగాకు ధరలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో, రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే సుమారు రూ.300 కోట్ల వ్యయంతో 20 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నట్లు ఆయన కేంద్రమంత్రికి వివరించారు. ఈ ప్రక్రియ కోసం బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు పొగాకు కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న ఈ రూ.300 కోట్లలో, టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లను భరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. అంతేకాకుండా, పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి కీలక ప్రక్రియలను టొబాకో బోర్డు ద్వారా సమర్థవంతంగా నియంత్రించేందుకు వీలుగా ప్రస్తుత చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని కూడా ఆయన పీయూష్ గోయల్‌ను అభ్యర్థించారు.

పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. ఈ సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్' లక్ష్యాల సాధనకు కూడా ఈ నిర్ణయం ప్రతికూలంగా పరిణమిస్తుందని సీఎం గుర్తుచేశారు.

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన అధిక సుంకాల సమస్యను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరిపి, సుంకాల భారాన్ని తగ్గించేలా చూడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సీఫుడ్‌పై అమెరికా విధించిన 27 శాతం సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 8 లక్షల మంది ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆక్వా రైతులపై పడుతున్న ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్) పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా గోయల్‌కు తెలియజేశారు. రాష్ట్ర రైతాంగం, పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
20250615fr684eb531f010a.jpg20250615fr684eb54f20bc4.jpg20250615fr684eb564070ca.jpg
Posted

Thank you Jagan…Podili tour success.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...