psycopk Posted June 26 Report Posted June 26 YS Jagan: కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించింది: జగన్ 26-06-2025 Thu 15:04 | Andhra ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై జగన్ ధ్వజం రాజ్యాంగ ఉల్లంఘనలంటూ ఆరోపణ ఖనిజ సంపద తాకట్టు, సంఘటిత నిధి ప్రైవేటుపరం అంటూ విమర్శలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసి, రాజ్యాంగ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. 2025 జూన్ 25న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రెండో విడత నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీలు లేదా బాండ్లు) జారీని పూర్తి చేసిందని, 9.30 శాతం అధిక వడ్డీ (కూపన్) రేటుకు రూ. 5,526 కోట్లు సమీకరించిందని జగన్ తెలిపారు. దీంతో మొత్తం బాండ్ల విలువ రూ. 9,000 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో కేసు విచారణలో ఉందని, నోటీసులు కూడా జారీ అయ్యాయని గుర్తుచేశారు. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను ప్రభుత్వ రెవెన్యూ వ్యయాల కోసం వినియోగిస్తున్నారని స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా విస్మరించి, అపూర్వమైన రీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పార్టీలకు రాష్ట్ర సంఘటిత నిధిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించిందని జగన్ దుయ్యబట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా డైరెక్ట్ డెబిట్ ఆదేశాలు జారీ చేసి, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండానే ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) లను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఎన్సీడీ బాండ్లకు అదనపు హామీగా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను కేవలం రూ. 9,000 కోట్ల బాండ్ల కోసం తాకట్టు పెట్టిందని జగన్ విమర్శించారు. రాష్ట్ర సంఘటిత నిధికి ఇలా ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇవ్వడం, ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చూస్తుంటే, ఈ బాండ్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే రాష్ట్ర అభివృద్ధి రుణాల (ఎస్డీఎల్) కంటే ఎక్కువ సురక్షితమైనవిగా భావించాలా? అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఏపీఎండీసీ బాండ్లను 9.30 శాతం అధిక వడ్డీ రేటుకు జారీ చేశారని, ఇది ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి రుణాలపై ఉన్న వడ్డీ రేటు కంటే 2.60 శాతం ఎక్కువని జగన్ తెలిపారు. ఈ అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీఎండీసీపై ఏటా అదనంగా రూ. 235 కోట్ల భారం పడుతుందని, ఈ బాండ్ల కాలపరిమితి పదేళ్లుగా ఉందని తెలిసిందని అన్నారు. ఈ అదనపు భారం వల్ల లబ్ధి పొందింది ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ ఎన్సీడీల జారీతో, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 13 నెలల కాలంలో సమీకరించిన బడ్జెట్, ఆఫ్-బడ్జెట్ రుణాలు, గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న రుణాల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ప్రభుత్వ రుణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. Quote
Chatgpt2 Posted June 26 Report Posted June 26 1 hour ago, psycopk said: 1 hour ago, psycopk said: Chethagaani kojja CM chemba antunna @futureofandhra. Matter ledu Quote
Chatgpt3 Posted June 26 Report Posted June 26 On 6/26/2025 at 10:23 AM, Chatgpt2 said: Chethagaani kojja CM chemba antunna @futureofandhra. Matter ledu ... 1 Quote
Android_Halwa Posted June 26 Report Posted June 26 Appu chesi abadhalu seppetodi kante eede nayam… Desham tha takattu petti appu techinpanchi, danni wealth generation antadu.. Appu ni kuda wealth anukuntundu, jara maa baboru ninjaggadi degariki panpichandayya, wealth ante endo septadu Quote
Xtian_Teddy Posted June 26 Report Posted June 26 30 minutes ago, Chatgpt3 said: Chethajani kojja ex cm jaggadu ra. Bharu moonda daylight lo avi gaditho dabidi dibidi. ika meere seppali kojja evaro. lol day light kaadu 3 AM kada ani public saying Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.