Jump to content

Recommended Posts

Posted

YS Jagan: జగన్ కాన్వాయ్ నుంచి జారిపడ్డ వైసీపీ నేత 

09-07-2025 Wed 15:27 | Andhra
YSRCP Leader Falls from Jagan Convoy in Chittoor District
 

 

  • బంగారుపాళ్యంలో ఉద్రిక్తంగా మారిన జగన్ పర్యటన
  • అనుమతి లేకున్నా భారీ వాహనాలతో వైసీపీ శ్రేణుల రోడ్ షో
  • నియంత్రణకు పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్
  • హెలిప్యాడ్ వద్ద తోపులాట, కాన్వాయ్ నుంచి జారిపడ్డ నేత
  • ఇది దండయాత్రలా ఉందంటూ టీడీపీ నేతల విమర్శలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి దారితీసింది. వైసీపీ శ్రేణులు నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీగా తరలిరావడంతో పలుచోట్ల తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, జగన్ పర్యటన సందర్భంగా రోడ్ షోకు ఎలాంటి అనుమతులు లేనప్పటికీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. షరతులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ ముందే హెచ్చరించినా వారు లెక్కచేయలేదు. బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు జగన్ చేరుకోగానే గందరగోళం మొదలైంది. అక్కడ కేవలం 30 మందికే అనుమతి ఉండగా, వందలాది మంది ఒక్కసారిగా దూసుకురావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ నేత విజయానంద రెడ్డి కాన్వాయ్ వాహనం పైనుంచి జారిపడ్డారు.

అనంతరం బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్‌తో సమావేశమయ్యేందుకు 500 మందికి పోలీసులు అనుమతించారు. కానీ, జగన్ రాకముందే వేలాదిగా కార్యకర్తలు యార్డులోకి చొచ్చుకెళ్లడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది రైతులను పరామర్శించే యాత్రలా కాకుండా, ఓ దండయాత్రలా ఉందని వారు విమర్శించారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జరిగిన జగన్ పర్యటనల్లోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం గమనార్హం.
Posted

Nedi oka bokkalo paryataba malli danini diversion..

YS Jagan: నా పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్నపై దాడి: జగన్ ఫైర్ 

09-07-2025 Wed 12:40 | Andhra
YS Jagan Fires at AP Government Over Attack on Prasanna Kumar Reddy
 

 

  • ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందన్న జగన్
  • ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపణ
  • రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యాప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందన్నారు. వయసు పైబడిన ఆయన తల్లిని సైతం భయపెడుతూ టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన భయంకర దాడి అని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నేతను లక్ష్యంగా చేసుకుని ఇంత దారుణంగా దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు.

చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడికి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా, ఈ దాడి గురించే రాష్ట్రమంతా మాట్లాడుకోవాలనేది వారి పథకమని విమర్శించారు. చంద్రబాబు తన 'రెడ్ బుక్' రాజ్యాంగంతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని జగన్ మండిపడ్డారు. హింస ద్వారా, కక్ష సాధింపు రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...