Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu: చేనేతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ 

06-08-2025 Wed 09:27 | Andhra
Chandrababu Naidu AP Govt Announces Good News for Weavers
 
  • హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 
  • మగ్గాలకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ 
  • రూ.5 కోట్లతో నేతన్నలకు పొదుపు నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు
  • జాతీయ చేనేత దినోత్సవం నుంచి కొత్త నిర్ణయాల అమలు
చేనేతలకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా, నేతన్నలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో నిన్న సీఎం సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైన రంగమని, దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని నిర్ణయించింది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు.

తాజా నిర్ణయాలతో చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. దీని వల్ల చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతన్నలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం రూ. 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ (పొదుపు నిధి) ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Posted

Chandrababu Naidu: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

06-08-2025 Wed 08:49 | Andhra
Chandrababu Naidu AP Cabinet Meeting Today Key Discussions
 
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం, కొత్త రేషన్ కార్డుల జారీకి పచ్చజెండా ఊపనున్న కేబినెట్ 
ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆమోదం తెలుపనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేశారు.

అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు జీరో టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్‌ జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. మొత్తం బస్సుల్లో 74 శాతం బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్, మెట్రో ఎక్స్‌ ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డుల జారీ, నూతన బార్ పాలసీ అంశంపైనా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త అక్రిడిటేషన్, జర్నలిస్ట్‌ల సమస్యలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి నిన్న మీడియాకు తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఇటీవల సింగపూర్ లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రివర్గంలో సీఎం పంచుకోనున్నారు. ఇక, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలు, భారీ ఎత్తున నగదు బయట పడడం, అరెస్ట్‌లకు సంబంధించి కూడా చర్చించనున్నారు. 
Posted
6 minutes ago, psycopk said:

 

Chandrababu Naidu: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

06-08-2025 Wed 08:49 | Andhra
Chandrababu Naidu AP Cabinet Meeting Today Key Discussions
 
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం, కొత్త రేషన్ కార్డుల జారీకి పచ్చజెండా ఊపనున్న కేబినెట్ 
ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆమోదం తెలుపనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేశారు.

అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు జీరో టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్‌ జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. మొత్తం బస్సుల్లో 74 శాతం బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్, మెట్రో ఎక్స్‌ ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డుల జారీ, నూతన బార్ పాలసీ అంశంపైనా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త అక్రిడిటేషన్, జర్నలిస్ట్‌ల సమస్యలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి నిన్న మీడియాకు తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఇటీవల సింగపూర్ లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రివర్గంలో సీఎం పంచుకోనున్నారు. ఇక, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలు, భారీ ఎత్తున నగదు బయట పడడం, అరెస్ట్‌లకు సంబంధించి కూడా చర్చించనున్నారు. 

AP cabinet meeting ante….inkoka 10,000 acres paaye..!!! 
 

Adi cabinet meeting kadu, adi land dochese meeting

Posted

Inko 50 companies vastunai antadu…inkoka 10,000 aces istunam ani septadu…

paaye…

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...