Jump to content

AP cabinet key decisions


Recommended Posts

Posted

Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

06-08-2025 Wed 16:14 | Andhra
Chandrababu Naidu Announces Free Bus Travel for AP Women
 
  • ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  • పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశం
  • జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందన్న చంద్రబాబు
రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించకముందే... ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన సూచనను మెచ్చుకున్న చంద్రబాబు... ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయాంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలికగా అంగీకరించలేదని తెలిపారు. వైసీపీ హయాంలో సింగపూర్ కు వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని మండిపడ్డారు. 

మరోవైపు నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.... కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు.
Posted

Suman: ఏపీలో అభివృద్ధిపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

06-08-2025 Wed 14:57 | Entertainment
Actor Suman Interesting Comments on AP Development
 
  • ఏపీలో ప్రస్తుతం అభివృద్ధి బాగుందన్న సుమన్
  • తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచన
  • తమిళనాడులో పోటీ చేయాలని తనను అడిగారని వ్యాఖ్య
ఏపీ అభివృద్ధిపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని... ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని... ఆ ఎన్నికల గురించి  తర్వాత ఆలోచిస్తానని చెప్పారు. 

తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని... అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని... అయితే, తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. సుమన్ ఈరోజు గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Posted

Nara Lokesh: మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్ 

06-08-2025 Wed 14:39 | Andhra
Nara Lokesh Fulfilled Promise of Housing for Poor in Kurnool
 
  • కర్నూలు గూడెంకొట్టాల వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు
  • నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 150 నిరుపేద కుటుంబాలు
  • యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ
  • మాట నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చర్యలు
  • మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ
నాలుగు దశాబ్దాలుగా సొంత గూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కర్నూలు గూడెంకొట్టాల ప్రాంతంలోని 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడంతో వారి సొంతింటి కల సాకారమైంది. మంత్రి నారా లోకేశ్ తన 'యువగళం' పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన పంప్‌హౌస్‌ ప్రాంతంలో దాదాపు 150 కుటుంబాలు గత 40 ఏళ్లుగా పూరిగుడిసెల్లో నివసిస్తున్నాయి. తమకు శాశ్వత నివాస హక్కు కల్పించాలని వారు ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో, యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్‌ కర్నూలు వచ్చినప్పుడు, అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో ఈ గూడెంకొట్టాల వాసులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వారి సమస్యను సావధానంగా విన్న లోకేశ్‌, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా, 2025 జనవరిలో జీవో నెం.30ను జారీ చేసి, కోట్ల రూపాయల విలువైన ఎకరా ప్రభుత్వ స్థలాన్ని ఈ పేదలకు కేటాయించారు.

బుధవారం జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ స్వయంగా లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో నాలుగు దశాబ్దాల వారి ఎదురుచూపులు ఫలించాయని, ఇచ్చిన మాట ప్రకారం తమకు న్యాయం జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన ఒక హామీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని స్థానిక నాయకులు తెలిపారు.
  • Upvote 1
Posted

AP lo investments pedutam ani vaatunna companies ki land ivaleda ie cabinet meeting lo ?

Posted
3 minutes ago, Android_Halwa said:

AP lo investments pedutam ani vaatunna companies ki land ivaleda ie cabinet meeting lo ?

Ap people full clarity tho unnaru...daniki proof nee edupu

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...