psycopk Posted August 14 Report Posted August 14 YSRCP: హైకోర్టులో వైసీపీకి షాక్.. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమన్న హైకోర్టు 14-08-2025 Thu 15:56 | Andhra పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలంటూ వైసీపీ పిటిషన్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో షాక్ లో ఉన్న వైసీపీకి... ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అవకతవకలకు పాల్పడిందని... పులివెందుల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని లేదా పోలింగ్ పై స్టే విధించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని తెలిపింది. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. మరోవైపు, పిటిషన్ ను హైకోర్టు విచారించే సమయానికే పులివెందుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకోవైపు, పులివెందుల స్థానంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించామని హైకోర్టుకు ఈసీ తరపు న్యాయవాదులు తెలిపారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 YSRCP: హైకోర్టులో వైసీపీకి షాక్.. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమన్న హైకోర్టు 14-08-2025 Thu 15:56 | Andhra పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలంటూ వైసీపీ పిటిషన్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో షాక్ లో ఉన్న వైసీపీకి... ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అవకతవకలకు పాల్పడిందని... పులివెందుల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని లేదా పోలింగ్ పై స్టే విధించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని తెలిపింది. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. మరోవైపు, పిటిషన్ ను హైకోర్టు విచారించే సమయానికే పులివెందుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకోవైపు, పులివెందుల స్థానంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించామని హైకోర్టుకు ఈసీ తరపు న్యాయవాదులు తెలిపారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 TDP: ఒంటిమిట్టలో కూడా వైసీపీకి ఘోర పరాభవం... టీడీపీ ఘన విజయం 14-08-2025 Thu 14:09 | Andhra వైసీపీ అభ్యర్థిపై టీడీపీ 6,267 ఓట్లతో ఘన విజయం టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే పులివెందులలో తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీడీపీ... ఒంటిమిట్ట జడ్పీటీసీని కూడా కైవసం చేసుకుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ గడ్డపై రెండు జడ్పీటీసీలను స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. Quote
psycopk Posted August 14 Report Posted August 14 Chandrababu Naidu: పులివెందుల విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి.. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి: చంద్రబాబు 14-08-2025 Thu 13:23 | Andhra పులివెందులలో పరిస్థితులను ప్రజలు గమనించారన్న చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని వ్యాఖ్య జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారన్న చంద్రబాబు పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఘన విజయంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చంద్రబాబు అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామంటూ బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు పెట్టారని... పులివెందులలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించారని చెప్పారు. ఈ విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసే విధంగా నేతలు స్పందించాలని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని అన్నారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా ఓటు వేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రులకు సూచించారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 పులివెందులలో వైసీపీ ఓటమిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు 14-08-2025 Thu 13:00 | Andhra జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పు చెబుతోందన్న అనిత వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా పులివెందుల ఓటమి జగన్ కు చెంపపెట్టు అని వ్యాఖ్య పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగురవేశామని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పు చెబుతోందని అనిత అన్నారు. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. గతంలో పులివెందులలో ఓటర్లు ధైర్యంగా ఓటు వేసే పరిస్థితి లేదని... ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ధైర్యంగా ఓటు వేశారని చెప్పారు. పోలీసులను వైసీపీ నేతలు విమర్శించడం సరికాదని అన్నారు. పులివెందుల ఓటమి జగన్ కు చెంపదెబ్బ అని అని చెప్పారు. సీఎం చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్ అనుచితంగా మాట్లాడటం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పులివెందుల ప్రజలు పెంచారని తెలిపారు. ఓవైపు తనకు రక్షణ పెంచాలని కోరుతున్న జగన్... మరోవైపు పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని దూషించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 Nara Bhuvaneswari: పులివెందుల విజేత లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించిన నారా భువనేశ్వరి 14-08-2025 Thu 14:58 | Andhra పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విక్టరీ ఘనవిజయం సాధించిన బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి పులివెందులలో గెలిస్తే జోష్ ఎక్కువ కదా అంటూ భువనేశ్వరి స్పందన మనం అందరం ఒకే కుటుంబం అంటూ వ్యాఖ్యలు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీటెక్ రవి అర్థాంగి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇది కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడగా... లతారెడ్డి ఘనవిజయంతో టీడీపీ అధినాయకత్వం సైతం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తాజాగా పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అబినందనలు తెలిపారు. "లత గారూ.. మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నాం" అని అన్నారు. అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. "థాంక్యూ అమ్మా... నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా... అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా..." అంటూ వినమ్రంగా బదులిచ్చారు. అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ... "అవును, ఈ విజయం అందరిదీ... ప్రతి ఒక్కరిదీ... అయినా పులివెందులలో గెలుపు అంటే ఇంకొంచెం జోష్ ఎక్కువ కదా! మీకు మరొక్కసారి శుభాభినందనలు... మనందరం ఒకే కుటుంబం" అని అన్నారు. "మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా... జై తెలుగుదేశం" అంటూ లతారెడ్డి బదులిచ్చారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 Balakrishna: పులివెందులకు పూర్వ వైభవం వచ్చింది: బాలకృష్ణ 14-08-2025 Thu 14:51 | Andhra పులివెందులలో ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్న బాలయ్య పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్య ప్రజలు ధైర్యంగా ఓటు వేశారన్న బాలయ్య పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని... ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు పూర్వవైభవం వచ్చిందని బాలయ్య చెప్పారు. ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. గతంలో నామినేషన్ వేయడానికే భయపడేవారని... ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని చెప్పారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 Anchor Shyamala: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: యాంకర్ శ్యామల 14-08-2025 Thu 14:20 | Andhra పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ స్పందన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యాంకర్ శ్యామల పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనించారన్న శ్యామల ఎన్నికల వెబ్ కాస్టింగ్ ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా స్పందించారు. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. ఈ మేరకు శ్యామల సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయనే విషయం అందరికీ అర్థమైందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో అధికార టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన శ్యామల, ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పులివెందులలో బీటెక్ రవి అర్ధాంగి మారెడ్డి లతారెడ్డి, ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. ముఖ్యంగా, జగన్ అడ్డా పులివెందులలో సాధించిన విజయంతో టీడీపీ శ్రేణులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి . Quote
psycopk Posted August 14 Report Posted August 14 వచ్చే ఎన్నికల్లో జగన్ ను కూడా ఓడిస్తాం: పులివెందులలో గెలుపు తర్వాత లతారెడ్డి 14-08-2025 Thu 12:43 | Andhra పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచాయన్న లతారెడ్డి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. ఈ ఎన్నికలో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అద్భుత విజయం సాధించిన తర్వాత లతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచాయని అన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ... పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పారు. పులివెందుల అభివృద్ధి కోసమే ప్రజలు టీడీపీకి ఓటు వేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని చెప్పారు. మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే టీడీపీకి పులివెందుల ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. Quote
psycopk Posted August 14 Report Posted August 14 BTech Ravi: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయంపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు 14-08-2025 Thu 12:47 | Andhra పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డి తన అర్ధాంగి లతారెడ్డి భారీ విజయంపై బీటెక్ రవి స్పందన జగన్కు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోనే ప్రజలు గెలిపించారని వ్యాఖ్య పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు బుద్ధి చెప్పాలనే ప్రజల ఆలోచనతో పాటు, టీడీపీ అమలు చేసిన పథకాలే పార్టీ విజయానికి కారణమయ్యాయని ఆయన అన్నారు. గతంలో పులివెందులలో ధైర్యంగా ఓటు వేసే పరిస్థితులు వుండేవి కాదనీ, తాము ప్రజలకు ఆ భరోసా కల్పించామని అన్నారు. గతంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానీయకుండా చేశారని, ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. అందుకే ఈ రోజు ఈ అద్భుత ఫలితాలు వచ్చాయని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి ఓట్లు వేస్తారనేందుకు నిదర్శనం ఈ ఎన్నికలు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు టీడీపీకి భారీ విజయాన్ని అందించారని అన్నారు. వైసీపీ చేతుల్లో ఉన్న సిట్టింగ్ స్థానాలను గెలుచుకోవడం ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. కాగా, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 8,103 ఓట్లు పోలైతే.. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడడంతో ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. Quote
ElDragon Posted August 14 Report Posted August 14 6 hours ago, Android_Halwa said: I know how TdP misuses its power to win elections. Remember Nandhyal ? The guy who won is a very close friend, he himself told me how CBN managed the election with freebies and promises…an year later, the result was disastrous. sollu 1ogara ante langa lepukuni vachestav Quote
Popular Post Bendapudi_english Posted August 14 Popular Post Report Posted August 14 6 hours ago, Sam480 said: Lol konchem tight ga win ayina nammela undedi. looks like too much money and pressure @Mancode Ikada kuda almost 11% percent votes vachayi YCP ki 3 Quote
Apple_Banana Posted August 14 Report Posted August 14 7 hours ago, Android_Halwa said: Blatant mis use of power and authority…20k votes ni authority tho rig cheyadam no big deal… Imagine a DGP, a dozen DSP’s and about 4000-5000 cops posted for a ZPTC election ? Start chesava poddune underwear lekunda crying.. mana Jaffa ruling lo win ayinappudu emo vadu topu turumu etc etc...even nomination ki allow cheyakunda elections ayinappudu..... ippudemo power misuse... konchem konchem ayina DB lo janalu chustunnaru, vintunnaru anni siggu eggu lekunda..ela talking bro nuvvu...nizam ga super nuvvu... ee school lo chadivavo chepthe langas and jaffas andarini aa school ki pampiddam vallu kuda neela happy ga vuntaru... 2 Quote
akkum_bakkum Posted August 14 Report Posted August 14 1 hour ago, Bendapudi_english said: Ikada kuda almost 11% percent votes vachayi YCP ki Enduku mastaru maati maatiki gurthu chestharu. 1 Quote
futureofandhra Posted August 14 Report Posted August 14 8 hours ago, Android_Halwa said: Blatant mis use of power and authority…20k votes ni authority tho rig cheyadam no big deal… Imagine a DGP, a dozen DSP’s and about 4000-5000 cops posted for a ZPTC election ? anna manodu debbesadu ley ysr viveka vunnapudu konchem connections vundevi ah avinash gadiki ichi bokka pettadu generations changed banglore lo vuntry panulu avvavu vuriki vachevadu ysr ippudu jaganaanna address ledu power missue chesytam nothing new antha gap ah majority Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.