Jump to content

Recommended Posts

Posted

 

Chandrababu Naidu: ఏపీ సముద్ర తీరానికి మహర్దశ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో కీలక ఒప్పందం

21-08-2025 Thu 20:51 | Andhra
Chandrababu Naidu AP to Develop Maritime Gateway with 9000 Crore Investment
 
  • ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధికి కీలక ఒప్పందం
  • ఏపీ మారిటైమ్ బోర్డ్, ఏపీఎం టెర్మినల్స్ మధ్య ఎంవోయూ
  • రాష్ట్రంలోకి రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి
  • దాదాపు 10,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు
  • ప్రపంచస్థాయి ప్రమాణాలతో టెర్మినళ్ల నిర్మాణం, ఆధునికీకరణ
  • ఏపీని మారిటైమ్ గేట్‌వేగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ప్రధాన సముద్ర వాణిజ్య ముఖద్వారంగా (మారిటైమ్ గేట్‌వే), లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏ.పీ. మోలర్-మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ (ఏపీఎంటీ) సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (ఏపీఎంబీ) ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పోర్టులు, టెర్మినళ్ల అభివృద్ధి, ఆధునికీకరణ వేగవంతం కానుందని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా రాష్ట్రంలో రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు 'ఏపీఎం టెర్మినల్స్' అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడంతో పాటు, ప్రపంచస్థాయి టెర్మినళ్లను నిర్మించనున్నట్టు వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. పోర్టుల ప్రణాళిక, టెర్మినల్ కార్యకలాపాల్లో ఏపీఎం టెర్మినల్స్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం, రాష్ట్రానికి ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్య రంగంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను దేశ తూర్పు తీరానికి 'మారిటైమ్ గేట్‌వే'గా, 'లాజిస్టిక్స్ హబ్'గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆ దిశగా వేసిన ఒక బలమైన అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.
20250821fr68a739496b4e5.jpg20250821fr68a739528940d.jpg

 

Posted

 

DSC 2025: డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణకు తెర... రేపే మెరిట్ జాబితా విడుదల

21-08-2025 Thu 22:18 | Andhra
AP DSC 2025 Merit List to Release Tomorrow
 
  • మెగా డీఎస్సీ-2025 మెరిట్ జాబితా ఆగస్టు 22 విడుదల
  • డీఎస్సీ, జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలో జాబితా
  • ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్‌లో కాల్ లెటర్లు జారీ
  • సర్టిఫికెట్లను ముందుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి
  • దళారులను నమ్మవద్దు, అధికారిక వెబ్‌సైట్లనే చూడాలని ప్రభుత్వం హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితాను ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణ, స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో, తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మెగా డీఎస్సీ-2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల (డీఈఓ) వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అభ్యర్థులు కేవలం ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆయన సూచించారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సిద్ధం కండి!

మెరిట్ జాబితా విడుదల తర్వాత నియామక ప్రక్రియలో భాగంగా, వివిధ కేటగిరీల కింద పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్న అభ్యర్థులకు (జోన్ ఆఫ్ కన్సిడరేషన్) వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు పంపనున్నట్లు కృష్ణారెడ్డి వివరించారు. కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు, ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని సూచించారు. ఏయే సర్టిఫికెట్లు తీసుకురావాలో తెలిపే పూర్తి చెక్‌లిస్ట్‌ను కూడా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిర్దేశిత సమయంలో వెరిఫికేషన్‌కు హాజరుకాని లేదా సరైన పత్రాలు సమర్పించని అభ్యర్థులు తమ అవకాశాన్ని కోల్పోతారని, మెరిట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నవారికి ఆ అవకాశం దక్కుతుందని హెచ్చరించారు.

దళారుల మాటలు నమ్మొద్దు

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు చేసే మోసపూరిత ప్రచారాలను, సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య వదంతులను నమ్మవద్దని అభ్యర్థులను ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. నియామక ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా, మెరిట్ ఆధారంగానే జరుగుతుందని పునరుద్ఘాటించింది. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వుల వంటి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను, ప్రభుత్వ పత్రికా ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో, అర్హులైన ఉపాధ్యాయులను పారదర్శకంగా నియమించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...