psycopk Posted August 30 Author Report Posted August 30 Harish Rao: అసెంబ్లీ సమావేశాల వేళ... హైకోర్టులో హరీశ్ రావు లంచ్ మోషన్ పిటిషన్ 30-08-2025 Sat 12:35 | Telangana కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ రేపు అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్ నివేదికను సభలో పెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ కోరిన మాజీ మంత్రి రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న లంచ్ మోషన్ పిటిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసి, రేపు సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, హరీశ్ రావు అనూహ్యంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని, దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా కాళేశ్వరం కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్ రావు మాట్లాడారు. కాళేశ్వరంపై తాము పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు వినడానికి మంత్రి శ్రీధర్ బాబు సిద్ధంగా లేరని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో తప్పులు ఎవరు చేశారనేది ప్రజలు, న్యాయస్థానాలే తేలుస్తాయని హరీశ్రావు వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted August 30 Author Report Posted August 30 KTR: పీసీ ఘోష్ కాదు.. అది పీసీసీ ఘోష్ కమిషన్: కేటీఆర్ 30-08-2025 Sat 11:47 | Telangana ఎరువుల సంక్షోభంపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీని నడపాలని డిమాండ్ కాళేశ్వరం సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటన రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గన్పార్క్ వద్ద నిరసనకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా బస్తాలతో అమరవీరుల స్థూపం వద్ద తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని, ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రభుత్వం సభను ఏకపక్షంగా నడిపించాలని చూస్తోందని, రైతుల సమస్యలపై చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. "గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఎరువుల కొరత రాలేదు. రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు చెప్పులను, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది?" అని ఆయన ప్రశ్నించారు. పండుగ రోజున కూడా రైతులు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సంక్షోభం, పంట నష్టపోయిన రైతుల సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. "రాష్ట్రంలో 600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 75 లక్షల మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యం వరకు అన్నింటిపై చర్చిద్దాం" అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్పై స్పందిస్తూ, "అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్" అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ కమిషన్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ వేదిక కావాలని, అందుకు అనుగుణంగా సమావేశాల సమయాన్ని పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Quote
citizenofIND Posted August 30 Report Posted August 30 Pinky Galla ki lang @ ettukonne busy Lo unnaru. IVanni pattavu. Cbn Medha oka cry chesthe challu 1 Quote
jpismahatma Posted August 30 Report Posted August 30 21 minutes ago, citizenofIND said: Pinky Galla ki lang @ ettukonne busy Lo unnaru. IVanni pattavu. Cbn Medha oka cry chesthe challu Ok Quote
psycopk Posted August 31 Author Report Posted August 31 Uttam Kumar Reddy: కాళేశ్వరం నిర్మాణంలో తీవ్ర లోపాలున్నాయి: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 31-08-2025 Sun 19:18 | Telangana అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ డ్యామ్, బ్యారేజీకి తేడా లేకుండా కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఉత్తమ్ ఆరోపణ రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదని విమర్శ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన మంత్రి తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టారని వ్యాఖ్య కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డ్యామ్కు, బ్యారేజీకి మధ్య తేడా పాటించకుండా ఘోరమైన తప్పిదాలకు పాల్పడ్డారని, దాని పర్యవసానమే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలోని అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు గత 20 నెలలుగా పూర్తిగా నిరుపయోగంగా మారాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.87,449 కోట్లతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, చివరికి రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని విమర్శించారు. ఇంత భారీగా ఖర్చు చేసినప్పటికీ, కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోయారని ఆయన అన్నారు. వాస్తవానికి, వ్యాప్కోస్ నిపుణుల సూచన మేరకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేవలం రూ.38 వేల కోట్లతో పూర్తిచేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టిందని ఉత్తమ్ గుర్తుచేశారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో కాళేశ్వరం నుంచి కేవలం 162 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్ చేశారని, అంటే సగటున ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే వినియోగించారని గణాంకాలతో సహా వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ఒక పెను విపత్తు అని మంత్రి అభివర్ణించారు. ఈ దుస్థితికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో ఇదే బిల్లుకు ఆ పార్టీ మద్దతు తెలిపిందన్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. Quote
psycopk Posted August 31 Author Report Posted August 31 Ee chillar gadu aadi mama istaru report inka… Harish Rao: కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక ఓ డొల్ల రిపోర్ట్: హరీశ్ రావు 31-08-2025 Sun 19:33 | Telangana కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేడు అసెంబ్లీలో చర్చ 660 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం అరగంట సమయం ఇచ్చారన్న హరీశ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక రాజకీయ ప్రేరేపితమని, అదో డొల్ల రిపోర్ట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నివేదిక న్యాయస్థానంలో నిలబడదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 660 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం అరగంట సమయం ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇంత పెద్ద నివేదికపై అరగంటలో ఏం మాట్లాడగలం? ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుట్ర ఇది" అని ఆయన అన్నారు. ఇంత కీలకమైన అంశంపై మాట్లాడేందుకు కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలని, ఎలాంటి అంతరాయం కలిగించవద్దని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే రాబోయే రెండు రోజులు కూడా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా సాగలేదని హరీశ్రావు ఆరోపించారు. విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8బి, 8సి ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కమిషన్ ఆ నిబంధన పాటించలేదని గుర్తుచేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ, ఈ నివేదిక చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని, తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకుని ఇప్పటికే ఈ నివేదికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు హరీశ్రావు వెల్లడించారు. ఆరోపణలు చేసి, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నివేదిక చట్టబద్ధం కాదు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక చట్టబద్ధం కాదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విచారణ కమిషన్ల చట్టం, 1952లోని సెక్షన్ 8బీ ప్రకారం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదన వినే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ నివేదిక చెత్త కాగితంతో సమానమని ఆయన అభివర్ణించారు. విచారణ కమిషన్ తన నివేదికలో ఎవరిపైనైనా ఆరోపణలు చేయాలనుకుంటే, ముందుగా వారికి సెక్షన్ 8బీ కింద నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకోవడంతో పాటు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం కల్పించాలన్నది చట్టంలోని కీలక నిబంధన అని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ, జస్టిస్ ఘోష్ కమిటీ ఈ ప్రాథమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గానీ, తనకు గానీ, విచారణకు పిలిచిన ఇతర నేతలు, అధికారులకు గానీ ఈ నోటీసులు ఇవ్వలేదని, అందువల్ల ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితమే! కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు, బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని, ఇప్పుడు ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణ కమిషన్లను రాజకీయ అస్త్రంగా వాడుకోవద్దని 1958లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. Quote
Jatka Bandi Posted August 31 Report Posted August 31 Lunch motion ante, judge gadiki inko villa annamaata.. but what is his argument for asking the court to intervene? Adi cheppakunda, pettoddannadani demonize cheste emostadi.. @dalapathi, enti mee langa gaani gola? What is his argument? 1 Quote
pushpa1 Posted August 31 Report Posted August 31 Just now, Jatka Bandi said: Lunch motion ante, judge gadiki inko villa annamaata.. but what is his argument for asking the court to intervene? Adi cheppakunda, pettoddannadani demonize cheste emostadi.. @dalapathi, enti mee langa gaani gola? What is his argument? @vetri_psyconandamuri @Android_Halwa @A1startarak @Teluguredu @yslokesh @dalapathi chusirra kakas ee labor payakanal saaf chesetodu mana hyd la bathukudu malla mana state ni langa anudu malli mana langa la doori payakanal saaf chesudu…em bathuku veenidi.. Quote
Jatka Bandi Posted August 31 Report Posted August 31 2 minutes ago, pushpa1 said: @vetri_psyconandamuri @Android_Halwa @A1startarak @Teluguredu @yslokesh @dalapathi chusirra kakas ee labor payakanal saaf chesetodu mana hyd la bathukudu malla mana state ni langa anudu malli mana langa la doori payakanal saaf chesudu…em bathuku veenidi.. ante langaalu vesukuntarani oppukunnarannamaata.. tanda settler puk gallara.. @Sinthakai @2024 @idibezwada 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.