2024 Posted September 16 Report Posted September 16 street dogs are lot better than boseDK batch ravali inka fake ids tho Quote
psycopk Posted September 16 Author Report Posted September 16 Bhumana Karunakar Reddy: అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వరుడిది: భూమనపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్ 16-09-2025 Tue 17:45 | Andhra అలిపిరి వద్ద మహావిష్ణువు విగ్రహం పడేశారంటూ భూమన ఆగ్రహం ఆ విగ్రహంతో టీటీడీకి సంబంధం లేదన్న భానుప్రకాశ్ రెడ్డి భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ పాలకమండలి సభ్యులు తీవ్రంగా స్పందించారు. అలిపిరి వద్ద నిర్లక్ష్యంగా పడేశారని చెబుతున్న విగ్రహం శ్రీ మహావిష్ణువుది కాదని, అది శనీశ్వరుడి విగ్రహమని వారు స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అలిపిరి వద్ద ఉన్న శిల్పకళా క్వార్టర్స్కు, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. "బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు అక్కడి శిల్పులకు శనీశ్వరుడి విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చారు. కానీ, తర్వాత దానిని తీసుకువెళ్లలేదు. ఆ విగ్రహాన్ని చూపించి భూమన అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయనకు శనీశ్వరుడి విగ్రహానికి, మహావిష్ణువు విగ్రహానికి కూడా తేడా తెలియకపోవడం విచారకరం" అని ఎద్దేవా చేశారు. ఈ తప్పుడు ప్రచారానికి గాను కరుణాకర్ రెడ్డి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా భూమనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. "టీటీడీపై నిరాధారమైన వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాబోయే పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటాం. భూమన చేసే ఫేక్ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దు" అని సూచించారు. కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదని ఎంఎస్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. Quote
psycopk Posted September 17 Author Report Posted September 17 vigraham chesina valla kante.. ee chirstian karunamayduiki ekuva telusu... Bhumana Karunakar Reddy: శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా అవుతుంది?: భూమన 16-09-2025 Tue 21:55 | Andhra అలిపిరి విగ్రహంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు అది శనీశ్వరుడిది కాదు, శ్రీమహావిష్ణువు విగ్రహమేనని స్పష్టీకరణ శంఖు చక్రాలున్నది శని విగ్రహం ఎలా అవుతుందని సూటి ప్రశ్న అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని తీవ్ర ఆరోపణ నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శలు తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, అలిపిరి వద్ద కనిపించిన విగ్రహంపై ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు. మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందంటూ ప్రభుత్వంపైనా, టీటీడీపైనా మండిపడ్డారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి... అది విష్ణుమూర్తి విగ్రహం కాదని, శనీశ్వరుడి విగ్రహం అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో భూమన మరోసారి స్పందించారు. అది శనీశ్వరుడి విగ్రహం కాదని, అది ముమ్మాటికీ శ్రీమహావిష్ణువు విగ్రహమేనని స్పష్టం చేశారు. "వైఖానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు. అది శనీశ్వర విగ్రహం అని చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా అవుతుంది? శనీశ్వరుడి విగ్రహానికి విల్లు, బాణం ఉంటాయా? అది శిల్పి చెక్కి నిరక్ష్యంగా పడేశారని సమాధానం చెబుతున్నారు. చాలా స్పష్టంగా చెబుతున్నా... అది శ్రీమహావిష్ణువు విగ్రహమే! నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. నాపై తప్పుడు కేసు పెట్టి, జైల్లో వేసినా నేను చెబుతూనే ఉంటా! నేను నాయకుడ్ని కాదు... స్వచ్ఛమైన హిందువును, హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని, నాపై ఎన్నిసార్లు దుష్ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మరు. స్వామి అనుగ్రహించారు కాబట్టే రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా, మూడు సార్లు బోర్డు సభ్యునిగా అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే స్వామి అనుగ్రహంతో బోర్డు సభ్యులు అయ్యామని చెప్పే మీరు... ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారు? ఇది ముమ్మాటికి ఆ మహావిష్ణువు విగ్రహమే... నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. రాజకీయాల కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం" అని భూమన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. Quote
psycopk Posted September 17 Author Report Posted September 17 deniki script kuda late ga pamputunara.. Pawan Kalyan: దుర్గమ్మ గుడి మెట్లు కిందనుంచి పైకి కడిగిన మన పిఠాపురం పీఠాధిపతి నోరు మెదపడం లేదు: యాంకర్ శ్యామల 17-09-2025 Wed 16:34 | Andhra తిరుమల వివాదాలపై పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారంటూ శ్యామల ఆగ్రహం ప్రశ్నించినందుకే భూమన కరుణాకర్రెడ్డిపై అక్రమ కేసు అని ఆరోపణ కూటమి ప్రభుత్వం వచ్చాకే తిరుమలలో అపచారాలు పెరిగాయన్న విమర్శ గోవుల మృతి, కొండపై మాంసం వంటి ఘటనల ప్రస్తావన తిరుమలలో వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లు కింద నుంచి పైకి కడిగిన పవన్, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో, మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వ నైజమా అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉందని శ్యామల అన్నారు. కల్తీ నెయ్యి అంటూ లడ్డూపై అబద్ధపు ప్రచారం చేశారని, గోవులు మరణించడం, కొండపై మాంసాహారం దొరకడం వంటివి జరిగాయని గుర్తుచేశారు. తాజాగా, సన్నిధి గొల్ల తీయాల్సిన ఆలయ ద్వారాలను ఓ మీడియా వ్యక్తి తెరవడం కూడా పెద్ద తప్పిదమని ఆమె పేర్కొన్నారు. గతంలో "సనాతన ధర్మ పరిరక్షకుడిని" అంటూ కాషాయ వస్త్రాలు ధరించి దుర్గమ్మ గుడి మెట్లను శుభ్రం చేశారని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి శ్యామల వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు. Quote
psycopk Posted September 17 Author Report Posted September 17 Bhumana Karunakar Reddy: విగ్రహం వ్యాఖ్యల వివాదం: భూమనకు అలిపిరి పోలీసుల నోటీసులు 17-09-2025 Wed 16:36 | Andhra టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు అలిపిరి విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదు విచారణకు హాజరు కావాలంటూ పోలీసుల ఆదేశం వచ్చే మంగళవారం విచారణకు వస్తానని తెలిపిన భూమన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నమోదైన కేసులో భాగంగా బుధవారం అలిపిరి పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాను కొన్ని రోజుల పాటు వ్యక్తిగత పనుల కారణంగా బిజీగా ఉంటానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ అజిత, వీలు చూసుకుని విచారణకు రావాలని సూచించారు. అనంతరం, వచ్చే మంగళవారం, అంటే సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు హాజరవుతానని భూమన పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం విషయంలో భూమన చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భూమనపై కేసు నమోదు చేసి, తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారంపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు. Quote
psycopk Posted September 17 Author Report Posted September 17 ee sollu kaburlu sanjana ki chepara ambotu Quote
akkum_bakkum Posted September 17 Report Posted September 17 54 minutes ago, psycopk said: ee sollu kaburlu sanjana ki chepara ambotu Ohh my aambothu..ee saavu thelivithetalu thattukoleke 11ichi pakkaki nettindi 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.