BattalaSathi Posted September 27 Report Posted September 27 https://www.eenadu.net/telugu-news/india/several-faint-in-overcrowded-rally-rushed-to-hospitals-vijay-ends-speech-ahead-of-schedule/0700/125177421 ఇంటర్నెట్ డెస్క్: తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. కరూర్లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందినట్టు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతోపాటు ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన ఆయన.. ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. భారీ సమూహంలో అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. సీఎం దిగ్భ్రాంతి.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘కరూర్ నుంచి వస్తోన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి, కలెక్టర్కు సూచించా. కరూర్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించా. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కరూర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.