Jump to content

Orey vadu enta yedav chusaka kuda aa moham petukoni celebrating ra??


Recommended Posts

Posted

 

Jagan Mohan Reddy: జగన్ పుట్టినరోజు.. గోదావరిలో భారీ ఫ్లెక్సీతో వినూత్నంగా వైసీపీ సంబరాలు

20-12-2025 Sat 17:03 | Andhra
Jagan Mohan Reddy Birthday Celebrations YSRCP Celebrates with Giant Flex in Godavari
 
  • రేపు జగన్ పుట్టినరోజు
  • ఒకరోజు ముందుగానే వేడుకలను ప్రారంభించిన పార్టీ శ్రేణులు
  • రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వేడుకలు
రేపు వైసీపీ అధినేత జగన్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేడుకలను ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో ఏకంగా 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. గోదావరిలో పడవలను అందంగా అలంకరించి, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

మరోవైపు, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Next article

 

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    58

  • Android_Halwa

    6

  • 7691

    2

  • Lonewolf

    2

Posted

Nuvve le cm… aa mental gadu sakshi editor rasi iche papers tappa emi undav

Jagan Mohan Reddy: మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు పక్కా ప్లాన్ ఉంది: సజ్జల

20-12-2025 Sat 17:25 | Andhra
Sajjala Jagan Has Clear Plan for Next Term
 
  • అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే ఉన్నారన్న సజ్జల
  • ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సినంత చేశారని ప్రశంస
  • ప్రచారం ఆశించకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కితాబు
వైసీపీ అధినేత జగన్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని, మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు జగన్ వెంటే ఉంటారని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. "ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కరేనని కోట్లాది మంది నమ్ముతున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఏదో ఆశించి ఆయన సహాయం చేయరు. తన వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందనే నిత్యం ఆలోచిస్తారు" అని తెలిపారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ, కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రజలకు అండగా నిలిచిన తీరును సజ్జల గుర్తుచేశారు.

జగన్ ఏనాడూ పబ్లిసిటీ కోరుకోలేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలు సృష్టించారని, 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేదని అన్నారు. చంద్రబాబు తన 18 నెలల పాలనలోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆర్థికవేత్తలే ఆశ్చర్యపోయేలా జగన్ తన ఐదేళ్ల పాలనను సాగించారని సజ్జల ప్రశంసించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...