Jump to content

Happy birthday subbaraya sharma


Recommended Posts

Posted

సుబ్బరాయ శర్మ 1947, జనవరి 3న దుర్గా ప్రసాద రావు, సుందరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించాడు. ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బికామ్ పూర్తిచేశాడు. 1974 మార్చిలో జ్ఞానప్రసూనాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఒక అబ్బాయి (బాలపవన్ కుమార్), ఒక అమ్మాయి (కిరణ్మయి).

 

fFJb5oiyTzuc3BLs5NBsf1qgT15.jpg

నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటకరంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయ శర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయనకు ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

సుబ్బరాయ శర్మ.. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ఆయన ఫొటో చూపిస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో వేద పండితుడిగా, తండ్రిగా, తాతయ్యగా, ఆఖరికి విలన్‌గా సుబ్బరాయ శర్మ నటించారు. నాటకరంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన సుబ్బరాయ శర్మ.. 1985లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘మయూరి’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఆ తరవాత పలు రకాల పాత్రలు పోషించి.. రాజశేఖర్ ‘సూర్యుడు’లో నెగిటివ్ రోల్‌లోనూ మెప్పించారు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ దగ్గర నుంచి నిన్న మొన్నటి ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘రుద్రమదేవి’ వరకు వందకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కాకపోతే, ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్‌గా ఎదగలేకపోయారు.

అయితే, అందరి నటీనటుల జీవితాల్లో మాదిరిగానే సుబ్బరాయ శర్మ లైఫ్‌లో ఒక బాధాకర సంఘటన జరిగింది. ఆయన నటుడిగా బిజీగా ఉన్న సమయంలో తల్లికి క్యాన్సర్ వచ్చింది. ఆమెను చూసుకోవడానికి సుబ్బరాయ శర్మ భార్య కూడా ఇక్కడ లేరు. అలాంటి పరిస్థితిలో చేసేదేమీ లేక అనాధాశ్రమంలో తల్లిని చేర్పించారట సుబ్బరాయ శర్మ. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫిల్మ్ ట్రీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు.

ఇండస్ట్రీలో ఏ నిర్మాతలైనా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారా అన్న ప్రశ్నకు సుబ్బరాయ శర్మ స్పందిస్తూ.. ‘‘ఇవ్వకుండా ఉన్నవాళ్లు కూడా ఉంటుంటారు. కానీ, నాకు అలాంటి వాళ్లు చాలా తక్కువ. కాస్తో కూస్తో ఇచ్చి మిగిలిన డబ్బులు ఎగ్గొట్టిన వాళ్లు ఉన్నారు. ఎంతో కొంత ఇచ్చారుగా. పైగా నాకు హెల్ప్ చేసినవారు కూడా ఉన్నారు. నా తల్లికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. నా భార్య ఏమో అమెరికాలో ఉంది. మా అమ్మను చూసుకోలేక అనాధాశ్రమంలో చేర్చాను. అక్కడి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించి మళ్లీ అనాధాశ్రమానికి తీసుకెళ్లేవాడిని. ఆ తరవాత షూటింగ్‌లకు వెళ్లి వచ్చిన డబ్బుతో హాస్పిటల్ బిల్లు కట్టేవాడిని. అలాంటి సమయంలో గుణశేఖర్.. ముందే ఒక రూ.10 వేలు అడ్వాన్సుగా ఇవ్వు అని ఆయన కూతురికి చెప్పారు. ఆ అమ్మాయి నాకు అడ్వాన్సుగా పారితోషికం ఇచ్చారు. అలా హెల్ప్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎగ్గొట్టేవాళ్లనే ఎందుకు చెప్పుకోవాలి మనం. ముందు ఇస్తూ ఒక రూ.10 వేలు ఎక్కువ ఇచ్చేవాళ్లను ఎందుకు చెప్పుకోకూడదు’’ అని తన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పారు.

టాలెండ్ ఉన్నా ఇండస్ట్రీలో వర్గ వివక్ష చూపిస్తారనే ఆరోపణ ఉంది.. దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు సుబ్బరాయ శర్మ స్పందిస్తూ.. ‘‘అది బయటవాళ్లు అనుకుంటారు. ఇండస్ట్రీ లోపల అలా అనుకోరు. మా అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నాను. ఒక నలుగురు కుర్రాళ్లను చూస్తాం. నలుగురు కుర్రాళ్లలో మన బంధువుల అబ్బాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామా ఇవ్వమా. ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, ఎవరైనా కానీ వాళ్ల సర్కిల్‌లో ఉన్నవాళ్లు, రోజూ కలుస్తున్నవాళ్లలో ఎవరో ఒకరు అదే క్యారెక్టర్‌కు నేనూ పనికొస్తాను, ఆయన పనికొస్తాడు అన్నప్పుడు అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వడంలో తప్పేముంది. అలా ఇస్తారు తప్పితే.. మనవాడు కాదు కాబట్టి, ఈ వేషానికి మనవాడినే పెట్టుకుందాం, కోటా శ్రీనివాసరావు మనకు వద్దు అనుకుంటే సినిమా ఇండస్ట్రీ ఎక్కడుంటుంది. ఏ వేషానికి ఎవరు సరిపోతారు, ప్రజలకు ఎవరు నచ్చుతారు అని భావిస్తారో వాళ్లనే పెట్టుకుంటారు. బయట అనుకునేదంతా భ్రమ’’ అని చెప్పుకొచ్చారు.

🌳జంధ్యాల నాకు జూనియర్…
సుబ్బరాయ శర్మ గారు కాలేజీ లో చదివే సమయంలో జంధ్యాల గారు ఆయనకు జూనియర్. అలా నాటకాలను వేసే సమయలో సుబ్బరాయ శర్మ గారి డైరెక్షన్లో నాటకం వేసే సమయంలో జంధ్యాల గారికి మొదట అవకాశం ఇచ్చారట. అలా నాటక రంగ ప్రవేశం చేయించింది సుబ్బరాయ శర్మ గారే. అయితే సినిమాలలో జంధ్యాల గారి డైరెక్షన్లో ఎన్నో సినిమాలలో నటించారు సుబ్బారాయశర్మ.

🌳బడిలో చదివే రోజుల్లో మిత్రుడైన సుత్తి వీరభద్రరావు తో కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. వాటిల్లో చివరకి మిగిలేది అనే నాటకం బాగా రక్తి కట్టింది. కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు, అంతా ఇంతే, వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించాడు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల కూడా ఈయనకు కాలేజీలో సహవిద్యార్థి. కెమెరామెన్ యం.వి రఘు తో కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాడు. జెమిని టివీలో ప్రసారమైన తులసీదళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఈ సీరియల్‌లో పైడితల్లి పాత్రకు గుర్తింపు 1993లో ఉత్తమసహాయ నటుడి అవార్డు లభించింది. రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో న్యాయనిర్ణేతగా వెళ్ళాడు. నాలుగుసార్లు నంది టివీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...