Jump to content

Psyco jagan should be treated for Schizophrenia- BV Raghavulu


Recommended Posts

Posted

BV Raghavulu: జగన్ తీరు మారాలి: బీవీ రాఘవులు

12-01-2026 Mon 06:57 | Andhra
BV Raghavulu Comments on Jagans Stance on Amaravati
 
  • అమరావతిపై వ్యాఖ్యలు, వివాదాలు అనవసరమన్న బీవీ రాఘవులు
  • రాష్ట్రం ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాజధానిపై చర్చలు సాగడం సరికాదని వ్యాఖ్య
  • జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలన్న రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బీవీ రాఘవులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వ్యాఖ్యలు, వివాదాలు అనవసరమని ఆయన హితవు పలికారు. రాష్ట్రం ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాజధానిపై చర్చలు సాగడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

అమరావతిని రాజధానిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇప్పటికే అంగీకరించారని, ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం అవసరం లేదన్నారు. తొలుత జగన్ కూడా అమరావతినే రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కృష్ణానది తీరంలో అమరావతి ఉందా లేదా అనే చర్చకు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. రాజధాని నిర్మాణంలో లోపాలు లేదా అవినీతి ఉంటే వాటిని ప్రశ్నించాలని, కానీ రాజధానినే తిరస్కరించేలా మాట్లాడటం తగదని రాఘవులు వ్యాఖ్యానించారు. అమరావతిని అంగీకరించి, దాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని రాఘవులు సూచించారు.

ఇదిలా ఉండగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు అంశాలపై చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేస్తున్న విమర్శలపైనా రాఘవులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన వెలిగొండ, హంద్రీ నీవా, గాలేరు వంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదని, అలాంటి పరిస్థితుల్లో లేని ప్రాజెక్టులపై అనవసర రాద్దాంతం చేయడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు. పోలవరం పేరుతో వైఫల్యాలను ఎత్తిచూపడం సరికాదని జగన్‌కు బి.వి. రాఘవులు సూచించారు. 
Posted

Jagan Mohan Reddy: జగన్ 'బెంగళూరు ప్యాలెస్‌' కుట్రలపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ కలిశెట్టి డిమాండ్

12-01-2026 Mon 07:47 | Andhra
Jagan Mohan Reddy Bengaluru Palace Conspiracy CBI Probe Demanded by MP
 
  • యలహంక ప్యాలెస్‌లో ఏపీపై కుట్రలకు జగన్ పథక రచన చేస్తున్నారని ఆరోపణ
  • బెంగళూరులో ఏం జరుగుతుందో తేల్చాలని కేంద్రానికి ఎంపీ లేఖ
  • అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలతో జీతాలు తీసుకుంటున్నారని ధ్వజం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ఆదివారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ తాడేపల్లి ప్యాలెస్ కృష్ణా నది సమీపంలోనే ఉన్నా ఎప్పుడైనా మునిగిందా అని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిల ఆస్తులు అసాధారణంగా పెరగడంపై దేశంలోని ఇతర ఎంపీలు సైతం ఆశ్చర్యపోతున్నారని అప్పలనాయుడు పేర్కొన్నారు. దోపిడీలు, భూకబ్జాలు, బెదిరింపుల ద్వారానే వారు ఈ సంపద కూడబెట్టారని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా కేవలం దొంగ సంతకాలతో జీతభత్యాలు పొందుతున్నారని విమర్శించారు. జగన్ కనీసం తనను గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఆయన హితవు పలికారు.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, ఇప్పుడు సీఎం చంద్రబాబు అమరావతిని నిర్మిస్తుంటే దానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అంటే జగన్‌కు ఇష్టమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతి అభివృద్ధిపై ఒక వీడియోను రూపొందించి, బెంగళూరు ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు పంపుతానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...