Jump to content

AP land loki vachina water tho vallu project katukunte meku nopi neti?? -Supreme court to TG


Recommended Posts

Posted

Telangana Government: తెలంగాణ సర్కారుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

12-01-2026 Mon 14:22 | Both States
Polavaram Nallamalla Sagar Project Petition Dismissed by Supreme Court
 
  • పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీం తీర్పు
  • తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ విచారణకు అర్హత లేదన్న సుప్రీం
  • పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం

పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది. తెలంగాణ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని కోర్టుకు ఆయన వివరించారు. 

 

వాదనలు విన్న సుప్రీంకోర్టు... ఈ పిటిషన్ ను కొనసాగించలేమని, ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు (మీడియేషన్ లేదా సివిల్ సూట్) ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు సింఘ్వీ తెలిపారు. సివిల్ సూట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు.

Posted

A nillu vachevi maa degari nundi..,memu muda ostamochinnatu eda padithe ada projects kadithe meeku migiledi boche…

TDP has never been friendly with neighboring states…

Posted

Tribunal or file a civil suit annadi court…

So, elli as usual wet cloth ae..

Posted
1 hour ago, Android_Halwa said:

Tribunal or file a civil suit annadi court…

So, elli as usual wet cloth ae..

Adi okate annada court .. oka sari koncham vadava??

Posted

Revanth Reddy: ఇది చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్: హరీశ్ రావు 

12-01-2026 Mon 17:42 | Telangana
Revanth Reddys Sankranti Gift to Chandrababu says Harish Rao
 
  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • తెలంగాణ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి ఏపీకి సహకరిస్తున్నారని హరీశ్ విమర్శ
  • రిట్ ఉపసంహరణ ఏపీకి ప్రాజెక్టు కట్టుకునేందుకు సమయం ఇవ్వడమేనని వ్యాఖ్య
  • గురుదక్షిణ కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆక్షేపణ
  • రేవంత్ రెడ్డి తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన రాజకీయ గురువు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని, రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన ఆరోపించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసేలా ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్ సర్కారు కావాలనే విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి చేతులు దులుపుకొందని విమర్శించారు. 

"గతంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం రైతుల చేత రిట్ పిటిషన్లు వేయించి మరీ స్టే తెచ్చుకుంది. కానీ ఇక్కడి చేతకాని కాంగ్రెస్ సర్కారు మాత్రం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది. ఈ మాత్రం విషయం ప్రభుత్వ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా? కేవలం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకుని ఢిల్లీ వెళ్లారా?" అని హరీశ్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేయడం చారిత్రక ద్రోహమని మండిపడ్డారు.

రిట్ పిటిషన్ ఉపసంహరించుకుని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం ఏపీకి ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకోవడానికి గడువు ఇవ్వడమేనని హరీశ్ రావు ఆరోపించారు. సివిల్ సూట్‌లో ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉంటుందని, ఇది ఏళ్లు గడిచినా తేలని వ్యవహారమని అన్నారు. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసుకుని తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం-నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచీ ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోందని హరీశ్ ఆరోపించారు. "ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. సంతకం పెట్టనంటూనే పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారు. కమిటీ వేయనంటూనే వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేశారు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ముగిశాక కోర్టుకు వెళ్లి పరోక్షంగా ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు," అని విమర్శించారు.

కేవలం తన గురుదక్షిణ కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు ఆక్షేపించారు. "పంచాయతీలు, న్యాయస్థానాలు వద్దని, కూర్చొని మాట్లాడుకుందాం అనడంలో అంతర్యం ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పగించడమే ఆ చర్చల లక్ష్యమా?" అని నిలదీశారు. 

"తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డీ... నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. రేవంత్ రెడ్డీ... నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం" అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Posted
1 hour ago, Android_Halwa said:

A nillu vachevi maa degari nundi..,memu muda ostamochinnatu eda padithe ada projects kadithe meeku migiledi boche…

TDP has never been friendly with neighboring states…

Mari Kaleswaram ki nuv cheppina aa rules apply avvava bro?

Posted
2 hours ago, Android_Halwa said:

A nillu vachevi maa degari nundi..,memu muda ostamochinnatu eda padithe ada projects kadithe meeku migiledi boche…

TDP has never been friendly with neighboring states…

Inko Kuleshwaram kadathara enti....

Posted

Sea loki poye water meda mee hakku ente eddi dana?? anduku kadu ninu nee anna ni yedavalani chestundi chillar harish gadu..

Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత

12-01-2026 Mon 19:07 | Telangana
Kalvakuntla Kavitha Reacts to Supreme Court Setback on Project
  • తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడలేదని విమర్శ
  • నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారన్న కవిత
  • ఏపీ ప్రభుత్వం కేంద్రం అండతో అక్రమంగా పోలవరం - నల్లమలసాగర్ నిర్మిస్తోందని ఆరోపణ
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని మరోసారి స్పష్టమైందని ఆమె అన్నారు.

నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన న్యాయపోరాటంలో ప్రతిబింబించిందని ఆమె విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు, ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం హక్కులను నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వంలోని ఇతర ముఖ్య నాయకులకు నీటి వనరులపై అవగాహన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి న్యాయపోరాటం చేస్తుందని, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తుందని ఆమె స్పష్టం చేశారు. 
Posted
2 hours ago, Android_Halwa said:

 

TDP has never been friendly with neighboring states…

idhi langa gallu cheputnaraaa .. lol

eppudu chusina pakka states meda edavadam lo first undihi meeru kada county loo 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...