Jump to content

duraasa dukkaniki chetu


Recommended Posts

Posted

కాంగ్రెస్ అధినాయకత్వం దూరదృష్టి ఆదిలోనే బెడిసి కొట్టింది. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చిన నోటి హమీలను నమ్ముకుని నట్టేట మునిగింది. ముఖ్యంగా.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దూరపు చూపు(దృష్టి)కు బైర్లు కమ్మాయి. ఫలితంగా మొదటికే మోసం వచ్చింది. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' చందంగా సమైఖ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేస్తే రెండు రాష్ట్రాల్లో అధికారం చెలాయించవచ్చన్న దురాశ ఆ పార్టీ హైకమాండ్ పరవు పోయేలా చేసింది.

ముఖ్యంగా.. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. వైఎస్ వర్గం అధిష్టానాన్నే ధిక్కరించే స్థాయికి ఎదిగింది. చివరకు అధిష్టానం ఆదేశాలతో మిన్నకుండి పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ వర్గం (తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి)కు చెక్ పెట్టడం, బలమైన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నిర్వీర్యం చేసేందుకు వ్యూహం పన్నింది. ఇది పూర్తిగా బెడిసికొట్టింది.

వీరిద్దరిని అదుపు చేసేందుకు ఏకైక అస్త్రంగా రాష్ట్ర విభజనను ఎంచుకుంది. ఈ అంకానికి సోనియా గాంధీ తన చతుష్టయం (చిదంబరం, వీరప్ప మొయిలీ, ఏకే.ఆంటోనీ, అహ్మద్ పటేల్)తో పాటు.. వైఎస్ వ్యతిరేక వర్గీయులు వ్యూహ రచన చేశారు. వైఎస్ జీవించి ఉన్నతం కాలం తెలంగాణ అంశాన్ని కలలో కూడా ఊహించేందుకు సాహసం చేయని కాంగ్రెస్ అధిష్టానం.. ఆయన మృతి అనంతరం రాష్ట్ర పార్టీ కార్యకలపాలను పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకునేందుకు భారీ కసరత్తు చేసింది.

ఇందులోభాగంగానే బలహీనుడైన రోశయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటి నుంచే రాష్ట్రానికి చెడు కాలం ఆరంభమైందని పలువురు అధికార పార్టీ సభ్యులు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Posted

evadu tavukunna gotilo valle padataruu

dancegdb dancegdb dancegdb dancegdb
×
×
  • Create New...