Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: తొలి విడత ఎన్నికలు జరిగే తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంపై ప్రజారాజ్యం పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లనే తెలంగాణలో ప్రచారానికి ఆ పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో ప్రచారం చేయడానికి బదులు కోస్తే ప్రాంతంలో ప్రచారం చేస్తుండడం, యనవరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ మహబూబ్ నగర్ పర్టనను రద్దు చేసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వెళ్లడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. పార్టీకి అంతగా విజయావకాశాలు లేని తెలంగాణలో కంటె కోస్తా, రాయలసీమల్లో వస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఉండవచ్చని ప్రజారాజ్యం పార్టీ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిదశ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు గొడవల నుంచి బయటపడింది.

తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీ బరిలోకి దింపిన అభ్యర్ధులు కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్ధులను తట్టుకోలేరని ప్రజారాజ్యం అంచనా వేస్తోంది. ఈ ప్రాంతంలో త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం అభ్యర్ధులు మెజారిటీ స్థానాల్లో మూడో స్థానంలోనే ఉంటారని ఆ పార్టీ తెప్పించుకున్న తాజా నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రజారాజ్యం అగ్ర నేతల్లో ఒకరైన దేవేందర్ గౌడ్మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంతోపాటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి కూడా పోటీచేయడం ప్రజారాజ్యం గెలుపు పట్ల ధీమా లేకపోవడం వల్లనేనని అంటున్నారు. నల్గొండ జిల్లాలో గతంలో చిరంజీవి ప్రజా అంకిత యాత్ర నిర్వహించినప్పుడు నల్గొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని ఉందని, ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

అయితే ఆయన తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజారాజ్యం ఆవిర్భావం నుండి తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలపడకపోవడం, పార్టీ నుంచి టిక్కెట్లు పొందిన అభ్యర్ధులు కూడా దాదాపుఅంతా కొత్త ముఖాలే కావడం వల్ల గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉండక పోవచ్చని ప్రజారాజ్యం అభిప్రాయ పడుతోంది. తెలంగాణలోనే తెలుగుదేశం, టిఆరెస్, వామపక్షాలు బలంగా ఉండడం వల్ల ప్రజారాజ్యం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజాదరణ అంతగా ఉండకపోవచ్చని తాజా పరిస్థితులను పార్టీ విశ్లేషించుకుంటోంది. తొలి విడత ఎన్నికలకు వ్యవధి సమీపించిన ఈ సమయంలో పార్టీకి బలం లేని తెలంగాణలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించడం కంటె, ఆ సమయాన్ని ఉత్తరాంధ్రకు కేటాయించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చని ప్రజారాజ్యం భావిస్తోంది.

తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆరెస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారి కోసం, ఆ పార్టీలు అభ్యర్ధుల జాబితాలు ప్రకటించే వరకు వేచి చూసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. చివరకు మలపార్టీతో కూడా పొత్తు పెట్టుకుని, ఆరు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించవలసి వచ్చిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. టిఆరెస్ కు ప్రతిష్టాకరమైన, ఆ పార్టీ అధినేత కెసిఆర్ బరిలో ఉన్న, మహబూబ్ నగర్, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పోటీలో ఉన్న చేవెళ్ల వంటి లోక్ సభస్థానాల్లో ప్రజారాజ్యం నుంచి పోటీకి అభ్యర్ధులు దొరక్కపోవడం వల్లనే ఈ రెండు స్థానాలను మనపార్టీకి వదిలేసి చేతులు దులిపేసుకోవలసి వచ్చిందని చెబుతున్నారు.

Posted

idi mundaranunchi chebutunnade kada

×
×
  • Create New...