Jump to content

Sonia Vs Andhra Pradesh People --> Interesting - History Chala Vundi


Recommended Posts

Posted

Google Translate use chesi english lo vestanu aagu..  :4_12_13:

 

ok..holidays em chestunnav.. 

  • Replies 59
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Anta Assamey

    23

  • Vaampire

    7

  • Spartan

    6

  • dalapathi

    5

Top Posters In This Topic

Posted

మానసిక విశ్లేషకులు, రాజకీయ సమీక్షకులు ''రేపు'' నరసింహారావుగారు ఆంధ్రజ్యోతిలో 'సోనియా గాంధీ జీవన విశ్లేషణ' అంటూ నాలుగు రోజుల పాటు వ్యాసాలు రాశారు. ఆమె జీవితంలోని అనేక ఘట్టాలను - ఆమెను హీనంగా చూపే వాటిని - ఏరి కూర్చారు. వాటితో బాటు ఆమె వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు. చివరి వ్యాసంలో ఆమెకు ఆంధ్రులంటే ఆగ్రహం అంటూ కొన్ని ఉదాహరణలు చూపారు.

వాటిలో కొన్ని - 1) 'రాజీవ్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత లోకసభలో ఆయన్ని యిబ్బంది పెట్టినవారు ఎవరు అని అడిగితే దక్షిణాదిన తెలుగు మాట్లాడేవారిని ఆమెకు తెలిసిందట 2) ఆమె భారతపౌరసత్వం లేకుండానే ఓటరుగా నమోదయిన విషయం గురించి ఉపేంద్ర పార్లమెంటులో ఎత్తితే ఆమె 'నీ అంతం చూస్తా' అని ఉపేంద్రను స్వయంగా బెదిరించారట  3) జైపాల్‌ రెడ్డి బోఫోర్స్‌ విషయంలో రాజీవ్‌ను విమర్శించడం రాజీవ్‌ను బాధించింది 4) విపి సింగ్‌ కూటమి ఏర్పాటుకు టిడిపి చొరవ తీసుకుంది 5) ఒక ఆంధ్ర మహిళా ఎంపీ రాజీవ్‌కు అతిసన్నిహితంగా వుండడం సోనియాను బాధించింది 6) సోనియా లాభదాయక పదవిలో వున్నారని ఎర్రన్నాయుడు ఆరోపించడం చేతనే సోనియా మళ్లీ పోటీ చేయవలసి వచ్చింది, అది ఆమెను కలచివేసింది 7) తను ఆమోదించడం చేత ప్రధాని అయిన పివి తనపట్ల కృతజ్ఞత చూపకపోవడంతో ఆమెలో ద్వేషం పెరిగింది 8) వైయస్సార్‌ను సిఎం చేస్తే ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం ఆమెకు వ్యతిరేకత ఏర్పడింది. ఇవన్నీ చెప్పి 'ఆంధ్రులంటే  ఆగ్రహం కాబట్టి రాష్ట్రాన్ని విభజించారు' అని తేల్చారు నరసింహారావుగారు.

ఈయన చెప్పిన విషయాల్లో కాస్త లోతుగా వెళితే - 1) రాజీవ్‌ ప్రధాని అయినపుడు టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా వుంది. అందుకే వాళ్లు పార్లమెంటులో ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతమాత్రం చేత కోపం తెచ్చుకునేమాటైతే ఆ తర్వాత 1989లో, 2004లో, 2009లో కాంగ్రెసు ప్రభుత్వాలను రాష్ట్రంలో గెలిపించినందుకు సోనియాకు కోపం తగ్గి వుండాలిగా! ముఖ్యంగా 2009 యుపిఏ-2 ఏర్పడ్డానికి 33 మంది తెలుగు ఎంపీలే కారణమని అందరికీ తెలిసినపుడు ఆమెకు మాత్రం తెలియదా? 2) నేను ఉపేంద్రగారి ఆత్మకథ చదివాను. ఈ సంఘటన ఎక్కడా చదివిన గుర్తు లేదు. పైగా మితభాషి అయిన సోనియా హైదరాబాదు ఎయిర్‌పోర్టులో బహిరంగంగా అలా బరస్ట్‌ అవుతుందంటే నమ్మగలమా? ఉపేంద్రపై అంతకోపం వుంటే మరి 1998లో విజయవాడ ఎంపీ స్థానానికి కాంగ్రెసు టిక్కెట్టు ఎందుకు యిచ్చినట్లు? 3) బోఫోర్స్‌ విషయంలో చేసిన వ్యాఖ్యల గురించి  జైపాల్‌ రెడ్డిని సోనియా క్షమించలేకపోతే ఆయన్ను మాత్రం కాంగ్రెసులో ఎందుకు చేర్చుకున్నారు? కేంద్ర కాబినెట్‌లో అతి ముఖ్యమైన శాఖలు ఎందుకు అప్పగించారు? ఇప్పుడు తెలంగాణ విషయంలో ఆయన చెప్పినట్ల్లే ఎందుకు ఆడుతున్నారు?

4) రాజీవ్‌ గాంధీకి అత్యంత ఆత్మీయుడిగా మెలగిన విపి సింగ్‌ బోఫోర్స్‌ విషయంలో రాజీవ్‌తో విభేదించి, అరుణ్‌ నెహ్రూతో కలిసి బయటకు వచ్చి నేషనల్‌ ఫ్రంట్‌లో చేరారు. ఎన్టీయార్‌ ఆ ఫ్రంట్‌కు కన్వీనరుగా వున్నారు. 1989 ఎన్నికలలో టిడిపి ఘోరంగా ఓడిపోయి, పార్లమెంటులో సోదిలోకి లేకుండా పోయింది. సోనియాకు కోపం వుంటే విపి సింగ్‌, అరుణ్‌ నెహ్రూలపై వుండాలి, నరసింహారావుగారి లాజిక్‌ ప్రకారం వారి సొంత రాష్ట్రమైన యుపిపై వుండాలి, మధ్యలో తెలుగువాళ్లపై కోపం ఏమిటి?

5) రాజీవ్‌ గురించిన యీ ఆరోపణ గాని యిలాటి ఆరోపణగాని నేనెన్నడూ వినలేదు. అయినా భర్త ప్రియురాలు ఏ భాష మాట్లాడితే వారందరినీ దూరం చేసుకుంటారా? అలా అయితే పురంధరేశ్వరి, రేణుకా చౌదరి.. వంటి వాళ్లకు ఏ పదవి యివ్వకుండా వుండవచ్చు కదా 6) పార్లమెంటులో ప్రతిపక్షం అన్నాక లక్ష ఆరోపిస్తారు. వాధ్రా గురించి బిజెపి అనడం లేదా? ఎర్రన్నాయుడు ఓ ఆరోపణ చేశారు కదాని తెలుగువాళ్లందరిపై కక్ష కట్టారంటే అంతకంటె జోక్‌ మరొకటి వుండదు 7) పివికి, సోనియాకు మధ్య అనేక రాజకీయాలు నడిచాయి. సోనియాను కట్టడి చేయడానికి పివి  ప్రయత్నాలు చేశారు. చివరకు సోనియా పార్టీపై పట్టు సాధించి పివిపై కసి తీర్చుకున్నారు. పివి తెలుగువాడు కాకుండా మలయాళీ అయినా అదే జరిగి వుండేది. పివి పోయిన 9 ఏళ్లకు యిప్పుడు గుర్తు పెట్టుకుని కక్ష సాధించాలని రాష్ట్రాన్ని విభజించిందంటే నమ్మడం ఎలా? 8) వైయస్సార్‌ సోనియాకు ఆప్తుడు కాడంటే నవ్వు వస్తుంది. రాష్ట్రంలో కనబడిన ప్రతీ రాయిపై రాజీవ్‌ పేరు రాసి శిలాఫలకాలుగా పాతేసిన వైయస్‌ అంటే సోనియాకు కోపమా?

అసలు మనమందరం ఒప్పుకోవాల్సిన పాయింటు ఒకటుంది - తెలుగువాళ్లని విడగొట్టాలన్న ఐడియా కాపీరైటు సోనియాది కాదు. చిన్నారెడ్డి వంటి ఎమ్మెల్యేలది. వాళ్లు ఎప్పుడో లేఖ యిస్తే పక్కన పడేసింది. మన తెలుగువాళ్లలోనే 40% ప్రాంతపు ప్రజాప్రతినిథులు - పార్టీల భేదం లేకుండా - 'మేం సాటి తెలుగువాళ్లతో వేగలేకపోతున్నాం, వాళ్లు దుర్మార్గులు, దుష్టులు, రాక్షససంతతి వారు, మమ్మల్ని దోచుకుంటున్నారు' అని హాహాకారాలు చేసి ఆవిణ్ని బతిమాలారు. గత తొమ్మిదేళ్లగా 'ఇంకా తేల్చలేదేం?' అంటూ ఊదరగొట్టేశారు. వాళ్లను వూరుకోబెట్టడానికి 2004లోనే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో చేర్చినా, ఏకాభిప్రాయం సాధించాక చేస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ జోకొట్టి జోకొట్టి తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచిన ఘనత సోనియాదే. ఇప్పుడు కూడా సమైక్యవాది ఐన నరసింహారావుగారికి సోనియా చేస్తున్నది దుర్మార్గంగా తోచవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు ఆమె దేవతగానే కనబడుతోంది. తెలంగాణ ప్రజలు కూడా తెలుగువారే అని రావుగారు భావిస్తే ఆమెకు తెలుగువారంటే ద్వేషం, ఆగ్రహం అనే మాటలను సవరించుకుని, 'కొందరు తెలుగువారంటే..' అని వ్యాసం రాసుకోవాలి.

అంత మాత్రం ఆలోచన లేకుండా నరసింహారావుగారు యింతటి వితండ వాదన ఎందుకు చేసినట్లు? తన మీద కోపంతో సోనియా తెలుగువాళ్లను విభజిస్తోందని చంద్రబాబు చేస్తున్న చేస్తున్న ప్రచారానికి యీయన సైద్ధాంతిక అంశాలు అద్దబోయారు. రావుగారి పాయింట్లలో చాలా భాగం టిడిపి నాయకులను హీరోలుగా చూపించే ప్రయత్నం ప్రస్ఫుటంగా కనబడుతోంది. గతంలో రావుగారు జగన్‌ మానసిక విశ్లేషణ అంటూ కూడా చేశారు. అది చదివితే జగన్‌ అంటే ఎవరో అండర్‌ వరల్డ్‌ డాన్‌ అనుకుంటాం. ఇప్పుడు సోనియాని పట్టించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె చేసిన నిర్ణయానికి 'తెలుగువాళ్లపై కోపం' అంటూ విపరీత వ్యాఖ్యానం చేసి' దానికి 'ఆమెకు భారతసమాజం గురించి కనీస అవగాహన లేదు' అంటూ మానసిక విశ్లేషణ చేర్చి వ్యాసం రాసేశారు.

'తెలుగువాళ్లను విభజించండి' అని లేఖ యిచ్చి, అంతటితో ఆగకుండా దాన్ని పదేపదే ఉటంకించి, 'ఏం యింకా విడగొట్టరేం? నిర్ణయం తీసుకునే దమ్ము లేదా? చేతకాదా?' అని సోనియాను ఉడికించి, రెచ్చగొట్టి యిప్పుడు కూడా 'విభజిస్తే తప్పు లేదు కానీ కొబ్బరి చిప్పల్లా సమానంగా విడగొట్టాలి' అంటూ పాట పాడుతున్న చంద్రబాబు గారికి తెలుగువాళ్ల మీద ప్రేమో, కోపమో, ద్వేషమో, వారికి భారత సమాజం మాట ఎలా వున్నా తెలుగుసమాజంపై అవగాహన వుందో లేదో కూడా.. అది కూడా త్వరలోనే విశ్లేషణ చేసి చెప్తారని ఎదురు చూస్తున్నాను.

 

Source : http://telugu.greatandhra.com/articles/mbs/mbs-sonia-manasika-visleshana-48684.html

 

Dala ee article rasina MBS... ekada tappu ani cheppaledu kada... kopam vachi vunte taggi vundali kada antunadu etc etc... kaani kopam continue avvataniki kuda reasons vunnayi.. aa narasimha rao rasina article lo.. mottam chaduvu neeke ardam avutundi

Posted

ok..holidays em chestunnav.. 

 

Kaali eee em chestanu...  :3D_Smiles_38:

Posted

beach is always a beach..

 

Kaadu maayyaa oka sari kanisam only first post mottam chaduvu neeku chala vishayalu telustayi... chala kotta info ichadu...  :4_12_13:  Chinna example idigo..

 

సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే... హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు 'నీ అంతు చూస్తా' అని హెచ్చరించారట!

 

Posted

Kaadu maayyaa oka sari kanisam only first post mottam chaduvu neeku chala vishayalu telustayi... chala kotta info ichadu...  :4_12_13:

 

chusa.. education is the key weapon ... people ippudu iipude relaize avutunaru...  apatlo denini baga advantage tesukunadu nehru gadu... vadi kurutriki kuda ade chepi untadu.. velani educate cheste nee mata vinaru ani.. anduke congress gov development meda asalu focus petadu

Posted

chusa.. education is the key weapon ... people ippudu iipude relaize avutunaru...  apatlo denini baga advantage tesukunadu nehru gadu... vadi kurutriki kuda ade chepi untadu.. velani educate cheste nee mata vinaru ani.. anduke congress gov development meda asalu focus petadu

 

Baga pattdindi le asalu... Idi choodu..

 

సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే... హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు 'నీ అంతు చూస్తా' అని హెచ్చరించారట!

Posted

Ippudu baga naakutu vunna Jaipal reddy paristiti idi appatlo...

 

తెలుగుదేశం ఆనాడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. సభలో మాట్లాడే అవకాశం వారికే ఎక్కువగా వచ్చేది. వారితో ఇతర ప్రతిపక్షాలు జత కలిసేవి. ప్రతిపక్షంలో ఉన్న జైపాల్‌రెడ్డి (ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రి) బోఫోర్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించగా... రాజీవ్‌గాంధీ అమిత క్రోదంతో 'మీకు శారీరక వైకల్యమే కాదు, మానసిక వైకల్యం కూడా ఉంది' అని మండిపడ్డారు.

Posted

Matter is simple maan.......AP is the major contributer for MP seats of all congress ruling states......GIven the anti-incumbency it alraedy can get 5 MP in united andhra..........They clearly went ahaed with TG decision bearing the consequences in seemandhra as they know ysrcp would give support to them in SA ..........Its not a rocket science!!!

Posted

Kaali eee em chestanu...  :3D_Smiles_38:

 

P0rn and beating aa all the time...

 

Java material emaindi..?

Posted

lol. upendra ni nee hanthu choostha ani sonia hecharinchinda. idhi highlight assalu.

article raasina athani lo sonia sep tg grant chesindi aney kopam thappa inka emi kanapadatledhu.

 

jaipal reddy handicapped meedha rajiv comments chesadu ani nenu aithey anukonu. incase anukunna jaipal reddy ey congress lo join ayyadu. mana state varaku evari ivvani importance ayinaki icharu.

 

first paragraph chadivithey naaku aithey tdp meedha kopam tho tg ichindi ani author cheppali anukunnadu anipinchindi. 

lakshala mandi roads meedha vachina tg decision marchukoledhu ani cheppadu author. mari 3 years back tg lo kooda lakhs of people roads meedha vacharu kada. daanini ignore cheyyala.

all major political parties(including tdp, ysrcp) agreed to sep tg. blame antha sonia okkadaani meedha veyyadam endo

Posted

P0rn and beating aa all the time...

 

Java material emaindi..?

 

Naaku ee papam teliyadu....4s086h.gif

Java material aa... class drop ayyanu... next semester ki postpone chesanu..aa sangate marchipoya...4s086h.gif

Posted

Baga pattdindi le asalu... Idi choodu..

 

సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే... హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు 'నీ అంతు చూస్తా' అని హెచ్చరించారట!

Upendra quit the TDP following differences with N Chandrababu Naidu and joined the Congress in 1994. He was elected to the Lok Sabha from Vijayawada in 1996 and re-elected in 1998.

Posted

Upendra quit the TDP following differences with N Chandrababu Naidu and joined the Congress in 1994. He was elected to the Lok Sabha from Vijayawada in 1996 and re-elected in 1998.

 

Kaadu ani ekkada ananu... Jarigina sangati chepparu akkada ante.. vadiki siggu lekunda jerite... chadive vallani kuda ala accept cheyamante ela Vamparire...4s086h.gif

Posted

Naaku ee papam teliyadu....4s086h.gif

Java material aa... class drop ayyanu... next semester ki postpone chesanu..aa sangate marchipoya...4s086h.gif

 

wat doing at work then..?

×
×
  • Create New...