Jump to content

Which One To Believe Exit Polls Or Mptc Zptc Or Lagadapati


Recommended Posts

Posted

ZPTC MPTC ఎన్నికలు సొంత అభిప్రాయం అభిమానం మిదన జరుగుతయి అలాంటి ఫలితాలను చూసి మూసపొవద్దు రాస్త్ర ఎన్నికలు ఎవరు అనె దాని మీద జరుగుతాయి ఎక్కూవ మంది ప్రజలు జగనన్న కొసం ఎదుచుస్తున్నరు రాజన్న రాజ్యం వస్తుంది 

Posted

I think even if YSRCP looses in general elections.. they will say that jagan leads in exit polls so he deserves to be CM of AP

Posted

I support mptc zptc and muncipal. Reason is they are actual votes not virtual exit polls where samples are way less than votes


g009_idi_amin_laughing_soldier.gif

Posted

I think even if YSRCP looses in general elections.. they will say that jagan leads in exit polls so he deserves to be CM of AP

 

no the'll demand their own state with jagan as CM pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

I doubt if he looses he may start seperate rayalaseema agitation

Posted

I doubt if he looses he may start seperate rayalaseema agitation

 

from inside the jail pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

వైసిపి ఆధిక్యం- టిడిపి గట్టి పోటీ

Posted on: Wed 14 May 02:59:55.904081 2014

lin.jpg

 

 

అసెంబ్లీ: వైసిపి - 89 టిడిపి - 82 ఇతరులు - 4 లోక్‌సభ: వైసిపి-14 టిడిపి-10 బిజెపి-1
- ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు
- ఉత్తరాంధ్ర,అనంతపురం టిడిపి జోరు 
- మధ్య కోస్తాలో హోరాహోరీ, 
-దక్షిణ కోస్తా, మూడు రాయలసీమ జిల్లాల్లో వైసిపి ఆధిక్యత
- మహిళలు, మైనారిటీలు వైసిపి వైపు మొగ్గు
                              2014 ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ప్రజాశక్తి నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 89 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 82 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వైసిపి స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత వున్నవి 62, మొగ్గు వున్నవి 27 కాగా తెలుగుదేశం స్థానాల్లో ఆధిక్యత వున్నవి 51, మొగ్గు 31 అగుపిస్తున్నాయి. సాధ్యమైనంత కచ్చితంగా ప్రామాణికంగా ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించినప్పటికీ సహజంగా వుండే పరిమితులు ఇతర సమస్యల రీత్యా స్పష్టమైన ఆధిక్యత వున్నవాటినీ మొగ్గు వున్నవాటినీ విడివిడిగా వున్నాయి. 
                              రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఇతరులకు లభించే అవకాశం వుంది. ఇందులో మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వంత నియోజకవర్గమైన పీలేరు కూడా వుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభానాగిరెడ్డి పోటీ చేసిన ఆళ్లగడ్డ వైసీపీ జాబితాలో వుంది. 
                              ఇక లోక్‌సభకు సంబంధించి వైసీపీకి 14 స్థానాలు వచ్చే అవకాశముండగా టిడిపికి 10, బిజెపికి 1 వస్తాయని ఎగ్జిట్‌ పోల్‌ చెబుతున్నది.
హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటంలో ఫలితాల సరళిని అంచనా వేయడం కోసం ప్రజాశక్తి సాంకేతిక నిపుణుల సహాయంతో క్రమబద్ధమైన పద్దతిలో మే 7వ తేదీన ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించింది. మొత్తం 175 నియోజకవర్గాలలోనూ మూడు మండలాల చొప్పున ఎన్నుకుని పోలింగ్‌బూత్‌ల నుంచి రాగానే బ్యాలట్‌ ఇచ్చి ఓటు వేయించింది. సాధారణంగా ఈ పద్ధతి మిగిలిన వాటికన్నా విశ్వసనీయ ఫలితాలు ఇస్తుందనేది ఎన్నికల సర్వేల అనుభవం. ఎన్నికల సంఘ నియమ నిబంధనల ప్రకారం మే13వ తేదీన వీటిని విడుదల చేసింది. వాస్తవానికి గత మూడురోజులుగా పలువురు వీటి గురించి వాకబు చేస్తూ వచ్చారు. 2004 ఎన్నికల సందర్భంలో ప్రజాశక్తి నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అసలు ఫలితాలకు చాలా దగ్గరగా వుండటం ఇందుకు కారణం. మీడియాలో విపరీత మైన విభజన నెలకొన్న నేపథ్యంల్లో ప్రజాశక్తి విశ్వసనీయంగా వుంటుందని అన్ని పక్షాలూ భావిం చడం విశేషం. తెలంగాణ ప్రాంతంలోనూ ప్రజాశక్తి ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది.
                              మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు, తర్వాత ఎంపిటిసి, జెడ్పీటీసీ ఫలితాలు తెలుగుదేశం వైసీపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు వెల్లడించాయి. ప్రజాశక్తి ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఆ వాస్తవాన్నే ప్రతిబింబిస్తున్నది. ఈ మూడు ఎన్నికల మధ్య కొంత తేడా వుండటం అనివార్యమని అర్థమవుతుంది. మునిసిపల్‌ ఎన్నికలకూ ఎంపిటీసీలకూ మధ్యనే పోలిక లేనప్పుడు ఆ మూడు ఎన్నికలకూ శాసన సభకూ దానికీ లోక్‌సభకూ మధ్య కూడా భిన్న పరిస్థితి వుండే అవకాశం కనిపిస్తుంది. సంస్థాగత బలం దీర్ఘకాలికంగా వున్న తెలుగుదేశం కాంగ్రెస్‌ వంటి పార్టీలతో పోలిస్తే టిఆర్‌ఎస్‌, ఇంకా వైసీపీ స్థానిక స్థానాలన్నిటా సమాన పోటీ ఇవ్వలేకపోవడం అర్థం చేసుకోదగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఎన్నిక జరగక పోవడం వల్ల స్థానిక కార ణాలు వ్యవస్థాగత బలం ప్రధానంగా ప్రభావితం చేస్తుంటాయి. కాని శాసన సభ ఎన్నికలకు వచ్చే సరికి రాజకీయ నిర్ణయమే ప్రధానంగా వుంటుంది. దానికి తోడు విభజనా నంతర ఆందోళనలు కూడా తమ ప్రభావం చూపిం చాయని అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా వుండక పోవచ్చన్న సందే హంతోనే వైసీపీ అనుకూల న్యాయ వాదులు కొందరు ఆ ఫలితాల విడుదలను నివారిస్తూ కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయించార న్నది గమనించాల్సిన విషయం. ఈ పోలింగు సరళిని పరిశీలించినప్పుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖ పట్టణం జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యత చూపింది. విజయనగరంలో వైసీపీ బలం చాటుకుంది. తూర్పు గోదావరిలో వైసీపీ ఆధిక్యత వుంటే పశ్చిమ గోదావరిలో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పోటాపోటీ వుంది. రాయలసీమలోని కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో వైసీపీది పై చేయిగా వుండగా అనంతపు రంలో గతంలో లాగే తెలుగుదేశం ఆధిక్యత నిలబెట్టు కోనున్నది. మొగ్గు కింద చూపిన స్థానాలు అటూ ఇటూ అయితే ఈ ఫలితాలు మరికొంత మారే అవకాశం కూడా వుంటుంది.అయితే మొత్తంపైన వైసీపీకి స్పష్టమైన స్వల్ప ఆధిక్యత వుంది. సాధారణంగా మొగ్గు జాబితాలోని స్థానాలు విజయం సాధించే పార్టీకి అనుకూలంగా వెళ్లే అవకాశం వుంటుంది గనక వైసీపికి మరికొన్ని అదనంగా రావచ్చు. ఆవిధంగా 90-100 మధ్య స్థానాలతో వైసీపీ అధికారం హస్తగతం చేసుకోవచ్చు. మొత్తంపైన ఈ ఫలితా లను పరిశీలించినప్పుడు ఏకపక్ష ధోరణి అగుపించ డం లేదు. స్వర్ణాంధ్ర నిర్మాణం చంద్రబాబు వల్లనే సాధ్యమని ప్రజలు భావించారని టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే జగన్‌ను బలపర్చాలని ప్రజలు ఏనాడో నిర్ణయిం చుకున్నారనీ, తెలుగుదేశం ఘోరంగా దెబ్బతిం టుందని వైసీపీ చెబుతూ వచ్చింది. ఈ ఫలితాలను పరిశీలించినప్పుడు ఉభ యుల మధ్య గట్టి పోటీ వుందనీ, ఎవరూ అవతలి వారిని పూర్తిగా తుడిచి పెట్టే పరిస్థితి లేదని తేలిపోతుంది. ఈ విష యంలో తెలుగు దేశంకు ఎక్కువ నిరు త్సాహం కలగొచ్చు. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనే ఒక ప్రధాన శక్తి అదృశ్యమై పోవడంతో ఆ బలాన్ని తెలుగుదేశం వైసీపీ పంచు కున్నాయి. వారిలో చాలామంది మొదటే వైసీపీలో చేరగా చివరి సమయంలో కొందరు టిడిపిని ఆశ్రయించారు.
సామాజిక సమీకరణలు తీవ్ర ప్రభావం
                              సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటింగు వైసీపీవైపు మొగ్గి వుండే అవకాశం ఎక్కువగా వుంది. ఇక సామాజిక సమీకరణల ప్రభావం కూడా తీవ్రంగానే వుంది. వపన్‌ కళ్యాణ్‌ రాకవల్ల వుంటుందనుకున్న ప్రభావం గోదావరి జిల్లాల్లో ఏమంతగా లేకపోవడం గమ నార్హం. మరో ముఖ్యమైన అంశం మోడీ ప్రభావం తప్ప ప్రభంజనం ఏదీ లేదని కూడా తేలిపోతుంది. స్థానిక ఎన్నికల నాటికి తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకోలేదు గనక లౌకికపార్టీగా అన్ని తరగతులు ఓట్లు తెచ్చుకుని వుండే అవకాశం వుంది. కాని మోడీ ప్రధానమైన ప్రచారం ప్రారంభమైన తర్వాత మైనార్టీల ఓటింగును గణనీయంగా కోల్పోవడం సంభవం. ఈ అంశం లోక్‌సభ స్థానాల విషయంలో మనకు కనిపిస్తుంది. కనీసం ఆరు లోక్‌సభ స్థానాల్లో వారి ఓటింగు గణనీయంగా వుంది. అక్కడంతా వైసీపీ గెలిచే సూచనలు వున్నాయి. సోమవారం విడుదలైన కొన్ని జాతీయ ఛానళ్ల ఎగ్జిట్‌ పోల్‌కూ, ప్రజాశక్తి పోల్‌కూ అంకెల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వుండటం గమనించవచ్చు. ఇతర శక్తులలో వామపక్షాలూ కూడా ఎక్కడా పాగా వేయలేకపోయాయి. మంగళగిరి, కర్నూలు వంటి చోట్ల సిపిఎంకు గణనీయమైన ఓటింగు కనిపిం చింది. లోక్‌సత్తా, ఆప్‌ వంటివి ఎక్కడా జాడలేదు. ఇది ఒపీనీయన్‌ పోల్‌ కాదు గనక ఏ కారణాల వల్ల ఓటు వేస్తున్నారు వంటి ప్రశ్నలు వేయలేదు.కాని మొత్తంపైన సామాజిక సమీకరణలు, సంక్షేమ పథకాలపై విశ్వాసం, ధనం, మద్యం, స్థానిక దళారీల పాత్ర, దీర్ఘకాలికంగా చేసుకుంటున్న సన్నాహాలు కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. తెలుగుదేశం కూడా రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వంటి వాగ్దానాలు తమకు కలిసి వచ్చాయని చెబుతున్నది. అంతేగాని విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించిన విధానపరమైన అంశాలు అంతగా ఓటర్లలోకి వెళ్లినట్టు కనిపించదు. కనక భవిష్యత్తు లోనైనా అలాటి మౌలిక అంశాలపై ఓటర్ల చైతన్యం పెంచాల్సిన బాధ్యత ఆలోచనా పరులపై వుంటుంది.

Posted

వైసిపి ఆధిక్యం- టిడిపి గట్టి పోటీ

Posted on: Wed 14 May 02:59:55.904081 2014

lin.jpg

 

 

అసెంబ్లీ: వైసిపి - 89 టిడిపి - 82 ఇతరులు - 4 లోక్‌సభ: వైసిపి-14 టిడిపి-10 బిజెపి-1
- ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు
- ఉత్తరాంధ్ర,అనంతపురం టిడిపి జోరు 
- మధ్య కోస్తాలో హోరాహోరీ, 
-దక్షిణ కోస్తా, మూడు రాయలసీమ జిల్లాల్లో వైసిపి ఆధిక్యత
- మహిళలు, మైనారిటీలు వైసిపి వైపు మొగ్గు
                              2014 ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ప్రజాశక్తి నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 89 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 82 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వైసిపి స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత వున్నవి 62, మొగ్గు వున్నవి 27 కాగా తెలుగుదేశం స్థానాల్లో ఆధిక్యత వున్నవి 51, మొగ్గు 31 అగుపిస్తున్నాయి. సాధ్యమైనంత కచ్చితంగా ప్రామాణికంగా ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించినప్పటికీ సహజంగా వుండే పరిమితులు ఇతర సమస్యల రీత్యా స్పష్టమైన ఆధిక్యత వున్నవాటినీ మొగ్గు వున్నవాటినీ విడివిడిగా వున్నాయి. 
                              రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఇతరులకు లభించే అవకాశం వుంది. ఇందులో మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వంత నియోజకవర్గమైన పీలేరు కూడా వుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభానాగిరెడ్డి పోటీ చేసిన ఆళ్లగడ్డ వైసీపీ జాబితాలో వుంది. 
                              ఇక లోక్‌సభకు సంబంధించి వైసీపీకి 14 స్థానాలు వచ్చే అవకాశముండగా టిడిపికి 10, బిజెపికి 1 వస్తాయని ఎగ్జిట్‌ పోల్‌ చెబుతున్నది.
హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటంలో ఫలితాల సరళిని అంచనా వేయడం కోసం ప్రజాశక్తి సాంకేతిక నిపుణుల సహాయంతో క్రమబద్ధమైన పద్దతిలో మే 7వ తేదీన ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించింది. మొత్తం 175 నియోజకవర్గాలలోనూ మూడు మండలాల చొప్పున ఎన్నుకుని పోలింగ్‌బూత్‌ల నుంచి రాగానే బ్యాలట్‌ ఇచ్చి ఓటు వేయించింది. సాధారణంగా ఈ పద్ధతి మిగిలిన వాటికన్నా విశ్వసనీయ ఫలితాలు ఇస్తుందనేది ఎన్నికల సర్వేల అనుభవం. ఎన్నికల సంఘ నియమ నిబంధనల ప్రకారం మే13వ తేదీన వీటిని విడుదల చేసింది. వాస్తవానికి గత మూడురోజులుగా పలువురు వీటి గురించి వాకబు చేస్తూ వచ్చారు. 2004 ఎన్నికల సందర్భంలో ప్రజాశక్తి నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అసలు ఫలితాలకు చాలా దగ్గరగా వుండటం ఇందుకు కారణం. మీడియాలో విపరీత మైన విభజన నెలకొన్న నేపథ్యంల్లో ప్రజాశక్తి విశ్వసనీయంగా వుంటుందని అన్ని పక్షాలూ భావిం చడం విశేషం. తెలంగాణ ప్రాంతంలోనూ ప్రజాశక్తి ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది.
                              మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు, తర్వాత ఎంపిటిసి, జెడ్పీటీసీ ఫలితాలు తెలుగుదేశం వైసీపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు వెల్లడించాయి. ప్రజాశక్తి ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఆ వాస్తవాన్నే ప్రతిబింబిస్తున్నది. ఈ మూడు ఎన్నికల మధ్య కొంత తేడా వుండటం అనివార్యమని అర్థమవుతుంది. మునిసిపల్‌ ఎన్నికలకూ ఎంపిటీసీలకూ మధ్యనే పోలిక లేనప్పుడు ఆ మూడు ఎన్నికలకూ శాసన సభకూ దానికీ లోక్‌సభకూ మధ్య కూడా భిన్న పరిస్థితి వుండే అవకాశం కనిపిస్తుంది. సంస్థాగత బలం దీర్ఘకాలికంగా వున్న తెలుగుదేశం కాంగ్రెస్‌ వంటి పార్టీలతో పోలిస్తే టిఆర్‌ఎస్‌, ఇంకా వైసీపీ స్థానిక స్థానాలన్నిటా సమాన పోటీ ఇవ్వలేకపోవడం అర్థం చేసుకోదగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఎన్నిక జరగక పోవడం వల్ల స్థానిక కార ణాలు వ్యవస్థాగత బలం ప్రధానంగా ప్రభావితం చేస్తుంటాయి. కాని శాసన సభ ఎన్నికలకు వచ్చే సరికి రాజకీయ నిర్ణయమే ప్రధానంగా వుంటుంది. దానికి తోడు విభజనా నంతర ఆందోళనలు కూడా తమ ప్రభావం చూపిం చాయని అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా వుండక పోవచ్చన్న సందే హంతోనే వైసీపీ అనుకూల న్యాయ వాదులు కొందరు ఆ ఫలితాల విడుదలను నివారిస్తూ కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయించార న్నది గమనించాల్సిన విషయం. ఈ పోలింగు సరళిని పరిశీలించినప్పుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖ పట్టణం జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యత చూపింది. విజయనగరంలో వైసీపీ బలం చాటుకుంది. తూర్పు గోదావరిలో వైసీపీ ఆధిక్యత వుంటే పశ్చిమ గోదావరిలో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పోటాపోటీ వుంది. రాయలసీమలోని కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో వైసీపీది పై చేయిగా వుండగా అనంతపు రంలో గతంలో లాగే తెలుగుదేశం ఆధిక్యత నిలబెట్టు కోనున్నది. మొగ్గు కింద చూపిన స్థానాలు అటూ ఇటూ అయితే ఈ ఫలితాలు మరికొంత మారే అవకాశం కూడా వుంటుంది.అయితే మొత్తంపైన వైసీపీకి స్పష్టమైన స్వల్ప ఆధిక్యత వుంది. సాధారణంగా మొగ్గు జాబితాలోని స్థానాలు విజయం సాధించే పార్టీకి అనుకూలంగా వెళ్లే అవకాశం వుంటుంది గనక వైసీపికి మరికొన్ని అదనంగా రావచ్చు. ఆవిధంగా 90-100 మధ్య స్థానాలతో వైసీపీ అధికారం హస్తగతం చేసుకోవచ్చు. మొత్తంపైన ఈ ఫలితా లను పరిశీలించినప్పుడు ఏకపక్ష ధోరణి అగుపించ డం లేదు. స్వర్ణాంధ్ర నిర్మాణం చంద్రబాబు వల్లనే సాధ్యమని ప్రజలు భావించారని టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే జగన్‌ను బలపర్చాలని ప్రజలు ఏనాడో నిర్ణయిం చుకున్నారనీ, తెలుగుదేశం ఘోరంగా దెబ్బతిం టుందని వైసీపీ చెబుతూ వచ్చింది. ఈ ఫలితాలను పరిశీలించినప్పుడు ఉభ యుల మధ్య గట్టి పోటీ వుందనీ, ఎవరూ అవతలి వారిని పూర్తిగా తుడిచి పెట్టే పరిస్థితి లేదని తేలిపోతుంది. ఈ విష యంలో తెలుగు దేశంకు ఎక్కువ నిరు త్సాహం కలగొచ్చు. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనే ఒక ప్రధాన శక్తి అదృశ్యమై పోవడంతో ఆ బలాన్ని తెలుగుదేశం వైసీపీ పంచు కున్నాయి. వారిలో చాలామంది మొదటే వైసీపీలో చేరగా చివరి సమయంలో కొందరు టిడిపిని ఆశ్రయించారు.
సామాజిక సమీకరణలు తీవ్ర ప్రభావం
                              సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటింగు వైసీపీవైపు మొగ్గి వుండే అవకాశం ఎక్కువగా వుంది. ఇక సామాజిక సమీకరణల ప్రభావం కూడా తీవ్రంగానే వుంది. వపన్‌ కళ్యాణ్‌ రాకవల్ల వుంటుందనుకున్న ప్రభావం గోదావరి జిల్లాల్లో ఏమంతగా లేకపోవడం గమ నార్హం. మరో ముఖ్యమైన అంశం మోడీ ప్రభావం తప్ప ప్రభంజనం ఏదీ లేదని కూడా తేలిపోతుంది. స్థానిక ఎన్నికల నాటికి తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకోలేదు గనక లౌకికపార్టీగా అన్ని తరగతులు ఓట్లు తెచ్చుకుని వుండే అవకాశం వుంది. కాని మోడీ ప్రధానమైన ప్రచారం ప్రారంభమైన తర్వాత మైనార్టీల ఓటింగును గణనీయంగా కోల్పోవడం సంభవం. ఈ అంశం లోక్‌సభ స్థానాల విషయంలో మనకు కనిపిస్తుంది. కనీసం ఆరు లోక్‌సభ స్థానాల్లో వారి ఓటింగు గణనీయంగా వుంది. అక్కడంతా వైసీపీ గెలిచే సూచనలు వున్నాయి. సోమవారం విడుదలైన కొన్ని జాతీయ ఛానళ్ల ఎగ్జిట్‌ పోల్‌కూ, ప్రజాశక్తి పోల్‌కూ అంకెల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వుండటం గమనించవచ్చు. ఇతర శక్తులలో వామపక్షాలూ కూడా ఎక్కడా పాగా వేయలేకపోయాయి. మంగళగిరి, కర్నూలు వంటి చోట్ల సిపిఎంకు గణనీయమైన ఓటింగు కనిపిం చింది. లోక్‌సత్తా, ఆప్‌ వంటివి ఎక్కడా జాడలేదు. ఇది ఒపీనీయన్‌ పోల్‌ కాదు గనక ఏ కారణాల వల్ల ఓటు వేస్తున్నారు వంటి ప్రశ్నలు వేయలేదు.కాని మొత్తంపైన సామాజిక సమీకరణలు, సంక్షేమ పథకాలపై విశ్వాసం, ధనం, మద్యం, స్థానిక దళారీల పాత్ర, దీర్ఘకాలికంగా చేసుకుంటున్న సన్నాహాలు కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. తెలుగుదేశం కూడా రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వంటి వాగ్దానాలు తమకు కలిసి వచ్చాయని చెబుతున్నది. అంతేగాని విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించిన విధానపరమైన అంశాలు అంతగా ఓటర్లలోకి వెళ్లినట్టు కనిపించదు. కనక భవిష్యత్తు లోనైనా అలాటి మౌలిక అంశాలపై ఓటర్ల చైతన్యం పెంచాల్సిన బాధ్యత ఆలోచనా పరులపై వుంటుంది.

ee pai vunna news ni print out teesi... then NnFjIA.gif  then ee mukkalni

 

 

 

baaga madichi     bemmi.rod.gif

Posted

120 minimum ammaa TDP ki...inka doubt a akkarla...

×
×
  • Create New...