Jump to content

Paapam Drivers....


Recommended Posts

Posted

హైదరాబాద్: బోయిన్‌పల్లి శ్రీలత గార్డెన్ వద్ద ఉదయం 3:40 నిమిషాలకు ఆర్మూర్ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాను ఢీకొంది. రెండు వాహనాలు గుద్దుకోగానే రెండింటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు డ్రైవరు గంగాధర్, వ్యాను డ్రైవరు సజీవ దహనమయ్యారు. బస్సు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు బస్సు నుంచి దూకేశారు. ప్రకాశం జిల్లా ఇంజామూరు నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు ఈ బస్సు వెళుతుంది. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 15 మంది ప్రయాణికులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
బస్సు నుంచి కిందకు దూకి 35 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షణాల్లో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయింది. మూడు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

×
×
  • Create New...