powerstar02 Posted September 16, 2014 Report Posted September 16, 2014 ok keep dreaming lol ok thankyou
posaanisam Posted September 16, 2014 Report Posted September 16, 2014 @buddy yes up lo caste plays main role nd % kuda below 60 vachidi so dey gained bt i think dis wil b eye opener fr bjp , dey went wit over confidence
donganaaK Posted September 16, 2014 Report Posted September 16, 2014 @buddy yes up lo caste plays main role nd % kuda below 60 vachidi so dey gained bt i think dis wil b eye opener fr bjp , dey went wit over confidence yeah and thats also there ... picha over confident ga vellaru , but naaku telisi this is a good thing , the'll atleast plan better next time and wont take it fr granted
ZuniorVentiyar Posted September 16, 2014 Author Report Posted September 16, 2014 కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఒక్కో రాష్టం లో ఒక్కో కారణం వాళ్ళ BJP దెబ్బ తిన్నది అంటావు ..... ఈ కులం , మతం , other local issue ఫై BJP planning చేసుకోలేకపోయింది గుజరాత్ లో ..... voting percentage తగ్గడం వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో దెబ్బతింది .... ఇంకా తెలంగాణా లో 2 nd place నుండి 3 rd place కి ఎందుకు పడిపోయిందో విశ్లేషిణ చేదాం its a little disappointing but actually deeniki oka reason enti ante ...nw that Modi is the PM no one cares any more , now they gave more importance to things like cast,religion and few other local issues than the politacal party when they voted , also the voting % was not great either .... i think there's nothing to worry
posaanisam Posted September 16, 2014 Report Posted September 16, 2014 @buddy dey concentratd on mamata dominated place nd dey won dey left up nd rajasthan with head weight , dey takes a lesson
posaanisam Posted September 16, 2014 Report Posted September 16, 2014 @zoo asalu aa jagga reddy ki deposit vastene great annaru kada vachindi kada , do u think tg lo modi factor exists..? never
donganaaK Posted September 16, 2014 Report Posted September 16, 2014 కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఒక్కో రాష్టం లో ఒక్కో కారణం వాళ్ళ BJP దెబ్బ తిన్నది అంటావు ..... ఈ కులం , మతం , other local issue ఫై BJP planning చేసుకోలేకపోయింది గుజరాత్ లో ..... voting percentage తగ్గడం వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో దెబ్బతింది .... ఇంకా తెలంగాణా లో 2 nd place నుండి 3 rd place కి ఎందుకు పడిపోయిందో విశ్లేషిణ చేదాం more or less adey jarigindi ....TG lo ante asala BJP vallu TDP tho tie up ayyi medak lo contest chesthe em expect cheyyali ... BJP is better off in TG without TDP support in my opinion , .... hyd okkati entirely diff ..rest of TG is different
donganaaK Posted September 16, 2014 Report Posted September 16, 2014 @buddy dey concentratd on mamata dominated place nd dey won dey left up nd rajasthan with head weight , dey takes a lesson yeah they took it for granted actually anduke punch padindi .... in way its a very good wakeup call ..
ZuniorVentiyar Posted September 16, 2014 Author Report Posted September 16, 2014 googd analysis ప్రధాని మోడీ పై జనంలో వ్యతిరేకత పెరుగుతోందా? అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడానిండక ముందే ఇంత అసంత్రుప్తికి కారణమేమిటి? నాలుగు నెలల్లోనే ఎంత మార్పు. నాడుఎక్కడ చూసినా మోడీ హవానే. ఏరాష్ట్రంలో చూసినా కమల వికాసమే.ఇతర పార్టీలు ఇకనిలబడగలుగుతాయా? అన్నఅనుమానాలు. మరో పది, పదిహేనేళ్లపాటు ఇక అధికారం తమదేనన్నధీమాలో బీజేపీ. కానీ, ఇంతలోనే బీజేపీకి నిరాశాజనకఫలితాలు. మొన్న బీహార్ లో లాలూ, నితీష్ కూటమి ముందు దెబ్బతిన్న చేదు జ్ఇాపకంమరచిపోకముందే, ఇప్పుడు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ , తామే అధికారంలో వున్నరాజస్థాన్ లలో మరో ఎదురుదెబ్బ. చివరకు మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పై చేయిఅనిపించుకున్నప్పటికీ, మూడు సీట్లు కాంగ్రెస్ కి సమర్పించుకోక తప్పని స్థితి. అంతేనా. పదిరాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ , మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం సగం సీట్లుకూడా గెల్చుకోలేని దైన్యం. వంద రోజుల సంబరాలు చేసుకుంటున్న వేళ పరాజయాల నైరాశ్యం. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ ఇంత తొందరగా కోలుకుంటుందనిఎవరూ ఊహించలేదు. నాలుగు నెలల క్రితం నాటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జెండారెపరెపలాడడంతో ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీయే అధికారంలోకి వస్తుందనిచాలామంది లెక్కలేసుకున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ ప్రభుత్వం పై బీజేపీ దాడిని గురిపెట్టింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్నఅత్యాచారాలు జాతీయ మీడియాలో పతాక శీర్షికలయ్యాయి. ఒక దశలో కేంద్రం అఖిలేష్ప్రభుత్వాన్ని కూల్చేందుకు వ్యూహరచన చేస్తోందంటూ వార్తలొచ్చాయి . ఇంతలోనే ఉపఎన్నికలు రావడంతో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి.నిజానికి అక్కడ ఉప ఎన్నికలు జరిగిన 11 అసెంబ్లీ స్థానాలూ బీజేపీ ఖాతాలోనివే. ఆ పార్టీఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికకావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మతాన్ని ఓ ఆయుధంగా వాడుకునేందుకు ప్రయత్నించింది.ముస్లీం యువకులు లవ్ జిహాదీకి పాల్పడుతున్నారంటూ హిందూవులను రెచ్చగొట్టే ప్రయత్నంచేసింది. పరమతాల పట్ల అసహనంతో ఊగిపోయే నేతలను ప్రధాన ప్రచార సారధులుగానియమించుకుంది. అయినా ఆ పార్టీకి చివరకు దక్కింది మూడే మూడు సీట్లు. ఎనిమిది సిట్టింగ్స్థానాలను సమాజ్ వాదీ పార్టీకి సమర్పించుకుంది. బీజేపీ పాలిత రాజస్థాన్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అక్కడ నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే మూడు స్థానాలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. ఈ మూడు స్థానాలూ బీజేపీసిట్టింగ్ స్థానాలే కావడం మరో విశేషం. గుజరాత్ లో తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ మూడింటిని కాంగ్రెస్ కిసమర్పించుకుంది. మొత్తానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతమే. మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలేజనాగ్రహానికి కారణమై వుండొచ్చు. ఎన్నో తరాలుగా తాము పాదుకొల్పుకున్న మతసామరస్యాన్నీ, మానవ సంబంధాలను దెబ్బతీసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందన్న జనంఆవేదన ఆ పార్టీ పట్ల అసంత్రుప్తిని రాజేసి వుండవచ్చు. బీజేపీ నేతలు, సంఘ్ పరివారమే ఎన్నివివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ వారిని కట్టడి చేయకపోవడంభారతీయులను నిరాశపరచి వుండవచ్చు. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విధానాలనే మరింతవేగంగా అమలు చేసేందుకు ప్రయత్నించడమూ, కార్పొరేట్ ప్రభువులకు మేళ్లు చేసే నిర్ణయాలుతీసుకుంటుండడమూ, పాలనలో ప్రజాస్వామిక సంస్క్రుతిని పరిపుష్టం చేయకుండా, అన్నిఅధికారాలను తన చేతిలోనే కేంద్రీకరించుకుంటూ, మంత్రులను డమ్మీలుగా మార్చేందుకుప్రయత్నించడమూ , తమ పార్టీ సీనియర్లనే అగౌరవపర్చడమూ భారతీయ బిడ్డలకు నచ్చివుండకపోవచ్చు. జనం పంపిన సందేశాన్ని ప్రధాని మోడీ, ఆ యన పార్టీ ఎలా అర్ధం చేసుకుంటాయన్నదాని మీదేబీజేపీ భవిష్యత్ ఆధారపడి వుంటుంది. ఈ వంద రోజుల్లో చేసిన తప్పులు, అహంభావ పూరిత,విద్వేష పూరిత వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలంటూ ఉప ఎన్నికల్లో ప్రజలు చేసిన హెచ్చరికనుపెడచెవిన పెడితే, రాజకీయంగా నష్టపోయేదీ బీజేపీయే.
Recommended Posts