Jump to content

Recommended Posts

Posted
అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సంచలనాత్మక తీర్పు వెలువరించిన జడ్జి పేరు జాన్ మైకేల్ డి కున్హా. ముక్కు సూటిగా వ్యవహరిస్తాడని, ఎలాంటి ప్రలోభాలకు లొంగడని ఈయనకు పేరు. మంగళూరుకు చెందిన జాన్ మైకేల్ 1985లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2002లో జిల్లా న్యాయమూర్తి అయ్యారు. అనంతరం, పలు కీలక బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు రిజిస్ట్రార్ గానూ, ప్రధాన న్యాయమూర్తులకు కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు. 2013లో పరప్పన అగ్రహార న్యాయస్థానం జడ్జిగా నియమితులయ్యారు. తాజాగా, జయ కేసులో విచారణ సందర్భంగా... ఆమె తరపు న్యాయవాదికి కోర్టులోనే ఈయన అక్షింతలు వేశారు. వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని, కేసును సాగదీస్తున్నారని మందలించారు. ఒత్తిళ్ళకు లొంగకపోవడం, నిజాయతీ... తదితర అంశాలు జాన్ మైకేల్ ను న్యాయవ్యవస్థలో 'మిస్టర్ పర్ఫెక్ట్' గా నిలబెట్టాయి.

 

Posted
  జయ అప్పీలుకు అడ్డంకిగా మారిన దసరా సెలవులు      08:09 AM
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు దసరా సెలవులు అడ్డంకిగా మారాయి. అక్టోబర్ 5 వరకు దసరా, ఇతర పర్వదినాల కారణంగా న్యాయస్థానాలకు సెలవులు ప్రకటించారు. దీంతో, జయ ఆ తర్వాతే పై కోర్టులో అప్పీల్ చేసుకునే వీలుంటుంది. ఈ కేసులో కర్ణాటకలోని కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఆ రాష్ట్ర హైకోర్టులోనే జయ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అనుకూల తీర్పు రాకుంటే, సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది.

 

×
×
  • Create New...