LordOfMud Posted June 24, 2015 Report Posted June 24, 2015 ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మే 21వ తేదీన హోటల్లో ఎవరితో భేటీ అయ్యారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత అనురాధ బుధవారం నాడు ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ షాడో అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మే 21న బంజారాహిల్స్లోని రోడ్డు నెంబర్ 12లోని సితార హోటల్లో జగన్ ఎవరిని కలిశారు, ఏం కుట్రలు చేశారో త్వరలో వివరాలు బయటపెడతామని చెప్పారు. సెక్షన్ 8 గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సెక్షన్ 8 అమలు చేయకుంటే తానే నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.ఏపీకి వచ్చే పరిశ్రమను తన్నుకుపోయిన కేటీఆర్, ఇక బాబు అప్రమత్తం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ఓ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణకు తన్నుకుపోయారనే వార్తలు వస్తున్నాయి. మైక్రోమాక్స్ను తమ రాష్ట్రంలో కర్మాగారం ఏర్పాటు చేయించేందుకు ఏపీ ఒప్పించిందని సమాచారం. అయితే, రంగంలోకి దిగిన కేటీఆర్ మైక్రోమాక్స్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణకు వచ్చేందుకు పావులు కదిపారట. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇఖ పైన పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలను గోప్యంగా ఉంచాలని భావిస్తోందని చెబుతున్నారు.
cherlapallifailure Posted June 24, 2015 Report Posted June 24, 2015 ఏపీలో వైసీపీ షాడో అధ్యక్షుడిగా కేసీఆర్ lol.1q lol.1q
Recommended Posts