SNOW_MEGA Posted February 4, 2016 Report Posted February 4, 2016 మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఫ్యామిలీకి ఎట్టకేలకు గురువారం బెయిల్ దొరికింది. గతేడాది నవంబర్ 4 అర్థరాత్రి రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్కుమార్, అనిల్కుమార్ రెండో భార్య సనలు ఇప్పటివరకూ జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. రాజయ్యతోపాటు, ఆయన భార్య, కొడుకు (ముగ్గురికి) రూపాయలు 25,000 పూచీకత్తుపై 6వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అనిల్ కుమార్ రెండో భార్య సన కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, బెయిల్ కోసం రాజయ్య కుటుంబం పలుమార్లు కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన కోర్టు 90 రోజుల అనంతరం బెయిల్ మంజూరు చేసింది.
Balibabu Posted February 4, 2016 Report Posted February 4, 2016 Antey kada India constitution prakaram
Hitman Posted February 4, 2016 Report Posted February 4, 2016 Chi... deenamma.. anta darunam ga pillalni ani kooda choodakunda chesaru.. vellaki bail.. inka malla lopalaki veltaro ledo? badmash batch...
Recommended Posts