BabuRa0 Posted April 23, 2016 Author Report Posted April 23, 2016 inko wicket lol ఏపీ ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ల పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు ముహుర్తం రెడీ చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వార్త నుంచి తేరుకునేలోగానే ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గోట్టిపాటి రవికుమార్ ఈనెల 29న టీడీపీలో చేరనున్నట్లు ఖరారైంది.సంతమాగులూరులో కార్యకర్తలతో గొట్టిపాటి రవి సమావేశమవడం ఇందుకు కారణంగా మారింది. ఈ సమావేశం సందర్భంగా 29న టీడీపీలో చేరుతున్నట్లు కార్యకర్తలతో రవి తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలాఉండగా చాంద్ పాసా చేరికతో ఇప్పటి వరకు వైసీపీ నుంచి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరినట్లయింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.