Jump to content

Recommended Posts

Posted
636007534994569272.jpg
తిరువనంతపురం: బాక్సింగ్ లెజెండ్ మహహ్మద్ అలీ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తుండగా, ఆయనకు నివాళిగా మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కేరళ క్రీడల శాఖ మంత్రి మరో అడుగు ముందుకు వేసి...అసలు మహమ్మద్ అలీ మా కేరళ వాడే...రాష్ట్రానికి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన క్రీడాకారుడు అంటూ కితాబిచ్చేశారు. అయితే అది లైవ్ సంభాషణ కావడంతో సదరు యాంకర్ అప్రమత్తమై ఆయనతో టెలిఫోన్ లైన్ కట్ చేసింది. కేరళ సీపీఎం సీనియర్ నేత ఇపి జయరాజన్‌ను ఓ మలయాళం వార్తా ఛానెల్ మహమ్మద్ అలీ గురించి మాట్లాడమని ఫోన్‌లో కాంటాక్ట్ చేసినప్పుడు 'ఇప్పుడే అమెరికాలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు విన్నాను. ఆయన కేరళ చెందిన గొప్ప క్రీడాకారుడు. స్వర్ణ పతకం తెచ్చిపెట్టడం ద్వారా రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టారు' అంటూ పొడిగేశారు. అప్పటికే మంత్రిగారి పొరపాటు గ్రహించిన సదరు యాంకర్ ఆయన ఇంకా మాట్లాడితే ఎలాంటి ప్రమాదం వస్తుందోనని గ్రహించి ఆడియో కట్ చేసింది. అయితే మంత్రిగారి నిర్వాకం సోషల్ మీడియాలో సంచలనమైంది. కేరళ మంత్రి చరిత్రను తిరగరాస్తున్నారని కొందరు, యాంకర్ అప్రమత్తంగా ఉండబట్టి కానీ లేకపోతే మహమ్మద్ అలీ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, ఒకరికి కేరళలో ఉద్యోగం ఇస్తానంటూ మంత్రి ప్రకటించి ఉండేవారంటూ ట్విట్టర్‌లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
 

 

 

Ilaantolle ministers avutharu .aa anchor kooda saripoyinddhi...what are your memories about legend..avasarama manaki.rlxuhc_th.jpg

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...