Jump to content

Recommended Posts

Posted
3 hours ago, kakatiya said:
15-boy.jpg

పరీక్ష రాసి 100 మార్కులేసుకున్నాడు 

గాంధీనగర్‌: ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన పరీక్ష పేపరు దిద్దే అవకాశం మరొకరికి ఇవ్వకుండా ఆ పని కూడా తానే చేశాడు. పరీక్ష రాసి తానే 100కి 100 మార్కులు వేసేసుకున్నాడు. గుజరాత్‌కి చెందిన హర్షద్‌ సర్వయ్య ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎకనమిక్స్‌ పరీక్ష రాసి వెంటనే రెడ్‌ పెన్నుతో రాసిన సమాధానాలన్నిటికీ మార్కులు వేసి పేపర్‌ను సూపర్‌వైజర్‌కి ఇచ్చి వెళ్లిపోయాడు.

ఈ విషయమై గుజరాత్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు హర్షద్‌పై కేసు పెట్టింది. హర్షద్‌ ఇలాంటి నేరం చేస్తున్నప్పుడు తనిఖీలు చేయని ఇన్విజిలేటర్లకు కూడా బోర్డు షోకాజ్‌ నోటీసులు పంపింది. హర్షద్‌ ఎకనమిక్స్‌, భౌగోళికశాస్త్రం పరీక్షా పేపర్లు తానే దిద్దుకుని, ఒకదానిలో 100కు 100 వేసుకుని, భౌగోళికశాస్త్రంలో మాత్రం 35 మార్కులే వేసుకున్నాడని బోర్డు తెలిపింది.

ప్రశ్నలన్నిటికీ వరసగా మార్కులేసుకున్న హర్షద్‌ ఎవరికీ అనుమానం రాకుండా మొదటి పేజీలో టోటల్‌ మార్కులు మాత్రం వేయలేదు. అయితే ఒక్కో పేపర్‌ను ఏడుగురు ఉపాధ్యాయులు చెక్‌ చేయాల్సి ఉండగా అప్పుడు అసలు కథ బయటికి వచ్చింది. ఒక్క ఎకనమిక్స్‌లో 100కి 100 వచ్చిన హర్షద్‌కి మాతృభాష గుజరాతీలో 13, ఆంగ్లంలో 12, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, సైకాలజీలో 5, భౌగోళికశాస్త్రంలో 35 మార్కులు వచ్చాయని బోర్డు అధికారులు వెల్లడించారు. హర్షద్‌ని ఎగ్జామినేషన్‌ రిఫార్మ్స్‌ కమిటీ ముందు ప్రవేశపెడతారు. నేరం నిర్ధారణ అయితే రెండు పరీక్షలనుంచి అతడిని డిబార్‌ చేసే అవకాశం ఉంది.

Nice 

Posted

Eedu evado cheddi Rajanna ni nspiration teesukonadu..

cheddi Rajanna kooda MBBS ilane pass ayyadu.. ani pulivendula cheddiharam lo talk..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...