bradbell Posted July 19, 2016 Report Posted July 19, 2016 హైడ్రోఫోయిల్’.. అంటే నీటిపై దూసుకుపోయే వేగవంతమైన నౌక. ఈ నౌకల తయారీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటన సందర్భంగా... ఏపీలో హైడ్రోఫోయిల్ నౌకల తయారీ మరియు నిర్వహణ కోసం జె ఎస్ సి అలెక్సీవ్ డిజైన్ బ్యూరో మరియు ఎల్కమ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ‘భారత్లో తయారీ’ కింద వీటిని ఉత్పత్తి చేయనున్నారు. ఈ నౌకలను గతంలో నావికాదళంలో వినియోగించేవారు. ఇప్పుడు ప్రయాణికుల అవసరానికి తగినట్లుగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 100 నుంచి 200 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ గదులతో అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇది సాధారణ నౌకల్లా నీటి అలలను తాకుతూ ప్రయాణించదు. బీమ్ల ఆధారంతో ‘వీ’ ఆకారంలో ఓ చట్రాన్ని తయారు చేసి, దానిపై నౌకను నిర్మిస్తారు. నౌక కింద ఉండే చట్రమే నీటిలో ఉంటుంది. ఈ కారణంగా నీటి ఒత్తిడి తగ్గి వేగంగా దూసుకెళ్లడం సాధ్యవుతుంది. హైడ్రోఫోయిల్ నౌకలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది. చైనా వంటి దేశాల్లో వీటి వేగాన్ని మరింత పెంచి టొర్బొ జెట్లుగా మార్చారు. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, పోలాండ్, వియన్నా, బల్గేరియా, జపాన్, టర్కీ తదితర దేశాల్లో వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటి తయారీ ఆంధ్రప్రదేశ్లో జరగడం వల్ల ఇక్కడి అవసరాలతోపాటు ఇతర దేశాల నుంచి ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సముద్ర మార్గం ప్రయాణాలకు వీలు కలుగుతుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.