Jump to content

Recommended Posts

Posted

అగ్నికుల క్షత్రియు (మత్స్యకారులు) లపై తెలుగుదేశం నేతల దురాగతాలు
కోస్తా ప్రాంతంలో పోర్టులు సెజ్ ల పేరుతో వారి భూములు దోచుకోవడంతో పాటు, తెలుగుదేశం అనుచరుల నుండి వారి మాన ప్రాణాలకూ రక్షణ లేకుండా పోయింది

భీమవరం రూరల్ ప్రాంతం దిరుసుమర్రులోని సూర్యమిత్ర కంపెనీలో పనిచేసే కొప్పాడి నాగరాజు(21)- బొడ్డు దుర్గ(18) అనే యువతీ యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. June 4 వ తేదిన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. June 3 వ తేది రాత్రి గొల్లవానితిప్ప గ్రామ శివారులో ఇద్దరూ స్పృహ లేకుండా పడిఉన్నారు. 4 వ తేదిన ఇద్దరినీ భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. తదుపరి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి, మరలా ఏలూరు ఆశ్రం హాస్పిటల్ కి తరిలించారు. ఇద్దరూ స్పృహలోకి రాకుండానే మృతి చెందారు. .... నాగరాజు-దుర్గ ఇద్దరూ సామాజికంగా వెనుకబడిన అగ్నికులక్షత్రియ కులానికి చెందినవారు. ఇరువురిదీ బాగా పేద కుటుంబ నేపధ్యం.

కాగా 2016, June 3వ తేదీ సాయంత్రం నాగరాజు-దుర్గల స్నేహితులు అయిన వాటాల కుమారస్వామి, చిరంజీవి అనే యువకులు ఇద్దరినీ సినిమాకి వెళ్దాం అని బయటికి పిలిపించారు. ఆ రాత్రి ఏమి జరిగిందనేది వారిద్దరికీ తెలుసు. ప్రస్తుతం వాళ్ళు భీమవరం రూరల్ పోలిస్ స్టేషన్ లాకప్ లో ఉన్నారు. పోలీసులు ఇది ఆక్సిడెంట్ కేస్ అని చెబుతున్నారు. కానీ కుమారస్వామి- చిరంజీవి 42 రోజుల నుండి స్టేషన్ లోనే ఉన్నారు.

2016 June 13 వ తేదిన దుర్గ స్వగ్రామం పాతపాడులో అగ్నికులక్షత్రియులు-గ్రామస్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇది ఖచ్చితంగా హత్యే అని వీరి నమ్మకం. సూర్యమిత్ర కంపెని సూపర్ వైజర్ ప్రకాష్ ప్రధాన నిందితుడు అని ఆరోపిస్తున్నారు. భీమవరం తెలుగుదేశం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు తెలుగుదేశం అనుచరుడైన ప్రకాష్ ని కాపడుతున్నాడని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల్లో నాగరాజు-దుర్గల పెళ్లి జరుగుతుండడం సహించలేని ప్రకాశే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. అసలు విషయం తేలాల్సిఉంది.

2016 June 13 న ధర్నా సందర్భంగా కేసును CID కి అప్పగిస్తున్నామని SP భాస్కర్ భూషణ్, మంత్రి కోల్లు రవీంద్ర గారు, నరసాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు గారిల సమక్షంలో ప్రకటించారు. మంత్రి- ఎమ్మెల్యే ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడి ఒక్కో కుటుంబానికి 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటింపజేశారు.

కానీ నెల రోజులు దాటినా కేసు ముందుకు కదలలేదు. నిందితుడు ప్రకాష్ ని అరెస్ట్ చెయ్యలేదు. మొత్తం 6 గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు అని అంటున్నారు. హోం మినిస్టర్ ప్రోద్బలంతోనే కేసును తొక్కిపెట్టి ఉంచారు అని అందరూ చెబుతున్న విషయం.

ఈ తెలుగుదేశం పాలనలో వారి అనుచరులకి తప్ప మిగాతా ఎవ్వరికి మాన, ప్రాణ, ధన, జంతువులకి రక్షణ లేకుండా పోయింది... తెలుగుదేశం అనుచరులు క్రూర మృగాళ్ళా వ్యవహరిస్తున్నారు... ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుని బాధితులకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రబుత్వానిది... ప్రతిపక్షం కూడా దీనిపై స్పందించి బాధితుల తరపున పోరాడాలి

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...