sri_india Posted August 9, 2016 Report Posted August 9, 2016 చెన్నై: అలనాటి ప్రముఖ సినీనటి జ్యోతిలక్ష్మి(68) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఆమె స్వగృహంలో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి ఎక్కువగా నృత్యప్రధాన పాత్రల్లో నటించారు. ఇదా లోకం, మోసగాళ్లకు మోసగాడు, గండరగండడు, పిల్లాపిడుగా, గాంధర్వ కన్య, సీతారాములు, బెబ్బులి, బాబులుగాడి దెబ్బ, స్టేట్ రౌడీ, బిగ్బాస్, కలుసుకోవాలని, దొంగరాముడు అండ్ పార్టీ, బంగారు బాబు తదితర చిత్రాల్లో జ్యోతిలక్ష్మి నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. జ్యోతిలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.