LordOfMud Posted October 27, 2016 Report Share Posted October 27, 2016 చెర్రీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ. 4.90 కోట్లు... మనుషుల్లేకపోయినా విమానాలు తిప్పండి... ఇదేదో లెక్క బాగానే కుదిరేట్లు ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలన్న కుతూహలంతో తెదేపా అధినాయకత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంటూ తెదేపాపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ శత్రువుగా మారిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవిని పార్టీలోకి తీసుకుంటే కాస్తయినా ప్రయోజనం ఉంటుందనే యోచనలో తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం. అదలావుంచితే తాజాగా ఏపీ ప్రభుత్వం చెర్రీ ఎయిర్ లైన్స్ కంపెనీ టర్బో మెఘా ఎయిర్వేస్కు రూ. 4.90 కోట్లు మంజూరు చేసింది. అసలే ఖజానాలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి కేటాయింపులేంటి రాజా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఐతే ఈ డబ్బు మంజూరు చేయడం ద్వారా విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులను ప్రయాణికులు ఉన్నా లేకున్నా నడపాలనే ఒప్పందం మేరకు ఇలా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు అలాగే విమానాలు నడుస్తూ ఉంటే మెల్లిగా రద్దీ ఏర్పడుతుందని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Prabhas_Fan Posted October 27, 2016 Report Share Posted October 27, 2016 idi veedi cinema laage anukunta...movie flop ayina 40cr cross ayindi ani cheppandi annattu undi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.