JANASENA Posted January 6, 2017 Report Posted January 6, 2017 ఇంటర్నెట్డెస్క్: గుడ్మార్నింగ్, హాయ్, హలో, గుడ్నైట్.. అంటూ ఉదయం లేచిన దగ్గర్నుంచి మళ్లీ నిద్ర పోయేవరకు వాట్సాప్లో సందేశాలు పంపించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. ఇక పండగ రోజుల్లో అయితే ఒకరికొకరు పోటీపడి శుభాకాంక్షలు తెలుపుకోవడం సర్వసాధారణం. అలా నూతన సంవత్సరం సందర్భంగా మన దేశంలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ పంపించిన సందేశాలెన్నో తెలుసా? అక్షరాలా.. 1400 కోట్లు. ఇప్పటి వరకు ఇన్ని సందేశాలు ఒక్కరోజు పంపించడం ఇదే తొలిసారని వాట్సాప్ శుక్రవారం వెల్లడించింది. గత దీపావళి సందర్భంగా దేశంలో 800 కోట్ల సందేశాలను పంపించుకోవడమే అత్యధికం కాగా.. ఆ రికార్డును న్యూఇయర్ తిరగరాసింది. కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 310 కోట్ల చిత్రాలు ఒకరికొకరు పంచుకున్నారు. 70 కోట్ల జిఫ్ సందేశాలు, 61కోట్ల వీడియోలను పంపించుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. మొత్తం సందేశాల్లో 32శాతం మీడియా రూపంలోనే ఉన్నాయని పేర్కొంది. మిగిలినవి టెక్ట్స్ సందేశాలని తెలిపింది. వాట్సాప్కు భారత్లో నెలకు 16కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కాగా, పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వెర్షన్ ఫోన్లలో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ తమ సర్వీసును నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.