sri_india Posted January 9, 2017 Report Posted January 9, 2017 రెండురోజుల్లో 'ఖైదీ నంబర్ 150'గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి... రీ-ఎంట్రీతో రికార్డులు క్రియేట్ చేస్తాడనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి నటించబోయే నెక్ట్స్ మూవీ కూడా తన బ్యానర్లోనే ఉంటుందని చిరంజీవి తనయుడు, క్రేజీ హీరో రామ్చరణ్ క్లారిటీ ఇవ్వడంతో... ఆ సినిమా ఎవరి డైరెక్షన్లో ఉంటుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి 'ఖైదీ నంబర్ 150' తరువాత చిరంజీవి, బోయపాటి శ్రీను కాంబినేషన్లో అల్లు అరవింద్ సినిమా ఉంటుందని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బోయపాటి ప్లేస్లోకి క్రిష్ ఎంట్రీ ఇచ్చాడని... చిరంజీవి, క్రిష్ మూవీకి కథ కూడా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. సంక్రాంతి బరిలో నిలవబోతున్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని తెరకెక్కించిన క్రిష్... ఒక్కసారిగా క్రేజీ హీరోలందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం కథ సిద్ధం చేయాలని రామ్ చరణ్ చెప్పడం... అలాంటి స్టోరీని చిరు, చెర్రీకి క్రిష్ వినిపించడం కూడా అయిపోయాయట. ఇటీవల క్రిష్ సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ సినిమాతో పాటు చిరంజీవి సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ట్వీట్ చేయడం వెనక కారణం ఇదే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే చిరంజీవి క్రిష్ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అనేది 'గౌతమీపుత్ర శాతకర్ణి' సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ క్రిష్ కాంబినేషన్లో సినిమా సెట్టయితే... అది కచ్చితంగా మరో డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.