JANASENA Posted January 25, 2017 Report Posted January 25, 2017 ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం : పశ్చిమబంగాలోని జలపాయ్గుడి జిల్లాలోని మారుమూల ప్రాంతం... రాత్రి 2 గంటలు... కరీం ఉల్ హక్ మొబైల్ఫోన్ మోగుతుంది... మేలుకున్న హక్ ఫోన్ తీశాడు... సరే వస్తున్నానని రెండు నిమిషాల్లో రెడీ అయి మోటార్సైకిల్పై వెళ్లాడు... ఫోన్ చేసిన వారి దగ్గరికి చేరుకొని అనారోగ్యంగా ఉన్న వారిని బైక్పై ఎక్కించుకొని సమీప ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ ఒక్క రాత్రే కాదు అత్యవసర వైద్యసేవలు కావాల్సిన వాళ్లు ఆయన ఫోన్ను సంప్రదిస్తే వెంటనే వెళ్లి వారిని ఆసుపత్రులకు తరలిస్తుంటాడు 52 ఏళ్ల కరీం ఉల్ హక్. ఈ సేవలను ఆయన ఉచితంగా అందివ్వడం విశేషం. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని... తేయాకు తోటల్లో పనిచేసే కరీం కొన్ని సంవత్సరాల క్రితం అందరిలాగే సాధారణ ఉద్యోగి. ఒక రోజు రాత్రి తల్లి అనారోగ్య పరిస్థితుల్లో వైద్య సాయం అందకు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల అనంతరం తేయాకు తోటల్లో విధుల్లో ఉండగా ఒక కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ధైర్యం చేసి తన మోటార్సైకిల్పై ఆసుపత్రికి తరలించడంతో సత్వరమే వైద్య సాయం అందింది. దీంతో ఆ రోజు నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లడం ప్రారంభించాడు. పగలు లేదు రాత్రిలేదు 24 గంటలు ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తాడు. ఇంతకీ హక్ నెల జీతం ఎంతో తెలుసా కేవలం రూ.4 వేలు. అందులో 25 శాతాన్ని పెట్రోల్కు వినియోగిస్తాడు. చుట్టుపక్కల 15 గ్రామాల్లో హక్ పేరు సుపరిచితం. అంబులెన్స్ దాదా అని అభిమానంగా పిలుస్తారు. ఇప్పటివరకు దాదాపు మూడువేలమందిని ప్రాణాపాయం నుంచి హక్ కాపాడినట్టు తెలుస్తోంది. ఆయన సేవలను గుర్తించిన తేయాకు తోట యాజమాన్యం అతనికి వీలైన పనిగంటలను కేటాయించడం విశేషం. బజాజ్ కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిన ద్విచక్ర వాహన అంబులెన్స్ను హక్కు అందజేసింది. నిస్వార్థసేవలందిస్తున్న హక్ను భారత ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.