JANASENA Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 https://twitter.com/AkhilGu04115966/status/826002578492182529/video/1 ఇంటర్నెట్డెస్క్: మహేంద్రసింగ్ ధోని... టీమిండియాకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించక ముందు వికెట్ కీపర్గా జట్టులోకి వచ్చాడు. వ్యూహాలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఎన్నో మ్యాచ్ల్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను స్టంపౌట్లు చేసిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో జట్టులో కెప్టెన్ తర్వాత అత్యంత ముఖ్యపాత్ర పోషించేది వికెట్ కీపరే. బౌలర్ విసిరే ప్రతి బంతిని అంచనా వేస్తూ కీపింగ్ చేస్తూ ఉండాలి. నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ధోని మాత్రం బెయిల్స్ పనితీరును కూడా పనిగట్టడం విశేషం. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ మైదానంలోకి అడుగుపెట్టింది. హఠాత్తుగా మ్యాచ్ను ధోని నిలిపివేశాడు. ఈ సందర్భంగా అంపైర్లను పిలిచి వికెట్ కీపర్ వద్ద.. స్టంప్లపైన పెట్టిన బెయిల్కు గల ఎల్ఈడీ పనిచేయడం లేదని తెలిపాడు. దీంతో అంపైర్లు వెంటనే మరో కొత్త బెయిల్ను తీసుకొచ్చి స్టంప్లపై అమర్చారు. అనంతరం మ్యాచ్ యథాతథంగా సాగింది. మ్యాచ్ మధ్యలో బెయిల్ను మార్చడం క్రికెట్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. దీని కోసం దాదాపు ఐదు నిమిషాల పాటు మ్యాచ్కు అంతరాయం కలిగింది. ఆ సమయంలో భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ ధోని వికెట్ల పనితీరును కూడా గమనించాడంటే ఆటలో అతని ఏకాగ్రత ఏంటో తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 good Quote Link to comment Share on other sites More sharing options...
Luke Posted January 31, 2017 Report Share Posted January 31, 2017 11 minutes ago, Doola said: good Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.