JANASENA Posted February 1, 2017 Report Posted February 1, 2017 కోజికోడ్: అరటిపండ్లలోని గుజ్జును తీసేసి అందులో రూ. 45.69 లక్షలు తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోజికోడ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ విమానాశ్రమం నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు తమ చెకిన్ లగేజీలో తీసుకువెళ్తున్న అరటిపళ్లలో కరెన్సీ దాచి.. ఎవరికీ అనుమానం రాకుండా తరలించడానికి ప్రయత్నించారు. వీరిని తనిఖీల్లో పట్టుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. సౌదీ కరెన్సీ అయిన రియాల్స్ను వారీ విధంగా తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.