JANASENA Posted February 13, 2017 Report Share Posted February 13, 2017 న్యూదిల్లీ: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు ముఖాముఖి తలపడనున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన మేకిన్ ఇండియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన అమెరికా ఫస్ట్ కార్యక్రమాలు పరస్పరం ఎదురుపడనున్నాయి. ఇటీవల భారత్ సైనికశక్తిని ఆధునికీకరించాలని తలపోసింది. దీని కోసం రానున్న రోజుల్లో దాదాపు 250 బిలియన్ డాలర్లు(రూ.16లక్షల కోట్లు) వెచ్చించనుంది. సబ్మెరైన్లు, నౌకలు, యుద్ధవిమానాల అవసరం భారత్కు తీవ్రంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారైన భారత్ను తమ కస్టమర్గా చేసుకోవటానికి ప్రపంచ వ్యాప్తంగా పలు తయారీ కంపెనీలు ఆసక్తి చూపించడం సహజం. దీనిని మన బలంగా భావించిన ప్రధాని నరేంద్ర మోదీ 2022 నాటికి భారత ఆయుధాల్లో 25శాతం దేశీయంగానే రూపొందించుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం ఇది 18శాతం మాత్రమే ఉంది. దీనికోసం మన దేశం విదేశీ కంపెనీల వద్ద కొనుగోళ్లు జరిపేటప్పుడు ఒక నిబంధన విధిస్తోంది. వాహనాల్లో సింహభాగం పరికరాలు భారత్లోనే తయారు చేయాలంటోంది. ఈ నిబంధనలతో దేశీయ మార్కెట్లు బలపడటంతోపాటు.. సాంకేతికత బదలాయింపు జరుగుతుందని.. తద్వారా ఆయుధ రంగంలో భారత్ స్వయంపోషకంగా మారుతుందన్నది మన పాలకుల ఆలోచన. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు.. అమెరికా సంస్థ బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ఎఫ్-16 విమానాలు భారత్కు విక్రయించేందుకు ముందుకొచ్చాయి. వీటిల్లో లాక్హీడ్మార్టిన్ భారత్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయటానికి ఆసక్తి చూపింది. ఇదంతా ట్రంప్ అమెరికా ఫస్ట్ కార్యక్రమాన్ని ప్రకటించక ముందునాటి సంగతి.. ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత ఈ సంస్థలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోపడ్డాయి. ఇప్పటికే బోయింగ్ సంస్థకు భారత్ ఇచ్చే ఆర్డర్లతో అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించారు. కానీ లాక్హీడ్ మార్టిన్పరిస్థితి వేరు. ఏకంగా తయారీ యూనిట్ను భారత్కు తరలిస్తానని ప్రకటించింది. అన్నట్లుగానే యూనిట్ను భారత్ తరలించాలనుకుంటే అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న యుద్ధవిమానాల్లో దాదాపు 40శాతం (650) పాతవి అయిపోయాయి. దీంతో వైమానిక దళ ఆధునికీకరణపై దృష్టిపెట్టింది. దీనిలో ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నుంచి 126 రాఫెల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలని భావించింది. కానీ తర్వాత దీనిని కేవలం 36కు కుదించింది. ఈ కొనుగోలుతో భారత అవసరాలు ఏమాత్రం తీరవు. యుద్ధాల సమయంలో అత్యవసరంగా ఉత్పత్తిని వేగవంతం చేయాల్సి వస్తే విదేశాల్లో కంపెనీల వల్ల భారత్కు సమస్యలు రావచ్చని భావిస్తున్నారు. అందుకే భారత్కు తయారీని తరలించే కంపెనీలపైనే దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది. త్వరలో బెంగళూరులో నిర్వహించే ఏరో ఇండియా 2017 ఎయిర్షోలో యుద్ధవిమానలపై కొత్త ఒప్పందాలు తెరపైకి రావచ్చని భావిస్తున్నారు. రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ సందర్భంగా విదేశీ కంపెనీలను దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోమని కోరవచ్చు. దీనికి సిద్దంగా టాటా, లార్సన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రాలు రక్షణ పరికరాల తయారీ విభాగాలను ప్రారంభించాయి. బోయింగ్, లాక్హీడ్మార్టిన్తోపాటు, యూరోప్కు చెందిన ఎయిర్బస్, రష్యాకు చెందిన మిగ్ సంస్థలు కూడా తమ నమూనాలను ప్రదర్శించనున్నాయి. ఇరుదేశాల సంబంధాలపైనే ఆశలు ఇటీవల కాలంలో భారత్ను కీలకమైన భాగస్వామిగా అమెరికా భావిస్తోంది. దీనిలో భాగంగానే రక్షణ పరమైన సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి కట్టుబడి ఉంటామని ఇటీవల అమెరికా రక్షణశాఖ కార్యదర్శి మ్యాటిస్ భారత కేంద్ర మంత్రి పారికర్తో అన్నారు. మరోపక్క చైనా బలపడుతుండటంతో అమెరికాకు భారత్తో సత్సంబంధాలు అత్యవసరమయ్యాయి. భారత్ కూడా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా వ్యాపార సంస్థలపై దృష్టిసారించింది. కానీ ప్రస్తుతం భారత్లో అమెరికా సంస్థలు తయారీ యూనిట్లు పెట్టడంపై ట్రంప్ ఏవిధంగా స్పందిస్తారో వూహకు అందని పరిస్థితి నెలకొంది. ఈ డీల్ సమస్యలు సృష్టించేలా ఉండటంతో ఇరుదేశాల అధికారులు చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క బెంగళూరు ఎయిర్షోలో సత్తా చాటి ఆర్డర్లు సంపాదించాని వైమానిక పరికరాల తయారీ కంపెనీలు ఉత్సాహపడుతున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Spell_Hunter Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 customer is always right, in this case india has the ball in her court only know Quote Link to comment Share on other sites More sharing options...
zoolakataka_14 Posted February 14, 2017 Report Share Posted February 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.