Jump to content

Recommended Posts

Posted

కర్ణాటక:

17 ఏళ్ల యువకుడు చనిపోయాడని భావించి కుటుంబం అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా అతడు కళ్లు తెరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని మనగుండి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నింగప్ప, మంజుల దంపతుల కుమారుడు కుమార్‌ బడి మానేసి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం అతడ్ని వీధి కుక్క కరిచింది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం కన్పించకపోగా నానాటికీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దాంతో వెంటిలేటర్‌పై ఉంచిన వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ శరీరం మొత్తం పాకిందని, కోలుకోవడం సాధ్యం కాదని చెప్పారు. వెంటిలేటర్‌ తీసేస్తే బతకడని చెప్పడంతో నిరాశ చెందిన తల్లిదండ్రులు ఇక చేయగలిగిందేమీ లేదని భావించి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చాక అతడి శరీరంలో కదలికలు లేకపోవడంతో కుమారుడ్ని పోగొట్టుకున్నామని శోకిస్తూ.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

అంతిమయాత్ర ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో.. కుమార్‌ కళ్లు తెరిచాడు.. చేతులు, కాళ్లు కదిలించాడు. గట్టిగా వూపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు వెంటనే అతడిని మరో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరిశీలించి కుక్క కరవడం వలన అతడికి వ్యాధి సోకి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిందని, వెంటిలేటరు మీద ఉంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు.

Posted

Em desham ra babu manadi. Kukka karisthe doctors cure cheyalera. Asalu poor ppl pranam lekka lekunda poyindi. First population control cheyali. 

Posted
6 hours ago, kiladi bullodu said:

androlla kutra

Yes canpermed by DB PINKIES  Bhai

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...