Swas Posted February 27, 2017 Report Posted February 27, 2017 సీఎంకు అందజేయనున్న నార్మన్ ఫోస్టర్ మొత్తం 3 రకాల డిజైన్లు ప్రజాభిప్రాయం మేరకు ఒకటి ఖరారు ఆర్కిటెక్ట్ సంస్థతో చర్చల కోసం లండనకు మంత్రి నారాయణ ఇప్పటికే చర్చలు జరపుతున్న శ్రీధర్ (ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలోని 900 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగానిర్మించ తలపెట్టిన ప్రభుత్వ సముదాయం, 2 ఐకానిక్ భవనాల (అసెంబ్లీ, హైకోర్టు)కు సంబంధించిన డిజైన్లను ఆర్కిటెక్ట్ సంస్థ ఈనెల28న సీఎం చంద్రబాబుకు అందజేయనుంది. మునిసిపల్ శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ మంగళవారం సచివాలయంలో ఈ విషయం తెలిపారు. లండనకు చెందిన నార్మన ఫోస్టర్ సంస్థ డిజైన్లను రూ పొందిస్తోంది. నార్మన ఫోస్టర్ ప్రతినిధులు మొత్తం 3 రకాల డిజైన్లను సీఎం కు సమర్పిస్తారని నారాయణ వెల్లడించారు. వాటిని పబ్లిక్ డొమైనలో ఉంచి ప్రజాభిప్రాయం తెలుసుకుంటుదని చెప్పారు. అత్యధికులు మెచ్చిన డిజైనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలిపారు. ఈ డిజైన్లకు సంబంధించి సదరు కంపెనీకి మన అభిప్రాయాలు, సూచనలు తెలియజేసేందుకు తాను మరోసారి లడన వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సీఆర్డీయే కమిషనర్ సీహెచ్ శ్రీధర్, ఏడీసీ ఉన్నతాధికారులు అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇంగ్లండ్కు చెందిన వివిధ ప్రసిద్ధ సంస్థల నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. అమరావతిలోని అడుగడుగూ, ప్రతి నిర్మాణమూ అటు మన వారసత్వ సంపద, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఇటు అత్యధునాతనంగానూ, వినూత్నంగానూ ఉండాలన్న విషయాన్ని నార్మన ఫోస్టర్తో జరిపే చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్టు తెలిపారు. డిజైన్లపై ‘నిపుణుల కమిటీ’ సమావేశాలు అమరావతిలోని అణువణువూ ఒకపక్క వైవిధ్యం, సృజనాత్మకతకు పట్టం గడుతూనే మరోపక్క వేలాది సంవత్సరాల ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వసంపద కలిగిన ఈ ప్రదేశపు విశిష్టతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధ, గురువారాల్లో విజయవాడలో సమావేశం కానుంది. రాష్ట్ర మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సమన్వయకర్తగా వ్యవహరించనున్న ఈ ఉన్నతస్థాయి కమిటీలో పలు రంగాలకు చెందిన మొత్తం 11 మంది నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. పరకాల ప్రభాకర్, డాక్టర్ కె.పద్దయ్య, ప్రొఫెసర్ డి.కిరణ్క్రాంతి చౌదరి, కె.వి.రావు, డాక్టర్ ఈ.శివనాగిరెడ్డి, ఆనందసాయి, అమరేశ్వర్ గల్లా, పాపినేని సాయి, వి.రామకృష్ణ, విజయభాస్కర్, ప్రొఫెసర్ రంగనాయకులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ముందే ప్రస్తావించిన విధంగా అమరావతి డిజైన్లు అందరినీ అలరించేలా రూపొందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలను ఇవ్వనుంది. 2 రోజుల సమావేశాల్లో చర్చించిన అంశాల సారాంశాన్ని డాక్టర్ పరకాల నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని, దానిని పరిశీలించిన తర్వాత అది మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన ఫోస్టర్కు పంపనున్నట్టు తెలిసింది. ఆ నివేదికలోని సలహాలు, సూచనల ప్రకారం అది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుందని సమాచారం. నామధేయాలపై సైతం చర్చ ఇదిలా ఉండగా..నిపుణుల కమిటీ కేవలం రాజధాని డిజైన్లకే పరిమితంకాకుండా అమరావతికి వివిధ దిశల్లో ముఖద్వారాలుగా ఉన్న ప్రదేశాలను మన ప్రత్యేకతలను చాటేలా రమణీయంగా రూపొందించడమెలాగన్న అంశంపై కూడా చర్చించి, సీఆర్డీయే, ఏడీసీలకు సలహాలను ఇవ్వనుందని భోగట్టా. దీంతోపాటు రాజధానిలోని వివిధ ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, ఐకానిక్ కట్టడాలకు పెట్టాల్సిన పేర్లపై కూడా కమిటీ చర్చించే అవకాశముంది. 7 నెలల వ్యవధిలోనే నిర్మితమవడం ద్వారా రికార్డు నెలకొల్పిన వెలగపూడి సచివాలయ సముదాయంలోని 6 బ్లాక్లకు కూడా చక్కటి తేటతెనుగు పేర్లను పెట్టే విషయంపై కూడా ఈ కమిటీ చర్చించనుందని సమాచారం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.