JANASENA Posted February 27, 2017 Report Posted February 27, 2017 మోసగాళ్లు ఎవరినైనా ఇట్టే మోసం చేయగలరు. వారి వాక్చాతుర్యంతో ఎంతటి తెలివివారినైనా నమ్మించేయగల సామర్థ్యులు. అందుకే అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు.. కంపెనీలు హెచ్చరిస్తుంటాయి. అయినా.. మోసగాళ్ల చేతిలో కొందరు మోసపోతూనే ఉన్నారు. ఇటీవల ఓ వ్యక్తి సాధారణ చెట్టును.. మాయమాటలతో ఒకరికి రూ.1.62కోట్లకు విక్రయించాడు. కొన్న వ్యక్తి తర్వాత అసలు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కి చెందిన లిన్ అనే వ్యక్తి 29డాలర్లకు సాధారణ చెట్టును కొనుగోలు చేశాడు. దాన్ని అరుదుగా లభించే.. ఫోయిబె జెన్నన్ జాతి చెట్టు అని.. కేవలం సిచువాన్.. హ్యూబి.. గుజావు ప్రాంతాల్లో మాత్రమే పెరిగే చెట్టు అంటూ కొనుగోలు దారుల్ని ఆకర్షించాడు. ఆ చెట్టుకు చరిత్ర ఉందని.. చాలా విలువైనదని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు రాజులు కేవలం ఈ చెట్టు కలపతోనే గృహోపకరణాలు తయారు చేయించుకునేవారని ప్రచారం చేశాడు. అంతేకాదు.. ఇది జెన్నన్ జాతి చెట్టుగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించాడు. అది నమ్మి ఓ వ్యక్తి 2,44,000డాలర్లు(సూమారు. రూ. 1.63కోట్లు) పెట్టి చెట్టును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ చెట్టును నిపుణులతో పరీక్షలు చేయిస్తే.. అది జెన్నన్ జాతి చెట్టు కాదని తేలింది.దీంతో రూ.2వేల విలువ చేసే సాధారణ చెట్టును కోటిన్నరకుపైగా పెట్టి కొన్న ఆ వ్యక్తి గుండె జారిపోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.