JANASENA Posted March 27, 2017 Report Posted March 27, 2017 లఖ్నవూ: తన నిర్ణయాలతో ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ దూసుకుపోతున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 150 గంటల్లోనే 50కి పైగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతవరకు ఒక్క కేబినెట్ సమావేశం నిర్వహించకుండానే ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం గమనార్హం. యూపీ సీఎం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి.. * యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు * అక్రమ గోవధ కేంద్రాల తొలగింపు * ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం * కార్యాలయాల్లో పాన్ మసాలా నిషేధం * ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు * మానససరోవర్ యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు * జూన్ 15నాటికి రహదారులపై గుంతలు పూడ్చేలా ఆదేశం * నేర నేపథ్యం ఉన్న కాంట్రాక్టర్లను పనుల నుంచి తప్పించడం * ఫైళ్లన్నీ ఇంటి వద్ద కాకుండా కార్యాలయంలోనే క్లియర్ చేసేలా మంత్రులకు సూచన * ప్రతి పోలీసుస్టేషన్లోనూ తాగునీటి సదుపాయం కల్పించడం * మంత్రులు, అధికారులు 15రోజుల్లోగా తమ ఆస్తుల వివరాలను అందించాలని ఆదేశం * పండుగ రోజుల్లో కోతల్లేని విద్యుత్తు అందించడం Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.